Karimnagar

News March 19, 2024

జగిత్యాల: గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి మృతి

image

గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటనా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో చోటుచేసుకుంది. పౌల్ట్రీ నిర్మాణ పనులు జరుగుతుండగా కాంక్రీట్ మిక్సర్ వాహనం గోడను ఢీకొంది. దీంతో అవతలి వైపు ఆడుకుంటున్న చిన్నారిపై ఇటుకలు పడ్డాయి. ఈ క్రమంలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా.. బాలుడి తల్లిదండ్రులు కూలీ పనుల కోసం మేడిపల్లి వచ్చినట్లు తెలుస్తోంది. మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

కాటారం: బయ్యారం X రోడ్డు వద్ద ACCIDENT

image

కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన తోటపల్లి అక్షయ అనే విద్యార్థిని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాస్తుంది. మంగళవారం పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు అన్న రాజేష్, తమ్ముడు తరుణ్‌తో కలిసి కాటారం వెళ్తుండగా, బైక్ అదుపుతప్పి బయ్యారం క్రాస్ సమీపంలో ఉన్న కల్వర్టును ఢీ కొట్టింది .అక్షయ ఒక తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.

News March 19, 2024

KNR: చిన్నారికి పేరు పెట్టిన KCR

image

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన ఓ చిన్నారికి మాజీ సీఎం కేసీఆర్ నామకరణం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో.. నియోజవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకురాలు అకినేపల్లి శిరీష-ప్రవీణ్‌ దంపతుల ద్వితీయ కుమార్తెకు శ్రేయా ఫూలే అని పేరు పెట్టారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News March 19, 2024

హుజూరాబాద్: ఏటీఎంలో చోరీ.. కేసు నమోదు

image

హుజూరాబాద్ కోర్టుకు ఎదురుగా ఉన్న SBI ATMలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల ప్రకారం.. చోరీ అనంతరం దుండగులు ఏటీఎంను దహనం చేశారు. ఘటనా స్థలానికి సీఐ బొల్లం రమేశ్ చేరుకుని తన సిబ్బందితో వేలిముద్రలను సేకరించారు. కాగా, చోరీ జరిగిన స్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్ సోమవారం పరిశీలించారు. రూ.8,64,100 చోరీకి గురైనట్లు సమాచారం. నెట్‌వర్క్ అసిస్టెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

News March 19, 2024

KNR: లంచం అడుగుతున్నారా..? ఈ నంబర్‌కు కాల్ చేయండి

image

కరీంనగర్ DSP రమణామూర్తి కీలక ప్రకటన చేశారు. లంచం అడిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు 9154388954, 08782243693 నంబర్లను సంప్రదించాలని అన్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News March 19, 2024

మ్యాడంపల్లిలో మహిళ అనుమానాస్పద మృతి

image

జగిత్యాల జిల్లా మాల్యాల మండలం మ్యాడంపల్లి శివారులో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామశివారులోని చెట్లపొదల్లో మహిళ చనిపోయి పడి ఉండటంతో అటుగా వెళ్లిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి సీఐ నీలం రవి సిబ్బందితో చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

ధర్మారం: చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

image

చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో చోటుచేసుకుంది. SI సత్యనారాయణ వివరాల ప్రకారం.. కొత్తూరుకు చెందిన నర్సింగం.. సాగల నారాయణ పొలంలోని వ్యవసాయ బావిలో చేపలు పట్టుకునేందుకు దిగాడు. అందులోని ఓ తీగ ప్రమాదవశాత్తు అతడి చేతులకు చుట్టుకుని బావిలో నడుము భాగం వరకు మునిగిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

News March 19, 2024

KNR: ఈనెల 22లోపు ఫీజు చెల్లింపు: శ్రీరంగ ప్రసాద్

image

శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్‌మెంట్ 2, 4, 6వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు ఈనెల 22లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ సోమవారం తెలిపారు. అపరాధ రుసుము రూ.300తో మార్చి 27 వరకు చెల్లించవచ్చని తెలిపారు.

News March 19, 2024

KNR: ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే.. ఇలా ఫిర్యాదు చేయండి

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అక్రమంగా మద్యం, డబ్బు తరలించినా, పంపిణీ చేసినా, కోడ్ ఉల్లంఘన జరిగినా కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని, 1950, 18004254731 టోల్‌ఫ్రీ నంబర్లకు లేదా సీవిజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.

News March 19, 2024

వేములవాడ రాజన్న గుడి చెరువు పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి స్వామి గుడి చెరువు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గుడి చెరువు పనులను సోమవారం అయన క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి పరిశీలించారు. వచ్చే నెల ఆఖరిలోగా పనులను పూర్తిచేయాలని టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు. శివార్చన స్టేజ్ నిర్మాణ పనులను పరిశీలించి ఈఈకి పలు సూచనలు చేశారు.