Karimnagar

News October 25, 2024

జగిత్యాల : కాంగ్రెస్ నాయకుడు గంగారెడ్డి హత్య కేసులో వ్యక్తి రిమాండ్

image

జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో జరిగిన కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడిని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ పంపినట్టు తెలిపిన ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. భూ వివాదాలు, పాతకక్షల కారణంగానే సంతోష్ గంగారెడ్డిని హత్య చేశారని ఆయన పేర్కొన్నారు.

News October 25, 2024

రామగుండం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: సీపీ

image

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతపై శుక్రవారం కమిషనరేట్లో సమావేశ నిర్వహించారు.రోడ్డు భద్రత అనేది అత్యంత ప్రాధాన్యమైనదని, మానవ తప్పిదాల వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ప్రమాదాలలో యువతే ఎక్కువగా చనిపోతున్నారని, వీటిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

News October 25, 2024

మెట్‌పల్లి: రెండు బైకులు ఢీ.. ఇద్దరి మృతి

image

మెట్‌పల్లి మండలంలోని వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయ సమీపంలో శుక్రవారం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. బండలింగాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వెల్లుల్ల గ్రామానికి చెందిన దగ్గుల స్వామిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు పేర్కొన్నారు.

News October 25, 2024

గంగాధర: ఇష్టం లేని పెళ్లి చేశారని యువకుడి ఆత్మహత్య

image

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన చింతలతదేపు మహేశ్ (29) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లి తనకు ఇష్టం లేని పెళ్లి చేసిందని మనోవేదనకు గురై శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు.

News October 25, 2024

శంకరపట్నం: ‘అంగన్వాడి కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం సద్వినియోగం చేసుకోవాలి’

image

శంకరపట్నం మండలం ఎరడపల్లి అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం ఐసీడీఎస్ సూపర్వైజర్ స్రవంతి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ నాగార్జున, పీహెచ్సీ డాక్టర్ శ్రావణ్ హాజరయ్యారు. నాగార్జున మాట్లాడుతూ.. పిల్లల సంరక్షణకై అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం అందిస్తుందన్నారు. డా.శ్రావణ్ మాట్లాడుతూ.. గర్భిణీలకు, స్త్రీలకు, పోషకాహారంపై అవగాహన కల్పించారు.

News October 25, 2024

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుకు సిద్ధం చేయాలి: కలెక్టర్ పమేలా

image

కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో క్యాంటీన్ నిర్మాణ పనుల్ని అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో పూర్తిచేసిన ప్లాస్టరింగ్ పనులు పరిశీలించారు. పెయింటింగ్ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

News October 25, 2024

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలకు యాభై శాతం సబ్సిడీ ఇవ్వాలి: ఎమ్మెల్యే కేటీఆర్

image

పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ భారం ఎన్నడూ ప్రజలపై మోపలేదని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. శుక్రవారం సిరిసిల్లలో నిర్వహించిన విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల పవర్లుమ్ రంగానికి 50% సబ్సిడీ ఇవ్వాలని కోరారు. పేద మధ్య తరగతి కుటుంబాలే కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో నివసిస్తున్నారని విద్యుత్ భారాన్ని వారిపై మోపవద్దని సూచించారు.

News October 25, 2024

కరీంనగర్: మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్టపడేనా!

image

ప్రతి సంవత్సరం రైస్ మిల్లర్ల దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి సంచి బరువుతో సహా 40.650 కిలోల ధాన్యం తూకం వేయాల్సి ఉండగా.. తాలు పేరుతో గతంలో ధాన్యం కొనుగోళ్లలో కొన్ని చోట్ల ఆఖరి దశలో 42కిలోల వరకు కాంటా పెట్టారు. దీంతో రైస్ మిల్లర్ల దోపిడీని నియంత్రించి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

News October 25, 2024

GDK: మనస్తాపంతో సింగరేణి కార్మికుడి ఆత్మహత్య

image

గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు నర్సయ్య పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు వన్ టౌన్ SI శ్రీనివాస్ తెలిపారు. గతంలో నర్సయ్య కరీంనగర్‌లో ఓ భూమిని కొనుగోలు చేసి, దానికి సంబంధించి అప్పు చేశాడు. ఆ భూమి వివాదంలో ఉండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు రాకేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు.

News October 25, 2024

కరీంనగర్: మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్టపడేనా!

image

ప్రతి సంవత్సరం రైస్ మిల్లర్ల దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి సంచి బరువుతో సహా 40.650 కిలోల ధాన్యం తూకం వేయాల్సి ఉండగా.. తాలు పేరుతో గతంలో ధాన్యం కొనుగోళ్లలో కొన్ని చోట్ల ఆఖరి దశలో 42కిలోల వరకు కాంటా పెట్టారు. దీంతో రైస్ మిల్లర్ల దోపిడీని నియంత్రించి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.