India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మరో పది రోజుల్లో వివాహం ఉండగా ఓ యువతి అదృశ్యమైన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీరాములు ప్రకారం.. రసూల్పురాకు చెందిన విఠల్ సింగ్ కుమార్తె గంగాబాయి(25) మెడికోవర్ హాస్పటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. మే 1న గంగాబాయికి వివాహం నిశ్చయించారు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్సిటీ, కేబీహెచ్బీ, నారాయణగూడ, హిమాయత్నగర్, లంగర్హౌజ్, మెహదీపట్నం, గచ్చిబౌలీ, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడుతోంది. అకాల వర్షంతో వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. కాగా, కొన్ని రోజులుగా ఎండ వేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తాజా వాతావరణం ఉపశమనం కలిగిస్తోంది.
బోధన్ మాజీ MLA షకీల్ కొడుకు రాహిల్ యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45లో జరిగిన యాక్సిడెంట్ నివేదికపై ఉన్నతాధికారులు స్పందించారు. రూ.లక్షలు వసూలు చేసి షకీల్ కొడుకు బదులుగా మరొకరు డ్రైవింగ్ చేస్తున్నట్లు FIR నమోదు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో పాత బంజారాహిల్స్ ACP సుదర్శన్, CI రాజ్ శేఖర్ రెడ్డి, SI చంద్ర శేఖర్ను సస్పెండ్ చేస్తూ DGP ఉత్తర్వులు జారీ చేశారు.
HYD నగరంలోని ఓ ప్రముఖ డిగ్రీ కళాశాలలో పది మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం తొలి సెమిస్టర్లో ఒక్కో సబ్జెక్టులో ఫెయిలయ్యారు. రీవాల్యుయేషన్లో వారే తొంభై శాతానికి పైగా మార్కులతో పాసయ్యారు. ఉస్మానియా వర్సిటీ అనుబంధ కళాశాలల్లో కొందరు ఫస్టియర్ విద్యార్థుల అనుభవమిది. రెగ్యులర్ పరీక్షలో ఫెయిలై రీవాల్యుయేషన్లో పాసయ్యారంటే మూల్యాంకనంలోనే లోపాలున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బోణి కొట్టనుందా? ఇప్పటివరకు BRS పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేదు. 2009 కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వే సత్యనారాయణ, 2014లో బీజేపీ+టీడీపీ అభ్యర్థిగా చామకూర మల్లారెడ్డి, 2019లో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటివరకు ఈ స్థానంలో బీఆర్ఎస్ గెలవలేదు. 2024లో గెలుస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.
HYD నగరంలో ఎండ దంచికొడుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. శుక్రవారం మూసాపేట్, కేపీహెచ్బీ 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులురలో 42.9, బన్సీ తెలిపారు. యాకుత్పులాల్ పేట్ 42.7, షేక్పేట్ 42.7, కూకట్పల్లి 42.7, మలక్పేట్ 42.5, మియాపూర్లో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
సెల్ ఫోన్ అతిగా వాడొద్దన్నందుకు విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బహదూర్పురా ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్ వివరాల ప్రకారం.. కిషన్ బాగ్కు చెందిన అశుతోష్ జాదవ్(17) ఇంటర్ చదువుతున్నాడు. రోజూ గంటల కొద్దీ ఫోన్లో గడుపుతుండటంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన అతడు.. గదిలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేశారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఓటర్ల పై బెదిరింపులకు పాల్పడకుండా ఉండేందుకు లైసెన్స్ ఆయుధాలు కలిగిన వారికి నోటీసులు జారీ చేసే డిపాజిట్ చేయాలని సూచించినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. దీంతో 897 మంది లైసెన్స్ ఆయుధాల డిపాజిట్ చేసినట్లుగా పేర్కొన్నారు.
వచ్చేనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది కొరత ఏర్పడటంతో దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వారిని వెంటనే ఎన్నికల విధులకు రిపోర్టు
చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు. దీర్ఘకాలిక సెలవులతో పాటు విదేశీ ప్రయాణాలకు శాఖల అనుమతులు తీసుకున్న వారు కూడా ఎన్నికల విధుల్లోకి రావాలని ఆదేశించారు.
ఏప్రిల్ 21న (ఆదివారం) మహవీర్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు జైనులు సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్లో వీరి సంఖ్య ఎక్కువే ఉండడంతో ఆ రోజు భారీ ర్యాలీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలోనే GHMC పరిధిలో మాంసం దుకాణాలు (మటన్, పశువుల కబేళాలు, బీఫ్ షాపులు) మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. SHARE IT
Sorry, no posts matched your criteria.