India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుండెపోటుతో చిన్నారి మృతి చెందిన ఘటన BHPL జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల ప్రకారం.. టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి గ్రామానికి చెందిన రాజు, జమున దంపతులు కొడుకు, కూతురుతో కలిసి జమ్మికుంటలో ఉంటున్నారు. చిన్నారి పాఠశాలకు వెళ్లే క్రమంలో కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి HNK తీసుకెళ్లి చూపించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు.
తాను విద్యా బుద్ధులు నేర్చుకున్న బడిలోనే ఓ వ్యక్తి పంతులుగా చేరాడు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్పేట గ్రామానికి చెందిన ఎండీ రఫిక్ స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 2007-08లో పదో తరగతి వరకు విద్యనభ్యసించాడు. కాగా, తాజా డీఏస్సీలో కొలువు సాధించి, పోస్టింగ్లో తాను చదివిన పాఠశాలలోనే హిందీ పండిట్గా చేరనున్నాడు. ఈ సందర్భంగా రఫిక్ తన సంతోషాన్ని ‘Way2News’తో పంచుకున్నాడు.
కాళేశ్వరంలోని కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం కోజా గిరి పౌర్ణమి సందర్భంగా ఆలయంలో రాత్రి 9 గం.ల నుంచి 11 గం.ల వరకు భజన ఉంటుందని ఈవో తెలిపారు. 11.30 గంటలకు కౌముది పూజ (పాలలో చంద్రుని) దర్శన కార్యక్రమం, అనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహించనునట్లు చెప్పారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
@ కోరుట్లలో యువకుడి దారుణ హత్య. @ గొల్లపల్లి మండలంలో తండ్రిని హత్య చేసిన తనయుడికి జీవిత ఖైదు. @ ఎల్లారెడ్డిపేట మండలంలో కారు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డీఎస్సీ సెలెక్టెడ్ అభ్యర్థులకు పాఠశాలల కేటాయింపు. @ రాయికల్ మండలంలో ఎస్సీ, ఎస్టీ కేసుపై డీఎస్పిీ విచారణ. @ బీజేపీలో చేరిన మెట్ పల్లి వైద్యుడు ముత్యాల వెంకటరెడ్డి.
దసరా సెలవుల అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ అందించారు. సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలో జావ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 1,36,781 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. కాగా పిల్లలకు పోషకాహారం అందించేందుకు అమలు చేస్తున్న పీఎం పోషణ్ కార్యక్రమంలో భాగంగా రాగి జావ అందిస్తున్నారు.
KNR జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.166 కోట్ల మద్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. గతేడాది రూ.139 కోట్ల మద్యం విక్రయించినట్లు పేర్కొన్నారు. KNR జిల్లాలో రూ.46 కోట్లు, PDPL రూ.39 కోట్లు, JGTL రూ.41 కోట్లు, SRCL జిల్లాలో రూ.34 కోట్ల మద్యం వ్యాపారం జరిగిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.27 కోట్ల వ్యాపారం అధికంగా జరిగినట్లు పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోరుట్ల పట్టణంలో యువకుడు హత్యకు గురయ్యాడు. స్థానికుల ప్రకారం.. పట్టణంలోని ప్రకాశం రోడ్డుకు చెందిన బోయిని సాగర్(33) అనే యువకుడిపై సోమవారం అర్దరాత్రి దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలైన సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి సీఐ సురేశ్ బాబు, ఎస్సై శ్రీకాంత్ చేరుకొని హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో మంత్రగాళ్లను హెచ్చరిస్తూ ఓ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. గ్రామ కూడలిలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ అతికించారు. తమ సంస్థకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఒక్కొక్కరిని చంపబోతున్నామని, ముందుగా గచ్చునూతి వద్ద గల ఇద్దరితో మొదలుపెట్టి ఇతర వీధుల్లో ఉన్నవారిని హతమార్చుతామని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్గా మారింది.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,23,033 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.67,998, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.40,890, అన్నదానం రూ.14,145 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో నేడు ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో బతుకమ్మను కొలిచి ఆడి పాడి నేడు మహిళలు, యువతులు తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. అనంతరం వాటిని డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి వాగులు, చెరువులలో నిమజ్జనం చేశారు.
Sorry, no posts matched your criteria.