India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD కాప్రా మండలం జవహర్నగర్ PS పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక బీజేఆర్ నగర్ పరిధి జ్యోతిరావు కాలనీలో 4 రోజుల క్రితం ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో బాలుడు బన్సీ(7)కి తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడు ఈరోజు మృతిచెందాడు. కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదైంది.
తెలంగాణ ఉద్యమకారుడైన పద్మారావుగౌడ్ను గెలిపిద్దామని జూబ్లీహిల్స్ MLA, BRS పార్టీ HYD జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. ఈరోజు బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో BRS సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, BRS సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావుగౌడ్, పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మన్నె గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓల్డ్ సిటీలోని కబుతర్ఖానా వద్ద తుపాకీ పేలిన ఘటనలో పోలీస్ అధికారి చనిపోయిన సంగతి తెలిసిందే. మహబూబ్నగర్ 10వ బెటాలియన్కు చెందిన TSSP AR SI బాలేశ్వర్ (48) విధుల నిర్వహణలో భాగంగా శనివారం పాతబస్తీకి వచ్చారు. ఆదివారం ఉ. 5.30 గంటలకు తన సర్వీస్ గన్తో సూసైడ్ చేసుకొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంటింటి చెత్త సేకరణను 100% విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ నగరవాసులకు సూచించారు. స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వకుండా, రోడ్లపై పడేస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. వారం రోజుల బస్తీ కార్యాచరణతో సాధ్యమైన ఫలితాలను వివరిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి సమావేశాలతో 1,87,752 ఇళ్ల యజమానులు స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వట్లేదని.. ఇకనైనా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని పేర్కొన్నారు.
HYDలో దారుణఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ వాసి హన్స్రామ్(38) కుత్బుల్లాపూర్లో ఉంటున్నాడు. భార్య 2 నెలల క్రితం ఊరెళ్లింది. నాటినుంచి జీడిమెట్లలోని బినయ్సింగ్ గదిలో ఉంటున్నాడు. మంగళవారం అన్నం వండలేదని బినయ్సింగ్ను అదే గదిలో ఉండే సందీప్, సోను మద్యం మత్తులో కొట్టారు. హన్స్రామ్నూ విచక్షణా రహితంగా కొట్టడంతో చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్లో ఇంటర్, పాఠశాల విద్యార్థులకు వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోర్సుల్లో నెల రోజుల శిక్షణకు ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
HYDలో ఈ వేసవిలో ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది. దీనినే అదునుగా చేసుకుని కొంత మంది HMWSSB ట్యాంకర్ డ్రైవర్లు వినియోగదారుల వద్దకు వెళ్లి కమిషన్ అడుగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మెహదీపట్నం సెక్షన్ పరిధిలో ఓ వ్యక్తి ట్యాంకర్ బుక్ చేశాడు. ఒక ట్యాంకర్ ఖరీదు రూ.500 కాగా చేతి ఖర్చుల పేరిట రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. దీనిపై స్పందించిన HMWSSB అధికారులు అలా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని BRS పార్టీ అసెంబ్లీ స్థానాల వారీగా ఎన్నికల సమన్వయకర్తలను నియమించింది. మేడ్చల్-శంభీపూర్ రాజు(MLC), మల్కాజిగిరి-నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్-గొట్టిముక్కల వెంగళరావు ,కూకట్పల్లి-బేతిరెడ్డి సుభాష్ రెడ్డి, ఉప్పల్-జహంగీర్ పాషా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ -రావుల శ్రీధర్ రెడ్డి, ఎల్బీనగర్ -బొగ్గరపు దయానంద గుప్త ఎమ్మెల్సీని నియమించారు.
HYD దుర్గంచెరువు వద్దకు వచ్చేవారు సెల్ఫీలు దిగేందుకు కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లకూడదని మాదాపూర్ సీఐ మల్లేశ్ తెలిపారు. సెల్ఫీల కోసం రోడ్లపైకి రావడంతో తరుచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎవరైనా సెల్ఫీల కోసం దుర్గంచెరువు మీదకు వస్తే రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. SHARE IT
HYD ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు దాదాపు రూ.1.63 కోట్ల కరెంట్ బిల్లులు బకాయి ఉండటంతో ఇటీవలే కరెంట్ కట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా శనివారం HCA, TSSPDCL ఎండీ ముషారఫ్తో జరిపిన చర్చలు ఫలించాయి. స్టేడియం కరెంట్ బిల్లుల బకాయిలను ఇన్స్టాల్మెంట్స్ ప్రకారంగా చెల్లిస్తామని HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలపగా ఎండీ అంగీకరించినట్లుగా పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.