Hyderabad

News April 6, 2024

SRH VS CSK మ్యాచ్: 35,992 మంది హాజరు

image

ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన SRH VS CSK ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ని 35,992 మంది వీక్షించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. గ్రౌండ్ ఫుల్ కెపాసిటీతో నిండిపోయిందని HCA తెలిపారు. హోమ్ గ్రౌండ్లో రెండో మ్యాచ్ గెలవడం పట్ల హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, బృందం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

News April 6, 2024

నేడు HYDలో ట్రాఫిక్‌ మళ్లింపు

image

తుక్కుగూడలో కాంగ్రెస్‌ తలపెట్టిన జనజాతర బహిరంగ సభ నేపథ్యంలో సభకు వచ్చే వాహనదారులకు, సాధారణ వాహనదారులకు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పలు సూచనలు చేశారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. NH- 44 బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు పాలమాకుల, స్వర్ణభారతి ట్రస్టు, పెద్ద గోల్కొండ సర్వీసు రోడ్డు నుంచి ఓల్డ్‌ పీఎం మీటింగ్‌ స్థలం వద్ద పార్కింగ్‌ చేయాలన్నారు.

News April 6, 2024

HYD: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని మోసం!

image

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన రతన్‌కుమార్‌(22)కు తుకారాంగేట్‌‌కు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఓయో లాడ్జికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భిణి కావడంతో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించగా.. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ అయ్యాడు.

News April 6, 2024

HYD ఓటర్లకు కలెక్టర్ సూచనలు

image

✓ఫారం-12 నింపి, ఓటర్ కార్డు జత చేసి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ✓పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 15 లాస్ట్
✓మే 3 నుంచి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ అందజేసిన వారికి ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్
✓18 ఏళ్ల వయసు ఉంటే నూతన ఓటరుగా దరఖాస్తు
✓ఏప్రిల్ 14లోపు నూతన ఓటర్ నమోదు
✓మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్
• ఈ మేరకు HYD రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ అనుదీప్ సూచించారు.

News April 5, 2024

హైదరాబాద్‌లో నేటి TOP NEWS

image

> కారులో డ్రగ్స్ తరలిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ARREST
> మియాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
> నగర వ్యాప్తంగా ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
> నల్లకుంటలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుడి అదృశ్యం 
> సికింద్రాబాద్‌ స్టేషన్ సమీపంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మహిళ ARREST
> అబిడ్స్ పీఎస్ పరిధిలో పోలీసుల తనిఖీలో రూ.40 లక్షలు పట్టివేత
> ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి

News April 5, 2024

HYD: కాంగ్రెస్ జన జాతర సభను విజయవంతం చేయండి: ఎంపీ

image

కాంగ్రెస్​ పార్టీ.. చేవెళ్ల పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడలో శనివారం నిర్వహించ తలపెట్టిన జన జాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంపీ డాక్టర్​ జి.రంజిత్​ రెడ్డి పిలుపునిచ్చారు. హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ మేరకు శుక్రవారం ఆయన సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అగ్రనాయకత్వం ఈ సభ ద్వారా విడుదల చేస్తుందని అన్నారు.

News April 5, 2024

HYD: పోలీసుల తనిఖీలో రూ.40 లక్షలు పట్టివేత

image

హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణ థియేటర్ వద్ద పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా ఓ కారును ఆపి తనిఖీ చేయగా కారులో నుంచి రూ.40 లక్షలు నగదు బయటపడింది. ఇద్దరు వ్యక్తుల వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి, నగదును సీజ్ చేసినట్లు అబిడ్స్ పోలీసులు తెలిపారు.

News April 5, 2024

HYD: KCR అలా.. రేవంత్‌రెడ్డి ఇలా: రాగిడి లక్ష్మారెడ్డి

image

BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రైతుల కష్టాలను తెలుసుకోవడం కోసం మాజీ సీఎం KCR పొలం బాట పడితే.. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి వెళ్లారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను పట్టించుకోవడానికి సమయం లేని సీఎంకు, IPL చూసేందుకు ఎలా టైం దొరికిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

News April 5, 2024

HYD: ఒంటిపై బల్లి పడిందని వెళ్లి చనిపోయాడు..!

image

ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD శివారు శంకర్‌పల్లి PS పరిధిలో జరిగింది. CI తెలిపిన వివరాలు.. మండల పరిధి మాసానిగూడ వాసి రాములు(35) వ్యవసాయం చేస్తుండేవాడు. కొన్ని రోజుల క్రితం అతడికి చికెన్ పాక్స్ (అమ్మోరు) వ్యాధి సోకడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించే వాడు. ఇవాళ మధ్యాహ్నం తనపై బల్లి పడిందని, స్నానం చేసి వస్తానని చెప్పి తన పొలం వద్ద ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.

News April 5, 2024

HYD: ఐపీఎల్ మ్యాచ్.. యువతకు ఓటు హక్కుపై అవగాహన

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన 18 ఏళ్లు నిండిన యువతీయువకులకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధికారులు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఓటు ప్రాధాన్యతను తెలియజేసేలా అవగాహన నిర్వహించి చైతన్యం తేవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టామన్నారు. పోలింగ్ శాతం పెంచడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్వీప్ నోడల్ అధికారి తెలిపారు.