India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దసరా పండుగ రోజు విద్యుత్ షాక్తో చిన్నారి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి అక్కన్నపేట మండలం పోతారం(జే) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శిఖ కీర్తన్య (8) అనే చిన్నారి దుర్గామాత నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన డీజే కరెంటు తీగ తాకి మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ భాస్కర్ ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు. @ జగిత్యాల లో కస్టమర్ పై టిఫిన్ సెంటర్ సిబ్బంది దాడి. @ హుస్నాబాద్ లో దసరా వేడుకలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ భీమారం మండలంలో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి. @ శంకరపట్నం మండలంలో బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.
భీమరం మండలం రాగోజీపేటలో దసరా పండగ పూట విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. దుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మహిషాసుర మర్ధిని కార్యక్రమంలో రావణాసురుడి బొమ్మకు నిప్పు పెట్టే ప్రయత్నంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి అరిసెల వెంకటేష్ ( 36) అక్కడే కుప్పకూలి పడిపోయాడు. గ్రామస్థులు వెంటనే జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లగా మృతిచెందాడని వైద్యులు తెలిపారు.
దసరా సందర్భంగా కరీంనగర్ జిల్లాలో నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరిగింది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. వంట నూనెల నుంచి కూరగాయల వరకు ధరలు గత 20 రోజుల్లో 30% రెట్లు అధికం కావడంతో సామాన్యులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. గత 20 రోజుల క్రితం సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు ధర రూ.115 ఉండగా ప్రస్తుతం రూ. 145-150 వరకు, పామాయిల్ ధర రూ.90ఉండగా రూ. 125వరకు ఉన్నాయి.
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ విజయదశమి జరుపుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరు ఆ దుర్గాభవాని అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆయుఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, సిరి సంపదలతో అన్ని పనుల్లో విజయం సాధించాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ పెద్దల ఆశీర్వాదం తీసుకొని భవిష్యత్తులో విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.
@ కరీంనగర్ లో రెస్టారెంట్లలో తనిఖీలు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కథలాపూర్ మండలంలో సైబర్ మోసం. @ వీర్నపల్లి మండలంలో ఆర్టీసీ బస్సు, స్కూటర్ డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ వేములవాడ: అనారోగ్యంతో ప్రధానోపాధ్యాయురాలు మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న దుర్గ నవరాత్రి ఉత్సవాలు. @ దసరా పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్న జగిత్యాల ఎస్పీ.
కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ లోని శ్రీధుర్గాభవానీ ఆలయం దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. దసరా పండుగా సందర్భంగా శనివారం అమ్మవారు విజయలక్ష్మి అలంకరణలో గజ వాహనంతో భక్తులకు దర్శనమిస్తారు అని వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ తెలిపారు. ఆలయంలో ఉదయం 8 గంటల నుంచి వాహన పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటలకు వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో శమ్మిపూజ, రావణ సంహారం కార్యక్రమాలు జరుగుతాయి.
KNR, JTYL, PDPL,SRCL జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రేమ పెళ్లి <<14324262>>యువకుడి హత్య<<>>కు దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. యైంటిక్లయిన్ కాలనీలోని హనుమాన్నగర్ చెందిన అంజలికి భర్త, పిల్లలు ఉండగానే వినయ్ని ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయంలో కక్ష పెంచుకున్న మొదటి భర్తతో పాటు అంజలికి వరుసకు సోదరుడు పథకం ప్రకారం వినయ్ని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ACP రమేశ్, CI ప్రసాద్ రావు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.