Karimnagar

News March 19, 2024

KNR: ఈనెల 22లోపు ఫీజు చెల్లింపు: శ్రీరంగ ప్రసాద్

image

శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్‌మెంట్ 2, 4, 6వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు ఈనెల 22లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ సోమవారం తెలిపారు. అపరాధ రుసుము రూ.300తో మార్చి 27 వరకు చెల్లించవచ్చని తెలిపారు.

News March 19, 2024

KNR: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే.. ఇలా ఫిర్యాదు చేయండి

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అక్రమంగా మద్యం, డబ్బు తరలించినా, పంపిణీ చేసినా, కోడ్ ఉల్లంఘన జరిగినా కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని, 1950, 18004254731 టోల్‌ఫ్రీ నంబర్లకు లేదా సీవిజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.

News March 19, 2024

వేములవాడ రాజన్న గుడి చెరువు పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి స్వామి గుడి చెరువు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గుడి చెరువు పనులను సోమవారం అయన క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి పరిశీలించారు. వచ్చే నెల ఆఖరిలోగా పనులను పూర్తిచేయాలని టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు. శివార్చన స్టేజ్ నిర్మాణ పనులను పరిశీలించి ఈఈకి పలు సూచనలు చేశారు.

News March 18, 2024

ముస్తాబాద్‌లో కరెంట్ స్తంభం పడి వ్యక్తి మృతి

image

కరెంట్ స్తంభం పడి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో జరిగింది. సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో చెట్లు, పొల్స్ విరిగిపడ్డాయి. ఎలుసాని ఎల్లయ్య (50) అనే వ్యక్తి కరెంట్ పోల్ పక్కనే ఉన్నాడు. భారీ ఈదురుగాలికి పోల్ విరిగి మెడపై పడింది. దీంతో అతని మెడపై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.

News March 18, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాలలో బిజెపి విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ. @ ఓదెల మండలంలో డాన్స్ చేస్తుండగా గుండెపోటుతో యువకుడు మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో విద్యుత్ షాక్ తో చేపలు పట్టిన వ్యక్తులపై కేసు. @ వేములవాడ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి. @ పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జగిత్యాల, కరీంనగర్ కలెక్టర్లు. @ మల్యాల మండలంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.

News March 18, 2024

వేములవాడ రాజన్న గుడి చెరువు పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి స్వామి గుడి చెరువు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గుడి చెరువు పనులను సోమవారం అయన క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి పరిశీలించారు. వచ్చే నెల ఆఖరిలోగా పనులను పూర్తిచేయాలని టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు. శివార్చన స్టేజ్ నిర్మాణ పనులను పరిశీలించి ఈఈకి పలు సూచనలు చేశారు.

News March 18, 2024

ఎల్లారెడ్డిపేట: పుట్టెడు దుఃఖంలో పదవ తరగతి పరీక్ష 

image

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పుట్టి శ్రవణ్ అనే విద్యార్థి పుట్టెడు దుఃఖంలో పదవ తరగతి పరీక్ష రాశాడు. తండ్రి రవి అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించిన శ్రావణ్ 10వ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాశాడు.

News March 18, 2024

అధికారం కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం: నరేంద్ర మోదీ

image

తనకు అధికారం కాపాడుకోవడం కన్నా ప్రజల శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకోవడమే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జగిత్యాలలో సోమవారం జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామని, పసుపు ధరను భారీగా పెంచామన్నారు. దేశ ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు.

News March 18, 2024

ఆ ఇద్దరిని భారీ మెజార్టీతో గెలిపించాలి: జగిత్యాలలో మోదీ

image

కరీంనగర్, పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండిసంజయ్, గోమాస శ్రీనివాస్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ మెుదలైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించిబోతున్నారని అన్నారు. 400 సీట్లు దాటాలి- బీజేపీకి ఓటేయాలని కోరారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

News March 18, 2024

ఓదెల: గుండెపోటుతో యువకుడు మృతి

image

వివాహ వేడుకలో డాన్స్ చేస్తుండగా వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలో స్నేహితుని వివాహ వేడుకల్లో పాల్గొని డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో పడిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్(33)గా గుర్తించారు.