Hyderabad

News April 26, 2024

HYD: వడదెబ్బతో వ్యక్తి మృతి

image

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం రంగంపల్లి శివారులో వడదెబ్బకు వ్యక్తి మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మొగలిగిద్దకు చెందిన సత్తయ్య(60) షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. మతిస్తిమితం సరిగా లేని ఇతడు కొంతకాలంగా ఇంటికి రాకుండా తిరుగుతున్నాడు. ఇదే క్రమంలో రంగంపల్లి వద్ద సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందాడు.మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేశారు.

News April 26, 2024

చేవెళ్లలో 64 మంది 88 నామినేషన్లు

image

RR జిల్లా చేవెళ్ల లోక్‌సభ స్థానానికి 64 మంది అభ్యర్థులు 88 నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి నాలుగో సెట్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరఫున ఆయన తనయుడు కాసాని వీరేశ్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్వతంత్రులు నామినేషన్ వేశారు.

News April 26, 2024

HYD: పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం!

image

HYD, RR, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అనేక చోట్ల రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ కార్డుదారుల నుంచి అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనిపై నిఘా పెట్టిన అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. 3 జిల్లాల్లో అధికారిక లెక్కల ప్రకారం పట్టుబడిన వారిపై శాఖాపరంగా ఏటా 250 కేసులు, క్రిమినల్ కేసులు 1800కి పైగా నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.

News April 26, 2024

ఎంపీ ఎన్నికలు.. TGలోనే మల్కాజిగిరి‌ టాప్

image

మల్కాజిగిరి MP స్థానానికి TGలోనే అత్యధికంగా 114 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజు ఏకంగా 61 మంది 91 సెట్‌లు అందజేశారని ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. APR 18 నుంచి 25 వరకు నిర్వహించిన నామినేషన్ల స్వీకరణలో భాగంగా 114 మంది అభ్యర్థులకుగాను 177 నామినేషన్ల పత్రాలు దాఖలు చేసినట్లు వివరించారు. దేశంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన మల్కాజిగిరి(మినీ ఇండియా)లో అదే స్థాయిలో నామినేషన్లు వచ్చాయి.

News April 26, 2024

GHMC సమ్మర్ క్యాంప్ కోచింగ్.. JUST రూ.10

image

HYDలో ఉన్న పిల్లలకు GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ గుడ్ న్యూస్ తెలిపారు. కేవలం రూ.10తో సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు sports.ghmc.gov.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. 37 రోజుల పాటు 44 క్రీడలపై శిక్షణ అందించనున్నారు.

News April 25, 2024

హైదరాబాదీలకు రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి

image

హైదరాబాద్‌ డెవలప్‌మెంట్‌ బాధ్యత కాంగ్రెస్ తీసుకొంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం రాజేంద్రనగర్‌లో MP అభ్యర్థి రంజిత్‌ రెడ్డికి మద్దతు‌గా ప్రచారం నిర్వహించారు. రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి మూసీ నదిని సుందరీకరిస్తామని CM హామీ ఇచ్చారు. ఇక్కడి భూముల విలువను పెంచుతామన్నారు. ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ MP అభ్యర్థిని పార్లమెంట్‌కు పంపాలని ఓటర్ల‌ను విజ్ఞప్తి చేశారు.

News April 25, 2024

HYD: పార్టీలో చేరికలపై టీ కాంగ్రెస్ ఫోకస్

image

ఏఐసీసీ ఇచ్చిన నిర్దిష్ఠ ఆదేశాల మేరకు చేరికల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ భావ సారూప్యత, సిద్ధాంతం పట్ల నమ్మకం, అవగాహన ఉన్న నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది. కమిటీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఉంటారని పేర్కొన్నారు.

News April 25, 2024

సికింద్రాబాద్ MP అభ్యర్థిగా ఆటో డ్రైవర్ నామినేషన్

image

సికింద్రాబాద్ పార్లమెంట్ MP అభ్యర్థిగా ఆటో డ్రైవర్ నామినేషన్ దాఖలు చేశారు. వారసిగూడకు చెందిన మహ్మద్ ఇబ్రహీం నిత్యం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడికి ఎలాంటి న్యాయం చేయడం లేదని, అందుకోసమే తాను నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. సామాన్యుడినైనా తనను ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపిస్తే ప్రజల కోసం పోరాటం చేస్తానని చెప్పారు.

News April 25, 2024

HYD: సమ్మర్ టూర్, నాచురల్ క్యాంప్ వెళ్లొద్దామా?

image

HYD నగర శివారులోని చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్లే దారిలో మృగవని నేషనల్ పార్క్ ఉంది. దాదాపు 850 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జాతీయ పార్కులో అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాత్రి పూట నేచురల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేసవి వేళ సమ్మర్ టూర్లతో పర్యాటకుల సంఖ్య పెరిగింది. చల్లటి గాలులు, పచ్చటి అందాల మధ్య నేచురల్ క్యాంప్ కోసం ఆసక్తి కనబరుస్తున్నారు.

News April 25, 2024

నెహ్రూ జూ పార్కులో నేటి నుంచి వేసవి శిబిరం

image

నెహ్రూ జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి తెలిపారు. ఈ నెల 25 నుంచి జూన్ 30 వరకు కొనసాగుతుందన్నారు. నాలుగో తరగతి నుంచి పై విద్యార్థులకు జూకు సంబంధించిన జంతువులు, వాటి ఆవాసాలు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తామన్నారు. చిత్ర లేఖనం పోటీలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం భోజనంతో పాటు స్నాక్స్ ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000 అని చెప్పారు.