Hyderabad

News April 10, 2024

HYD: అర్ధరాత్రి ఇంటికెళ్లి బాలికపై అత్యాచారయత్నం

image

యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన సికింద్రాబాద్ కార్ఖానా పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోయిన్‌పల్లి మడ్‌ఫోర్ట్ వద్ద నివాసం ఉండే బాలిక(17)పై అర్ధరాత్రి ఆ ప్రాంతంలోనే నివాసించే భాను(25) అనే యువకుడు అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు మంగళవారం కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

News April 10, 2024

HYD: ‘గోవాలో పుట్టినరోజు జరుపుకొని వస్తూ డ్రగ్స్ తెచ్చారు’

image

HYD సనత్‌నగర్ బస్టాండ్‌లో నాగరాజ్‌ అనే యువకుడితో పాటు అతడి నలుగురు స్నేహితులను అరెస్ట్ చేశామని SOT రాజేంద్రనగర్ టీం తెలిపింది. వారి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్, 5గ్రాముల గంజాయి, OCB రేపర్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. విచారణలో ఏప్రిల్ 4న నాగరాజ్‌ స్నేహితుడు దిలీప్ పుట్టినరోజు సందర్భంగా నలుగురు స్నేహితులతో గోవాకు వెళ్లి MDMA డ్రగ్‌తోపాటు GOA నుంచి బస్సులో HYDకు తిరిగి వచ్చారని తేలిందన్నారు.

News April 10, 2024

HYD: ‘కారు’కు బ్రేక్ వేసేందుకు ‘చేయి’ వ్యూహం!

image

పార్లమెంట్‌ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో అధికార కాంగ్రెస్‌ ప్రచారంలో దూకుడు పెంచింది. తుక్కుగూడలో ఇటీవల నిర్వహించిన జన జాతర సభతో కాంగ్రెస్‌ కేడర్‌లో జోష్‌ మరింత పెరిగింది. HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధించాలని, క్షేత్రస్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైన BRSకు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేతలకు సూచనలు చేశారు. మీ కామెంట్?

News April 10, 2024

HYD: తాగునీటి సరఫరాకు ప్రత్యేక కార్యచరణ

image

రాజధానిలో అంతర్భాగమైన RR, మేడ్చల్ జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి విజయేంద్రబోయి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఏప్రిల్ తొలి వారం నుంచి జూన్ వరకు 2నెలల పాటు మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లు, మండలాల ప్రత్యేకాధికారులు, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని, జలమండలి, మిషన్ భగీరథ అధికారులతో నిత్యం సంప్రదింపులు నిర్వహించాలన్నారు.

News April 10, 2024

HYD: అర్ధరాత్రి గుడి ముందు MURDER

image

ఫుట్‌పాత్‌పై పడుకునే విషయంలో తలెత్తిన ఘర్షణ చివరకు హత్యకు దారితీసిన ఘటన HYD పహాడీషరీఫ్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్ర వాసి కామ్ సింగ్(40), జల్‌పల్లి వాసి నవనాథ్ స్థానికంగా ఉంటూ పోచమ్మ గుడి ముందు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వీరి మధ్య ఘర్షణ జరగగా నవనాథ్ కోపంలో రాయితో కామ్ సింగ్ తలపై మోది హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.

News April 10, 2024

HYD: రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుక‌లు

image

తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి జూల‌ప‌ల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం HYD రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మేలు కలగాలని, ప్ర‌జ‌లంద‌రి కొత్త ఆశయాలు నెర‌వేరాలన్నారు. సీఎస్ శాంతి కుమారి, షాద్‌నగర్ MLA వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

News April 10, 2024

HYD: నాకు టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ MIMకు మద్దతిచ్చినట్టే: ఫిరోజ్‌ఖాన్

image

HYDలో ఒవైసీని ఢీకొట్టే సత్తా తనకే ఉందని, కాంగ్రెస్ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని కార్యకర్తలు అంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర నేత ఫిరోజ్‌ఖాన్ అన్నారు. తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే కార్యకర్తలు నిరుత్సాహపడతారని, కాంగ్రెస్ పరోక్షంగా MIMకు మద్దతిచ్చినట్టేనని పేర్కొన్నారు. బలహీనమైన అభ్యర్థిని నిలబెడితే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఏదేమైనా హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. మీ కామెంట్?

News April 10, 2024

చార్మినార్‌ వద్ద ఇదీ పరిస్థితి!

image

రంజాన్ సమీపిస్తున్న వేళ ఓల్డ్ సిటీ కళకళలాడుతోంది. చార్మినార్, మదీనా, లాడ్‌బజార్‌‌కు సాయంత్రం నుంచే వేలాదిగా జనం తరలివస్తున్నారు. పండగకు మరో రెండ్రోజులే సమయం ఉండడంతో‌ పాషింగ్‌ కోసం క్యూ కట్టారు. అర్ధరాత్రి వరకు ఇక్కడ దుకాణాలు తెరిచి ఉండడంతో చార్మినార్‌ పరిసరాలు సందడిగా మారాయి. ఇందుకు సంబంధించిన ఫొటో‌లను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
PIC CRD: Anjum Alam

News April 9, 2024

హైదరాబాద్‌లో BRS లీడర్‌కు తప్పిన ప్రమాదం

image

HYDలో BRS లీడర్‌కు ప్రమాదం తప్పింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్‌ ఖైరతాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తన మిత్రుడిని పరామర్శించి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలో (కొత్తపేట క్రాస్ రోడ్డు సమీపంలో) టైరు పగిలిపోవడంతో కారు అదుపు తప్పి మెట్రో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఎయిర్‌బెలూన్స్ ఓపెన్ కావడంతో పల్లె రవి, డ్రైవర్‌ ఖదీర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

News April 9, 2024

HYD: కాంగ్రెస్‌లోకి అంబర్‌పేట MLA.. క్లారిటీ

image

తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అంబర్‌పేట MLA కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇదంతా హస్తం పార్టీ మైండ్ గేమ్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. 2 పర్యాయాలు తనను ఎమ్మెల్యేగా గెలిపించింది కారు గుర్తు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చలువతోనే తాను ఎమ్మెల్యే అయ్యాయని కాలేరు వెల్లడించారు.

error: Content is protected !!