Karimnagar

News October 18, 2024

కేసీఆర్‌ను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే

image

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆయన పుష్పగుచ్చాన్ని అందజేసి తన జన్మదినం సందర్భంగా ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. కేసీఆర్, ఎమ్మెల్యే సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

News October 18, 2024

KNR: బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

image

బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం చేసిన ఘటన BHPL జిల్లా మహాముత్తారం మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. SI మహేందర్ కుమార్ వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక(12)పై అదే గ్రామానికి చెందిన రామయ్య(71).. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికవద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

News October 18, 2024

రామగుండం: ఈనెల 26 నుంచి యూరియా ఉత్పత్తి ప్రారంభం

image

రామగుండం ఎరువుల కర్మాగారం(RFCL)లో వార్షిక మరమ్మతుల అనంతరం ఈనెల 26 నుంచి యథావిధిగా యూరియా ఉత్పత్తి అవుతుందని అధికారులు తెలిపారు. RFCLలో వివిధ విభాగాల్లో సాధారణ మరమ్మతులు నిర్వహించి యూరియా ఉత్పత్తి చేస్తుంటారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఆరు మాసాలలో 6.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసి లక్ష్యానికి చేరువలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

News October 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ పెగడపల్లి మండలంలో కత్తితో పొడుచుకుని వ్యక్తి ఆత్మహత్య.
@ గోదావరిఖనిలో మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య.
@ ధర్మపురి మండలంలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు.
@ కరీంనగర్ మండలంలో కారు, బైకు డీ.. ఒకరి మృతి.
@ కోరుట్లలో హత్య కేసులో ఐదుగురి అరెస్ట్.
@ సుల్తానాబాద్ మండలంలో దాడికి పాల్పడిన ఇద్దరికి ఏడాదిన్నర జైలు శిక్ష.
@ సిరిసిల్లలో వైభవంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.

News October 17, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.63,569 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.34,600, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.21,760, అన్నదానం రూ.7,209 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

News October 17, 2024

కరీంనగర్: SU పీజీ ఫలితాలు విడుదల

image

SU పీజీ ఫలితాలు విడుదలయ్యాయి. జులై, ఆగస్టులో నిర్వహించిన M.COMలోని జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇన్సూరెన్స్, MBA, MSCలోని కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో 2, 4వ సెమిస్టర్ ఫలితాలు రిలీజ్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.శ్రీరంగప్రసాద్ తెలిపారు. https://satavahana.ac.in/ ఫలితాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

News October 17, 2024

KNR రీజియన్‌లోని బస్సు డిపోల వారీగా ఆదాయ వివరాలు

image

బతుకమ్మ, దసరా సందర్భంగా KNR రీజియన్‌లోని బస్సు డిపోల వారీగా ఆర్టీసీకి వచ్చిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. గోదావరిఖని-రూ.527.45(లక్షలు), హుస్నాబాద్-రూ.143.42, హుజూరాబాద్-రూ.211.49, జగిత్యాల- రూ.421.74, కరీంనగర్-1 రూ.338.36, కరీంనగర్-2 రూ.423.19, కోరుట్ల-రూ.225.73, మంథని- రూ.183.91, మెట్పల్లి-రూ.214.21, సిరిసిల్ల- రూ.227.44, వేములవాడ-రూ.232.86(లక్షలలో) వచ్చాయి.

News October 17, 2024

KNR రీజియన్‌లో పండగ ఆదాయం రూ.31.50 కోట్లు

image

బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీకి రూ.31.50 కోట్ల ఆదాయం సమకూరిందని కరీంనగర్ RM ఎన్.సుచరిత ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఆదాయ సముపార్జనలో శక్తివంచన లేకుండా కృషి చేసిన ఆర్టీసీ సంస్థ సిబ్బందికి, ప్రత్యేకంగా డ్రైవర్, కండక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సేవలపై నమ్మకముంచి ఇంతటి ఆదాయాన్ని ఆర్జించుటలో సహకరించిన ప్రతి ఒక్క ప్రయాణికుడికి సంస్థ తరఫున ధన్యవాదాలు తెలిపారు.

News October 17, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు.. ఐదుగురిపై కేసు: సిరిసిల్ల ఎస్పీ

image

విద్యార్థినుల పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి వేధింపులకు పాల్పడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోషల్ మీడియాలో మహిళలు, విద్యార్థినుల పట్ల ఎవరైనా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో షీ టీం సత్ఫలితాలు సాధిస్తూ మహిళలు, విద్యార్థినులకు అండగా నిలుస్తోందన్నారు. అవసరమైతే 87126 56425 నంబరును సంప్రదించాలన్నారు.

News October 17, 2024

గోదావరిఖని: రహదారిపై యువకుడి మృతి 

image

గోదావరిఖని పరశురాం నగర్‌కు చెందిన సంతోశ్ పట్టణంలోని కళ్యాణ్ నగర్ మటన్ షాపుల రహదారిపై మృతి చెందాడు. ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయి ప్రాణాలు వదిలాడు. అయితే అతిగా మద్యం తాగి మరణించి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.