Karimnagar

News October 22, 2024

MLA కౌశిక్ రెడ్డి రీల్స్.. స్పందించిన యాదగిరిగుట్ట ఈఓ

image

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద హుజూరాబాద్ MLA కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడంపై ఆలయ ఈఓ భాస్కర్ రావు స్పందించారు. ఆలయం వద్ద భక్తుల మనోభావాలు, భక్తుల విశ్వాసం దెబ్బతినే విధంగా వ్యక్తిగత ఫొటో, వీడియో చిత్రీకరణ చేయవద్దంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఒక MLAగా ఆలయ దర్శనం, తగిన గౌరవం ఇస్తామని తెలిపారు. అందరి మాదిరిగా ఆలయం బయట మాత్రమే ఫొటోలు దిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

News October 22, 2024

KNR: రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారుగా ప్రొ.సూరేపల్లి సుజాత

image

తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులను రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించింది. శాతవాహన యూని వర్శిటీ ప్రొ.సూరేపల్లి సుజాతకు ఇందులో చోటు దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ వెంకటేశం ఉత్వర్వులు జారీ చేశారు. ఆమె 22 ఏళ్లుగా సోషియాలజీ బోధిస్తున్నారు. సూరేపల్లి సుజాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దళిత మహిళా సాధికారతపై పీహెచ్ చేశారు.

News October 22, 2024

కరీంనగర్‌లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయండి: కేంద్రమంత్రి సంజయ్

image

కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం కేంద్ర కార్మికశాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయను కోరారు. న్యూఢిల్లీలో సోమవారం రాత్రి మన్‌సుఖ్ మాండవీయను కలిసిన బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం మెడికల్ హబ్‌గా మారిందని తెలిపారు.

News October 21, 2024

సింగరేణిలో 2349 మంది బదిలీ వర్కర్లకు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు

image

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 2349 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూరులుగా క్రమబద్ధీకరిస్తూ సింగరేణి యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సంస్థ సీఎండీ బలరాం ఆదేశాలు జారీ చేశారు. సంస్థలో చేరినప్పటి నుంచి సంవత్సరంలో 240 మాస్టర్లకు గాను 190 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేశారు. 2024 సెప్టెంబర్ 1 నుంచి వీరిని జనరల్ మజ్దూరులుగా గుర్తించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News October 21, 2024

జగిత్యాల : ఫొటో మార్ఫింగ్ చేసి రూ. 20 లక్షల లోన్

image

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామానికి చెందిన ముంజల నారాయణ అనే వ్యక్తి ఐడీలు మార్చి గుర్తుతెలియని వ్యక్తులు రూ.20 లక్షల లోన్ తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. 2018లో ఓ ప్రైవేట్ బ్యాంకులో నారాయణ ఆధార్‌కార్డులోని ఫొటో మార్ఫింగ్ చేసి లోన్ తీసుకున్నారని తెలిపాడు. ఇటీవలే సిబిల్ స్కోర్ తగ్గిందని బ్యాంక్‌కి వెళితే లోన్ విషయం వెలుగులోకి వచ్చిందని బాధితుడు నారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు.

News October 21, 2024

SU వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉమేశ్ కుమార్

image

శాతవాహన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలోనే ఉన్నతమైన విశ్వవిద్యాలయంగా అగ్రస్థానంలో నిలుపుతానని వైస్ ఛాన్సలర్ ఉమేశ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన విశ్వవిద్యాలయం VC ఆయన పదవీ భాద్యతలు చేపట్టారు. అంతకు ముందు యూనివర్సిటీ అధికారులు సిబ్బంది ఆయన కి ఘన స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనల మధ్య పదవీ బాధ్యతలు చేపట్టారు.

News October 21, 2024

కరీంనగర్: వేర్వేరు కారణాలతో ఇద్దరి సూసైడ్

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. వీణవంక M) ఇప్పలపల్లికి చెందిన సంగీత(33) చొప్పదండిలో నీటిపారుదల శాఖలో జూ.అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2నెలల నుంచి జర్వంతో బాధపడుతూ ఆదివారం ఉరేసుకుంది. పని లేకపోవడంతో నేత కార్మికుడు సూసైడ్ చేసుకున్నాడు. సంపత్‌కు గత నాలుగు నెలల నుంచి పని లేక ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈక్రమంలో ఆదివారం ఇంట్లో ఉరేసుకున్నాడు.

News October 21, 2024

మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్ర!

image

KNR మొదట 1905లోనే జిల్లాగా ఏర్పడింది. గతంలో భారత యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్రంగా విలీనమైన తర్వాత 1948లో కరీంనగర్ జిల్లాగా భాగమైంది. తెలుగు మాట్లాడే పేరొందిన క్రమంలో 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేశారు. 2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాగా ఏర్పడింది. కాగా, నిజాంపాలనలో(1724-1948)అసఫ్ జాహి రాజవంశీయుల ఆధీనంలో ఉంది.1937లో షైఖాన్ బిన్ షైక్ సాలేహ్ కరీంనగర్ కమాన్ నిర్మించారు.

News October 21, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సిరిసిల్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. @ వీణవంక మండలంలో అనారోగ్యంతో మహిళ ఆత్మహత్య. @ మల్యాల మండలంలో బైక్ చెట్టును ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల ధర్నా. @ కమాన్పూర్ మండలంలో ఈత చెట్టు పైనుంచి జారిపడి గీతా కార్మికుడికి తీవ్ర గాయాలు. @ మల్లాపూర్ మండలంలో అన్నను హత్య చేసిన తమ్ముడు.

News October 20, 2024

ఉత్తర తెలంగాణలో అతిపెద్ద స్టేడియం నిర్మాణానికి కృషి: నరేందర్ రెడ్డి

image

ఉత్తర తెలంగాణ కేంద్రంగా అతిపెద్ద స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని వ్యాయామ ఉపాధ్యాయులకు  MLC అభ్యర్థి నరేంద్ర రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం వ్యాయామ ఉపాధ్యాయుల మీట్లో పాల్గొన్నారు. చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు ప్రహరీ గోడలు లేక అన్యక్రాంతమవుతున్నాయని, వాటికి ప్రహరీ గోడల నిర్మాణానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్త ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరానికి చర్యలు చేపడుతామన్నారు.