Karimnagar

News June 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం.
@ పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం.
@ నిజామాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం.
@ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్.
@ ఎండపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.
@ వీణవంక మండలంలో ఎల్లమ్మ ఆలయంలో చోరీ.
@ మల్హర్ మండలంలో తాటి చెట్టు పై పడిన పిడుగు.

News June 4, 2024

కరీంనగర్‌లో బండి, పెద్దపల్లిలో గడ్డం వంశీ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటితో ఉత్కంఠ వీడింది. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో మొత్తం 28 మంది పోటీ చేయగా.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 2,12,017+ ఓట్లతో గెలుపొందారు. ఇక పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి మొత్తం 42 మంది పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ 131,581+ ఓట్లతో గెలిచారు. దీంతో నేటితో జిల్లాలోని ఎంపీ స్థానాలపై ఉత్కంఠకు తెర పడింది.

News June 4, 2024

జగిత్యాల: ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్న అరవింద్

image

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ లక్షకు పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అతనిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

News June 4, 2024

KNR: 45 శాతం ఓట్లు సాధించిన బండి సంజయ్

image

కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతం ఓట్లు బండి సంజయ్ కుమార్ సాధించారు. కాంగ్రెస్‌కు 27.4 శాతం, బీఆర్ఎస్‌కు 21.4 శాతం ఓట్లు వచ్చాయి. మరోవైపు కరీంనగర్‌లో కేసీఆర్, వినోద్ రికార్డులు బద్దలు కొట్టారు. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో అత్యధిక ఓట్ల శాతాన్ని సాధించి టాప్‌లో నిలిచారు.

News June 4, 2024

పెద్దపల్లి పార్లమెంటులో పోస్టల్ బ్యాలెట్ వివరాలు

image

పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ వెల్లడించారు. కాంగ్రెస్‌కు 5,407, BJPకి 5,116, BRSకి 1,416 ఓట్లు వచ్చాయన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 291 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడని తెలిపారు.

News June 4, 2024

బండి సంజయ్‌కు సర్టిఫికెట్ అందజేత

image

కరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఎస్ ఆర్ఆర్ కాలేజీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్టిఫికెట్‌ను ఆయనకు అందజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

News June 4, 2024

నా గెలుపు కార్యకర్తలకు అంకితం: బండి సంజయ్

image

కరీంనగర్ ఎంపీగా గెలిపించడానికి బీజేపీ కార్యకర్తలు గత మూడు నెలలుగా కష్టపడ్డారని, నా గెలుపును కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని అన్నారు.

News June 4, 2024

KNR: రికార్డు బద్దలు కొట్టిన బండి సంజయ్

image

కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అత్యధిక మెజారిటీ సాధించారు. 2006 ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు 2 లక్షల 1 వెయ్యి 581 ఓట్లు, 2014లో వినోద్ కుమార్‌కు 2 లక్షల 5 వేల 7 ఓట్లు మెజారిటీ రాగా.. మరో 4 రౌండ్లు ఉండగానే కేసీఆర్, వినోద్ రావు రికార్డులను బండి సంజయ్ బద్దలు కొట్టారు.

News June 4, 2024

కరీంనగర్: మెజార్టీతో గెలవబోతున్న సంజయ్, అరవింద్

image

బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇద్దరు లక్షకుపైగా మెజార్టీతో గెలవబోతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బండి సంజయ్, నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ ఇద్దరు లక్షకుపైగా మెజార్టీతో గెలవబోతున్నారు. ప్రస్తుతం ఇద్దరు లక్షకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. అధికారికంగా ప్రకటించడమే తరువాయి.

News June 4, 2024

హుజురాబాద్: MLAగా ఓడి ఎంపీలుగా గెలవబోతున్నారు

image

గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటల రాజేందర్, కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్‌లు ఎమ్మెల్యేగా ఓటమి చెంది ఎంపీలుగా గెలువబోతున్నారు. ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు లక్షలకు పైగా మెజార్టీతో దూసుకుపోతున్నారు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లక్ష డెబ్బై వేలకు పైగా మెజార్టీతో ఉన్నారు.