India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
BJP గోషామహల్ MLAను రాజాసింగ్ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సాయంత్రం ఆయన చెంగిచర్లకు వెళ్తానని ప్రకటించారు. శాంతిభద్రతల దృష్ట్యా రాజాసింగ్ను ఆయన నివాసం వద్ద అడ్డుకొన్నారు. పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి పాలనకు తేడా లేదు. కేసీఆర్ హయాంలో జరిగినట్లు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా హిందువులపై దాడులు జరుగుతున్నాయి’ అంటూ రాజాసింగ్ మండిపడ్డారు.
HYD, ఉమ్మడి RR జిల్లాల పరిధిలో మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో బోరబండ 40.6, మొయినాబాద్ 40.6, కందుకూరు 40.5, యాలాలలో 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లుగా TSDPS తెలిపింది. BP, షుగర్, చర్మ వ్యాధులు ఉన్నవారు 11AM నుంచి 4PM మధ్య బయటకురాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ లా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ల బీబీఏ ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీకామ్ ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ ఆనర్స్ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
HYD, RR, MDCL,VKB జిల్లాల రైల్వే ప్రయాణికులకు SCR గుడ్ న్యూస్ తెలిపింది. సికింద్రాబాద్, HYD, బేగంపేట, లింగంపల్లి, హైటెక్ సిటీ, వికారాబాద్ స్టేషన్లలో QR కోడ్ ద్వారా నగదు చెల్లింపుల సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలియజేశారు. బోర్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. త్వరలో మిగతా స్టేషన్లలో అందుబాటులోకి తెస్తామన్నారు.
రంజాన్ వేళ HYD నగరంలో డ్రై ఫ్రూట్స్కు డిమాండ్ పెరిగింది. HYD దేశంలోనే ఖర్జూరాలను అధికంగా అవిక్రయించే నగరంగా పేరుగాంచింది. ఏటా సుమారు 400 ట్రక్కుల ఖర్జురాలను విక్రయిస్తారు. దాదాపు బేగంబజార్లో 40 రకాల ఖర్జూరాలు విక్రయిస్తుండగా.. కిమియా , షికారి, కూద్రి, మజాపాతి, కాల్మీ ప్రసిద్ధిగాంచినవి. మరోవైపు అమెరికా, అరబ్ దేశాల నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి HYD నగరానికి డ్రై ఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి.
HYD నగరంలో వేసవి వేళ మామిడి పండ్ల క్రయ విక్రయాలు పెరిగాయి. ఇదే అదునుగా వ్యాపారులు మామిడికాయ త్వరితగతిన పక్వానికి రావడానికి కెమికల్ ప్యాకెట్లను కాయల మధ్య ఉంచుతున్నారు. ఇలా చేసి పండించిన పండ్లను తినడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుందని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ శివలీల తెలిపారు. కాగా ఇటీవలే బాటసింగారంలో వేలాది పండ్లను సీజ్ చేశారు. మామిడి పండ్లు కొనేటప్పుడు జర జాగ్రత్త..!
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో 41.2 డిగ్రీలు, రెడ్డిపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే ఆస్కారం ఉందని వాతవారణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని సూచించింది.
హైదరాబాద్లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా బుధవారం నగరానికి విచ్చేసిన నీతా అంబానీ ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న నీతా అంబానీకి ఈవో కుంట నాగరాజు, ఛైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్ ఘన స్వాగతం పలికారు. దాదాపు 15 నిమిషాల పాటు నీతా అంబానీ ఎల్లమ్మ అమ్మవారి సన్నిధిలో గడిపారు. అనంతరం మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు.
శ్రీ రామనవమికి భాగ్యనగరం ముస్తాబవుతోంది. 20 రోజుల ముందే ఆయా ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ధూల్పేటలో నిర్వహించే రాముడి శోభాయాత్రకు తరలిరావాలని రాజాసింగ్ పిలుపునిస్తున్నారు. ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 11 గంటలకు ఆకాశ్పురి హనుమాన్ టెంపుల్ నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. యాత్రను విజయవంతం చేయాలంటూ ఆయన అనుచరులు, అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
HYDలో దారుణఘటన వెలుగుచూసింది. మద్యానికి డబ్బులివ్వలేదని భార్యను చంపేశాడో భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడలోని రహీంపురకాలనీకి చెందిన అబ్దుల్ సలీమ్, ఆస్మా ఫాతిమా దంపతులు. నిత్యం మద్యం సేవించి భార్యతో సలీమ్ గొడవపడేవాడు. మంగళవారం రాత్రి మందు తాగేందుకు డబ్బులివ్వాలని అడిగాడు. ఫాతిమా ఇవ్వకపోవడంతో గొంతునులిమి చంపేశాడని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు.
Sorry, no posts matched your criteria.