Karimnagar

News October 27, 2024

ధర్మపురి క్షేత్రం ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి శనివారం 2,04,412 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టికెట్ల ద్వారా 1,15,614 రూపాయలు, ప్రసాదాల ద్వారా 70,240 రూపాయలు, అన్నదానం కోసం 18,558 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

News October 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ గోదావరిఖని టూ టౌన్ ఎస్ఐ సోనియా సస్పెండ్. @ కాటారం మండలంలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు. @ బీర్పూర్ మండలంలో గుస్సాడి వేడుకలు. @ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీ మధుయాష్కి. @ పరిశ్రమలకు అనుమతులు సకాలంలో పూర్తి చేయాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో పోలీసుల సైకిల్ ర్యాలీ. @ భూషణ్రావుపేట, ఆత్మకూరు గ్రామాల మధ్య రోడ్డు మరమ్మతుల పనులు ప్రారంభం.

News October 26, 2024

GDK- 2 టౌన్ SIసోనియా సస్పెండ్: IGP

image

గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న SIఅప్పస్ సోనియా ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్- IGPచంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేసినట్లు రామగుండం పోలీస్ కమిషనరేట్ నుంచి ప్రకటన విడుదలైంది. గతంలో కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ SHOగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ కేసు విషయంలో అవినీతి వ్యవహారంపై ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

News October 26, 2024

KNR: మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం ఆమె చిగురుమామిడి మండలం ఇందుర్తిలో పర్యటించారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో లోన్ ద్వారా నిర్వహిస్తున్న లేడీస్ ఎంపోరియం అండ్ బ్యూటీ పార్లర్, పిండి గిర్నిలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ మహిళలకు సూచించారు.

News October 26, 2024

గంగుల కుటుంబాన్ని పరామర్శించిన సీపీఐ జాతీయ నాయకులు

image

ఇటీవల మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ అనారోగ్యంతో మృతి చెందింది తెలిసిందే. శనివారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కుటుంబాన్ని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మి నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

News October 26, 2024

కరీంనగర్: ప్రభుత్వ ఆసరా అందేనా!

image

ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలలు గడుస్తున్నా కొత్త పింఛన్లపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్హులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత BRS ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం 57 ఏళ్లకు ఆసరా పెన్షన్లు ఇస్తుందో.. లేదో అని ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

News October 26, 2024

KNR: కౌలు రైతులకు సాయం అందేనా!

image

కరీంనగర్ జిల్లాలో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పట్టాదారులకు పంట రుణాలు, రుణమాఫీలు అందిస్తూ కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. దీంతో పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులే దిక్కవుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కింద కౌలు దారులకు ఏటా ఎకరానికి రూ.15వేల చొప్పున సాయం అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

News October 26, 2024

భృూణ హత్యలు జరగకుండా ప్రజలను చైతన్య పరచాలి: కలెక్టర్ పమేలా

image

భ్రూణ హత్యలు జరగకుండా ప్రజలను చైతన్య పర్చాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. ఆడ, మగ ఇద్దరినీ ఒకేలా చూడాలని చెప్పారు. ప్రతి శుక్రవారం జరిగే సభలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, లేక ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News October 26, 2024

PDPL: డిసెంబర్ వరకు ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పూర్తిచేయాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలో కొత్తగా 1000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్‌పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. మన జిల్లాలో 324 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు ప్లాంటేషన్ చేయడం జరిగిందని, మరో 350 ఎకరాలలో ప్లాంటేషన్ చేయడానికి సన్నద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

News October 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్ పల్లి మండలంలో రెండు బైకులు ఢీకొని ఇద్దరి మృతి. @ కోనరావుపేట మండలంలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. @ బీర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్. @ గంగాధర మండలంలో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య. @ వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లి శివారులో సుమారు 50 కోతుల మృతి. @ గోదావరిఖనిలో మృతి చెందిన కుమారుని కండ్లు దానం చేసిన తల్లిదండ్రులు.