India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగుల నుంచి రూ.10 లక్షలు తీసుకుని పరారైన ఘటన HYDలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. విజయవాడకు చెందిన మహమ్మద్ ఇలియాజ్ ‘ESIలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, నకిలీ ఆర్డర్ కాపీలు ఇచ్చి గండీడ్, పరిగి మండలాలకు చెందిన నిరుద్యోగుల నుంచి రూ.10 లక్షలు తీసుకొని పరారయ్యాడు. దీంతో HYD పంజాగుట్ట PSలో బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తమకు న్యాయం చేయాలని కోరారు.
మల్కాజిగిరి MP సెగ్మెంట్లో ఇప్పటి వరకు BRS గెలుపొందలేదు. తెలంగాణ ఉద్యమ వేడి ఉన్న రోజుల్లోనూ, KCR హవా నడుస్తున్న సమయంలోనూ ఇక్కడ TDP, కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని గులాబీ పార్టీ శ్రమిస్తోంది. ఈ దశలోనే BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ క్యాండిడేట్ అని.. సునీతామహేందర్ రెడ్డి (కాంగ్రెస్), ఈటల రాజేందర్ (BJP) నాన్ – లోకల్ అని BRS శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
HYD హబ్సిగూడలోని NGRIలో సమ్మర్ ఇంటర్న్షిప్-2024 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జియో ఫిజిక్స్, జియాలజీ, ఎర్త్ సైన్సెస్ విభాగాల్లో చదువుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.NGRI రీసెర్చ్ ప్రాజెక్టులో 6-8 వారాలపాటు ఉంటుందని, షేరింగ్ బేసిస్ ఉచిత వసతి ఉంటుందన్నారు. వెబ్ సైట్ https://rectt.ngri.res.in/TrainingInterns/ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
RTCబస్సు ఎక్కడ ఉందో.. ఎప్పుడొస్తుందో తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన ట్రాకింగ్ యాప్ ‘గమ్యం’ ప్రయాణికులకు అరకొరగానే ఉపయోగపడుతోందని అంటున్నారు. ఈయాప్ను ప్రారంభించి దాదాపు 8నెలలు అవుతోంది. సెల్ ఫోన్లో ‘గమ్యం’ యాప్ తెరిచి బస్సుల జాడ కోసం ప్రయత్నిస్తున్న వారికి పలు సందర్భాల్లో సమాచారం రావడం లేదంటున్నారు. సర్వీస్ రూట్ల వివరాలను నమోదు చేయడంలో పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
HYD శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో కొలువుదీరిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన వేళలను మార్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చన్నారు. శని, ఆదివారాల్లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు భక్తులు రావచ్చన్నారు. SHARE IT
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) సెకండరీ(పదో తరగతి), సీనియర్ సెకండరీ(12వ తరగతి) పబ్లిక్ పరీక్షలు ఈనెల 6 నుంచి మే 22వరకు నిర్వహించనున్నట్లు NIOS HYD ప్రాంతీయ సంచాలకులు పి.సుబ్రమణ్యం తెలిపారు. విద్యార్థులు పరీక్ష తేదీలకు సంబంధించిన షెడ్యూల్తో పాటు హాల్టికెట్లను NIOS వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 040-24752859, 24750712నంబర్లను సంప్రదించాలని సూచించారు.
రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అలైన్మెంట్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోడ్డు నిర్మాణంలో సాగు భూములు కోల్పోకుండా, రైతులకు నష్టం వాటిల్లకుండా రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. RRR ఉత్తర భాగంలోని యాదాద్రి జిల్లా పరిధిలో అలైన్మెంట్లో ఈ మార్పులు జరగనున్నట్టు సమాచారం. అధికారులు ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. అలైన్మెంట్ మార్పుతో DPRలోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
మల్కాజిగిరిలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావుపై తన అల్లుడిని నిలబెట్టి మల్లారెడ్డి గెలిపించుకున్నారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు ఇన్ఛార్జ్ బాధ్యతలను మైనంపల్లికి అధిష్ఠానం అప్పగించగా కచ్చితంగా గెలిపిస్తానన్నారు. అయితే మల్కాజిగిరిలో BRSను గెలిపిస్తానని ఇటీవల మల్లారెడ్డి అన్నారు. దీనిపై మీ కామెంట్?
ఓయూకు వచ్చే నెలలో కొత్త వీసీ రానున్నారు. వీసీ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న 93 మంది ప్రొఫెసర్లలో అత్యధికంగా రిటైర్ అయిన అధ్యాపకులు, కొందరు ప్రొఫెసర్లు ఓయూతో పాటు ఇతర వర్సిటీలకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతోపాటు గతంలో వీసీలుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. ప్రొఫెసర్ల వివరాలపై ఇంటిలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఆస్తి పన్ను వసూళ్ల నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలం మయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆరు జోన్ల పరిధిలో రూ. 2100కోట్ల టార్గెట్ను కమిషనర్ ఖరారు చేయగా.. దాదాపుగా రూ.1914.87 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 90 శాతం వడ్డీ
రాయితీతో ఓటీఎస్ స్కీంను తీసుకొచ్చారు. అయినా కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. దీనిపై మీ కామెంట్.
Sorry, no posts matched your criteria.