India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ పట్టణంలో బ్రాండెడ్ ఫోన్లకు సంబంధించిన డూప్లికేట్ వస్తువులను సెల్ఫోన్ షాప్ యజమానులు అంటగడుతున్నారు. మార్కెట్లో ప్రముఖ కంపెనీల పేరుతో సెల్ ఫోన్లకు సంబంధించిన కవర్లు, ఎయిర్ బర్డ్స్, లైటింగ్, ఛార్జింగ్ వైర్లు, ఎడాప్టర్ వంటి వస్తువులకు బ్రాండెడ్ లేబుల్ అంటించి అధికరేట్లకు విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీ అంటూ సెల్ ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ధరకు కొనుగోలు చేస్తు నిండా మోసపోతున్నారు.
నవంబర్ 1న కరీంనగర్కు తెలంగాణ బీసీ కమిషన్ బృందం వస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం వస్తుందన్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అభిప్రాయాలను నేరుగా తెలుపవచ్చన్నారు.
@ కోనరావుపేట మండలంలో కుక్క దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు.
@ వేములవాడలో తాగిన మైకంలో కూతురిని విక్రయించిన తల్లి.
@ సిరిసిల్లలో పోలీసుల భార్యల ధర్నా.
@ జగిత్యాల రూరల్ మండలంలో పల్లె ప్రకృతి వనాన్ని, వైకుంఠధామన్ని పరిశీలించిన కలెక్టర్.
@ వేములవాడ మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
@ మెట్పల్లిలో కేటీఆర్కు ఘన స్వాగతం.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.59,435 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్ల అమ్మకం ద్వారా రూ.29,362, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.19,650, అన్నదానం రూ.10,423 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
అంతరించిపోతున్న స్కిమ్మర్స్ పక్షులను లోయర్ మానేరు డ్యాం వద్ద కరీంనగర్ బర్డింగ్ కమ్యూనిటీ టీం గుర్తించింది. అంతరించిపోతున్న ఈ పక్షుల గురించి తెలుసుకోవడానికి బర్డింగ్ కమ్యూనిటీ టీం పక్షుల సంఖ్యను లెక్కించి వాటి రూస్టింగ్ ప్రదేశాలను కనుగొన్నారు. ఈ సమాచారాన్ని DFO కరీంనగర్కు అందించి చర్చించారు. కాగా, అరుదైన ఈ పక్షులు.. ఈ ప్రాంతానికి రెండోసారి వలస రావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. SHARE
దీపావళి పర్వదినం సందర్భంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ఈనెల 25న బోనస్ రూ.93,750 చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించిందని గుర్తింపు కార్మిక సంఘం(AITUC) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తెలిపారు. ఈనెల 31న దీపావళి పండుగ ఉన్నందున సింగరేణిలో కార్మికులకు బోనస్ చెల్లించాలని గుర్తింపు సంఘం యాజమాన్యాన్ని కోరిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో ప్రతి ఇంట్లో కాడెడ్లు, కర్ర నాగళ్ళతో కర్షక లోగిళ్లు కళకళలాడేవి. ప్రస్తుతం వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోవడంతో కాడెద్దులు కనుమరుగవుతున్నాయి. అడపాదడపా అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. రైతుల ఇళ్లలో పాడి కళ తప్పింది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం నిలబడదు అని నానుడి ఉండేది. నేటి యాంత్రిక జీవనంలో యంత్రాలతో పాటు రైతు జీవితం కళ తప్పింది.
@ సిరిసిల్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్. @ శంకరపట్నం మండలంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు. @ కాటారం పిహెచ్సి వైద్యుని విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు.@ జగిత్యాల జిల్లాలో భూసేకరణ సర్వే ను పరిశీలించిన కలెక్టర్. @ మల్లాపూర్ మండలంలో హత్యకు పాల్పడిన నిందితుల అరెస్ట్.
రామగుండం రైల్వేస్టేషన్ వద్ద ట్రైన్లోనే ఓ మహిళకు 108 సిబ్బంది డెలివరీ చేశారు. ఆగ్రా నుంచి కరీంనగర్కు ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో స్వాతి, ఆమె కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్నారు. మందమర్రిలో పురిటి నొప్పులు రావడంతో రామగుండం 108 సిబ్బందికి సమాచారం అందించారు. డెలివరీ అనంతరం స్వాతితో పాటు పుట్టిన పసి బిడ్డను మెరుగైన వైద్యం కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు థెర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ సంసిద్ధమైంది. ఈ సందర్భంగా బుధవారం మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సచివాలయంలో థెర్మో ఫిషర్ సంస్థ అధికారికంగా ఎంవోయూ కుదుర్చుకుంది. ఔషధ, లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రయోగశాల పరికరాలు, రీఏజెంట్స్ సరఫరాలో థెర్మో ఫిషర్ దిగ్గజ సంస్థ. 10 వేల చదరపు అడుగుల్లో డిజైన్ సెంటర్, 2025 మొదటి త్రైమాసికంలో ప్రారంభం కానుంది.
Sorry, no posts matched your criteria.