Hyderabad

News March 31, 2024

HYD: ఎయిర్‌పోర్టు ప్రవేశమార్గం వరకు ఏసీ బస్సులు

image

HYD నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ఆర్టీసీ ఏసీ పుష్పక్ బస్సులు నేరుగా ఎయిర్‌పోర్ట్ ప్రవేశం మార్గం వరకు వెళ్లనున్నాయి. శనివారం నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. HYD నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు నడిచే 49 ఏసీ బస్సులు అరైవల్స్‌తో పాటు డిపార్చర్స్ వద్ద కూడా ఆగనున్నాయి.

News March 31, 2024

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ నిరాశ!

image

హైదరాబాద్‌లో BRSకు‌ ఎదురుదెబ్బలు తప్పడంలేదు. గత GHMC ఎన్నికల్లో 48 స్థానాల్లో విజయం సాధించిన గులాబీ పార్టీ ప్రస్తుతం 10 మందిని కోల్పోయింది. మేయర్‌, డిప్యూటీ మేయర్, బొంతు శ్రీదేవి, బాబా ఫసియుద్దీన్‌‌తో పాటు కీలక నేతలు INCలోకి చేరిపోయారు. మరో 10 మంది కార్పొరేటర్లు కూడా BRSను వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా రోజుకొకరు పార్టీని వీడుతుండటం గులాబీ శ్రేణులను నిరాశ పరుస్తోంది. దీనిపై మీ కామెంట్..?

News March 30, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> కాంగ్రెస్ పార్టీలో చేరిన GHMC మేయర్
> సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద డీజిల్ పోసుకొని ఓ వ్యక్తి హల్‌చల్ > లంచం తీసుకుంటూ దొరికిన మీర్‌పేట SI
> HYD ఎన్నికల అధికారులకు కాంప్రహెన్సివ్ ట్రైనింగ్
> టెట్‌ ఫీజు‌ తగ్గించాలని ఓయూలో విద్యార్థులు డిమాండ్
> నల్లగండ్ల చెరువును పరిశీలించిన GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్
> త్యాగరాయగానసభలో ఆకట్టుకున్న గానవిభావరి
> OYO హోటల్‌లో యువతిపై అత్యాచారం

News March 30, 2024

హైదరాబాద్‌లో బలపడుతున్న కాంగ్రెస్..!

image

HYDలో‌ కాంగ్రెస్‌ క్రమంగా బలపడుతోంది. గత GHMC ఎన్నికల్లో 150 స్థానాలకు ఉప్పల్, ASరావునగర్‌లోనే విజయం సాధించిన కాంగ్రెస్ ఎట్టకేలకు లింగోజిగూడ‌ బైపోల్‌లో గెలిచింది. ఇటీవల కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సైతం పార్టీని వీడారు. ఎన్నికల ముందు HYDలో బలహీనంగా ఉన్న INC అధికారం చేపట్టిన తర్వాత పుంజుకుంది. వరుస చేరికలతో గ్రేటర్‌లో కాంగ్రెస్ కార్పొరేటర్లు డబుల్‌ డిజిట్‌(12)కు చేరారు. మరో 10 మంది చేరుతారని టాక్.

News March 30, 2024

HYD: విద్యుత్ వినియోగం‌లో రికార్డ్ బ్రేక్..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజు రోజుకి విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ నెల 28న ఏకంగా 79.48 మిలియన్ యూనిట్ల కరెంట్‌ను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా మే నెలలో ఈ స్థాయిలో ఉంటుందని, ఈ ఏడాది మార్చిలోనే ‌ఆ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. గతేడాది అత్యధికంగా మే 19న 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. ఈ ఏడాది మార్చిలోనే‌ ఆ రికార్డు‌ బ్రేక్‌ అవ్వడం గమనార్హం.

News March 30, 2024

HYD: OYO హోటల్‌లో యువతిపై అత్యాచారం

image

HYDలో దారుణఘటన వెలుగుచూసింది. KPHB‌లోని ఓ హాస్టల్‌లో ఉండే యువతి(22)కి‌ 8 నెలల క్రితం డెలివరీ బాయ్‌‌ ఒబెదుల్లాఖాన్(23)తో‌ స్నేహం ఏర్పడింది. MAR 28న డిన్నర్ చేద్దామని చెప్పి అమ్మాయిని జూబ్లీహిల్స్‌లోని OYOకి తీసుకెళ్లాడు. హోటల్‌లోనే మద్యం తాగి అక్కడే నిద్రపోయారు. మత్తులో ఉన్న ఆమెపై ఒబెదుల్లాఖాన్ అత్యాచారం చేశాడు. శుక్రవారం యువతి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

News March 30, 2024

HYD: లంచం తీసుకుంటూ దొరికిన SI

image

మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ACB అధికారులు సోదాలు జరిపారు. రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా SI సైదులుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ స్థలం విషయంలో సుభాశ్ అనే వ్యక్తిని ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శనివారం ACB రైడ్స్ చేసింది. ఆయన ఇంట్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

News March 30, 2024

HYD: సీఎంని కలిసిన నందమూరి సుహాసిని

image

HYD నగరంలో తెలంగాణ టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిశారు. సుహాసినిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సమాచారం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి సురేఖ, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News March 30, 2024

HYD: 4 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ కొత్త వ్యూహాం!

image

GHMC పరిధిలోని 4 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రతినిధులు, MLAల బలం అవసరమని భావిస్తోంది. ఇప్పటికే చేరికలు ప్రారంభం కాగా.. ఈ నియోజకవర్గాల పరిధిలో మరికొంతమంది MLAలను పార్టీలో చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఐదుగురు MLAలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల ముందు మరికొందరు చేరే అవకాశం ఉందని సమాచారం.

News March 30, 2024

HYD: వ్యభిచార గృహంపై ఎస్ఓటీ పోలీసుల దాడి

image

వ్యభిచార గృహంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన ఘటన ఉప్పల్ PS పరిధిలో జరిగింది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సురేష్ అనే ఆర్గనైజర్ విజయపురి కాలనీలో ఇల్లును అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఓ మహిళ(30)తో వ్యభిచారం నడిపిస్తున్నాడు. కస్టమర్ వ్యభిచార గృహంలో ఉండగా.. మల్కాజిగిరి SOT పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆర్గనైజర్ సురేశ్ పరారీలో ఉన్నాడు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!