India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మల్కాజిగిరిలో విజయం ఎవరిదనేది హాట్ టాపిక్గా మారింది. 2019లోనూ రసవత్తర పోరు సాగింది. రాజశేఖర్ రెడ్డి(BRS)పై రేవంత్ రెడ్డి (INC) 10,919 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాంచందర్ రావు(BJP) 3వ స్థానంలో నిలిచారు. కానీ, ప్రస్తుత రాజకీయాలు మారాయి. ఎన్నికలకు ముందు ఈటల (BJP), సునీత (INC), రాగిడి (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు తమదే మెజార్టీ అంటున్నారు. మీ కామెంట్?
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సామాజిక ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేకుండా హామీలు ఇవ్వడం బాధాకరమని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రెస్మీట్ నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం అసాధ్యమన్నారు. వారు అమలు చేయాలని చూసినా రాష్ట్ర ఖజానాలో నిధులు లేవన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని విభాగాల బీఈ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాల రివాల్యుయేషన్కు ఒక్కో పేపర్కు రూ.800 చెల్లించి ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 25వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందాలనుకునే వారు ఒక్కో పేపర్కు రూ.1,000 చెల్లించి 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
హైదరాబాద్లో 201 కేసుల్లో రూ.50 వేలకు మించి ఆధారాలు లేని రూ.8,48,65,710 నగదుకు సంబంధించి జిల్లా గ్రీవెన్స్ కమిటీకి సిఫారసు చేసినట్లు HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. దీంట్లో 192 కేసులకు సంబంధించి రూ.5,93,29,772 డీజీసీ ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు.
బీసీల వాటా బీసీలకు ఇవ్వకపోతే దేశంలో తిరుగుబాటు తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం HYD విద్యానగర్లోని బీసీ భవన్లో జరిగిన 16వ బీసీ సంఘాల సమావేశం అనంతరం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు గడిచినా పేద – ధనిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని పేర్కొన్నారు.
GHMC తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. HYD బంజారాహిల్స్ రోడ్డులో హోర్డింగులు కార్లపై పడి ధ్వంసమైన ఫిర్యాదు 2016లో అందగా.. 2024 మే 15న రాత్రి స్పందించడం విమర్శలకు దారితీసింది. స్పందించిన కొద్దిసేపటికే X నుంచి మేసేజ్ డిలీట్ చేసింది. మరోవైపు GHMCకి ఫిర్యాదు చేసినా.. నెలల తరబడి సమస్యలకు పరిష్కారం చూపడం లేదని పలువురు ఆరోపించారు. మీరు ఫిర్యాదు చేస్తే స్పందిస్తున్నారా కామెంట్ చేయండి?
జూన్ ప్రారంభంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో రవాణా శాఖ అధికారులు బస్సుల ఫిట్నెస్పై యాజమాన్యాలకు పలు సూచనలు చేస్తున్నారు. గ్రేటర్ HYD పరిధిలో 11,834 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 70 శాతం బస్సులు ఫిట్నెస్ రెన్యూవల్ చేసుకున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడిపితే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
HYD నగరంలోని పలు చోట్ల మరో రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మెన్ తెలిపింది. క్యుములోనింబస్ మేఘాలు మేఘావృతమై ఉన్నట్లు తెలియజేసింది. ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల బెల్ట్ ప్రాంతాల్లో చిరుజల్లులు ప్రారంభమైనట్లు పేర్కొంది. HYD నగరంలో నేడు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
చేవెళ్ల లోక్సభ పరిధిలో ఐటీ ఉద్యోగులు, విద్యావంతులు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి, RJNR, మహేశ్వరం ఓటర్ల పైనే BJP ఆశలు పెట్టుకుంది. కాగా ఆయా నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాకపోవడం BJP అభ్యర్థిని ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు VKB, పరిగి, తాండూరు, చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల ఓటర్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. పట్టణ ప్రాంతాల్లో BRS ఓట్లు డైవర్షన్ అయినట్లు చర్చ సాగుతోంది.
HYD కాలుష్య నియంత్రణ మండలి ప్రతి నెల గండిపేట్, ముసారాంబాగ్, నాగోల్, ఫిర్జాదిగూడ, ప్రతాప సింగారం వరకు మూసీ నదిలో నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తోంది. ఆర్టీడబ్ల్యూఎంఎస్ ద్వారా నీటిలోని ఆక్సిజన్, అమ్మోనియా, బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (COD), నైట్రేట్, ఫ్లోరైడ్, పీహెచ్ తదితర పరిమాణాలను లెక్కిస్తున్నారు. కానీ వాటి వివరాలు అధికారులు వెల్లడించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.