India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దపల్లిలోని జెండా చౌరస్తా వద్ద ఈరోజు సాయంత్రం 4 గంటలకు అఖిల భారత యాదవ సంఘం, యువజన విభాగం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లాలో నిర్వహిస్తున్న ఉత్సవానికి రాజకీయ, కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పంచభూతాలలో ఒకటైన అరుణాచల పుణ్యక్షేత్రానికి తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామన్నారు. కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శన సౌకర్యం ఉంటుందన్నారు.
@ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ శంకర్ పట్నం మండలంలో లారీ, బైకు డీ.. ఒకరి మృతి. @ చెందుర్తి మండలంలో బస్సు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ ధర్మపురిలో వైభవంగా గోదావరి మహా హారతి. @ మాజీ ఎమ్మెల్యే జ్యోతి మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. @ సిరిసిల్లలో ఉరి వేసుకుని నేత దంపతుల ఆత్మహత్య. @ జగిత్యాల మండలంలో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.
కూల్డ్రింక్ అనుకుని ఓ ఇంటర్ విద్యార్థిని పురుగు మందు తాగింది. ఈ ఘటన రాయికల్ మండలం ఇటిక్యాల ఆదర్శ పాఠశాలలో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థినిని జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. పట్టణంలోని వెంకంపేట్లో భైరి అమర్- స్రవంతి అనే చేనేత దంపతులు శనివారం ఆత్మహత్య
చేసుకున్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా పని దొరక్క.. చేసిన అప్పులు తీర్చే మార్గం తెలియక ఇంట్లో బలవన్మరణానికి పాల్పడారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై పోలీసుల దాడిని మాజీమంత్రి, MLA కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండోవిడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా దాడి చేస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధులపై కూడా దాడికి దిగడమేనా.. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు.
దళిత బిడ్డల కోసం పోరాడుతున్న తనను సీఎం రేవంత్ రెడ్డి చంపినా పర్వాలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పేద దళితులకు రూ.12 లక్షలు ఇస్తానని చెప్పారని, ఏమైందని ప్రశ్నిస్తే తన చేయి విరగొట్టారని వాపోయారు. తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. రెండో విడత దళిత బంధు ఇచ్చే వరకు పోరాటం ఆపేదే లేదన్నారు.
BRS, BJPపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈరోజు HYDలోని గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. KCR, KTR, హరీశ్ రావును అరెస్ట్ చేస్తామని, జైలుకు పంపుతామని గతంలో బండి సంజయ్ అన్నారని గుర్తు చేశారు. కానీ తాము చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని, బండి సంజయ్ సోయి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. BRS, BJP ఒక్కటే అని, కులగణన, మూసీ ప్రక్షాళనను అడ్డుకోవద్దని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ను హెచ్చరించారు.
మలేషియాలో జరుగుతున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వెళ్లారు. మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్కు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. వారి వెంట కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు.
బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి అంత్యక్రియలను ఆదివారం మెట్పల్లిలో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆమె పార్థివదేహాన్ని ప్రత్యేక చార్టెర్డ్ విమానంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి శనివారం సాయంత్రం చేరుకోనుంది. అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా రాత్రి వరకు మెట్పల్లి చేరుకుంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.