Karimnagar

News March 26, 2024

కరీంనగర్ మహిళా కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం 15కు పైగా సంస్థలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. టీ. శ్రీలక్ష్మి, టీఎస్సీ కోఆర్డినేటర్ డా. సీహెచ్. శోభారాణి తెలిపారు. ఇందులో భాగంగా 2021 నుంచి 2024 వరకు పీజీ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 26, 2024

KNR: రేపు పిఎఫ్ మీ ముంగిట కార్యక్రమం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం పిఎఫ్ మీ ముంగిట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ తానయ్య తెలిపారు. హుజరాబాద్ పెద్ద పాపయ్యపల్లి నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ డైరీలో, పెద్దపల్లి పురపాలక కార్యాలయంలో, జగిత్యాల(D) కోరుట్ల రవి బీడీ వర్క్స్ కార్యాలయంలో, సిరిసిల్ల (D) పెద్దూరు గ్రీన్ నీడిల్ లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5:45 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News March 26, 2024

జగిత్యాల: హోలీ వేళ విషాదం.. బావిలో పడి యువకుడి మృతి

image

హోలీ వేళ రాయికల్‌‌లో వ్యవసాయ బావిలో పడి యువకుడు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన నర్ర నగేశ్‌(21) తన నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం దావత్‌ కోసం ఓ మామిడితోటకు వెళ్లారు. అక్కడ బహిర్భూమికోసం బావి వద్దకు వెళ్లిన నగేశ్ తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు, పోలీసులకు స్నేహితులు చెప్పారు. అందరూ కలిసి గాలించగా బావిలో శవమై కనిపించాడు.

News March 26, 2024

గోదావరిఖని: నాలుగేళ్ల బాలుడిపై కుక్కల దాడి

image

గోదావరిఖని దుర్గానగర్‌కు చెందిన లక్కీ(4) అనే బాలుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినోద్ అనే కూలీ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం కుటుంబంతో గోదావరిఖనికి వచ్చి స్థిరపడ్డాడు. వినోద్ కొడుకు సోమవారం ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ముఖంపై గాయం కావడంతో సర్జరీ కోసం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. కుక్కల బెడదను తొలిగించాలని స్థానికులు కోరుతున్నారు.

News March 26, 2024

JGL: డీఎస్సీ ఉచిత శిక్షణ దరఖాస్తు నేడే చివరి తేది

image

ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ అధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు ఇస్తున్న 2 నెలల ఉచిత కోచింగ్ దరఖాస్తు గడువు నేటి ముగుస్తుందని ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి. నరేష్ తెలిపారు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు చెందిన బీ.ఎడ్డీ లేదా డీ.ఎడ్‌తో పాటు టెట్ పాసైన ఎస్సీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలన్నారు.

News March 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు. @ కమలాపూర్ మండలం లో ఆటో బోల్తా పడి యువకుడి మృతి. @ కోనరావుపేట మండలంలో ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య. @ రాయికల్ మండలంలో ఎస్సారెస్పీ కాలువలో పడి మానసిక దివ్యాంగుడు మృతి. @ రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు. @ గోదావరిఖనిలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు.

News March 25, 2024

ఎండపల్లి: పండగరోజు భగ్గుమన్న గ్రామాలు

image

జిగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని చర్లపల్లి-గుల్లకోట గ్రామాల మధ్య భూసరిహద్దు సమస్య సోమవారం రోజున తారస్థాయికి చేరింది. చర్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు సోమవారం గ్రామ సమీపంలో ఉన్న గుట్టకు ఉపాధి కూలీ పనులకు వెళ్తుంటే గుల్లకోట మాజీ సర్పంచ్ గ్రామస్థులతో కలిసి తమ సరిహద్దులో ఉన్న గుట్టకు ఉపాధిపని కోసం రావద్దన్నారు. దీంతో ఇరు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

News March 25, 2024

కొండగట్టు అంజన్న ఆలయ ఈఓ (ఇంచార్జ్)గా చంద్రశేఖర్ బాధ్యతలు

image

తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఈఓ(ఇంచార్జ్ )గా సోమవారం అసిస్టెంట్ కమిషనర్ (కరీంనగర్) చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కొండగట్టు ఈఓ టంకాశాల వెంకటేష్ సస్పెన్షన్‌కు గురికాగా, చంద్రశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ రోజు బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్‌కి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

News March 25, 2024

కరీంనగర్: మత్తుకు బానిస!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు, యువత మత్తుకు బానిసలవుతున్నారు. ఉన్నత చదువులు చదివి కన్నవారి కలలు నెరవేర్చాల్సిన పిల్లలు వ్యసనాలకు బానిసై బంగారు భవితను పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులూ తమ పిల్లలను గమనించి చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. జగిత్యాలలో బాలికలకు ఓ ముఠా మత్తు మందు ఇచ్చి రేవ్‌ పార్టీలకు తీసుకెళ్తోందనే విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

News March 25, 2024

కొండగట్టు నిధుల దుర్వినయోగంపై లోతుగా దర్యాప్తు!

image

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నిధుల దుర్వినియోగంపై దేవదాయశాఖ ఉన్నతాధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఆలయానికి సంబంధించి 2014 నుంచి రికార్డుల పరిశీలనకు నిర్ణయించినట్లు, క్యాష్‌బుక్‌, బ్యాంకు స్టేట్‌మెంట్లు ఇతర ఫైళ్లను రీకన్సులేషన్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.గతంలో పనిచేసిన ఈవోల పదవీకాలంలోనూ నిధుల దుర్వినియోగం జరిగినట్లు అధికరులు భావిస్తున్నారు.