India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం KNRలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ముందంజలో ఉన్నారు. KNRలో 12వ రౌండ్ వరకు బండి సంజయ్ 1,38,616 ఓట్లు, 11వ రౌండ్ వరకు వంశీ కృష్ణ 73,591 ఓట్లతో లీడ్లో కొనసాగుతున్నారు. బండి సంజయ్కు మొత్తం 3,31,529 ఓట్లు వచ్చాయి.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ప్రతి రౌండ్లో ఆధిక్యతను కనబరుస్తూ దూసుకుపోతున్నారు. 12వ రౌండ్ ముగిసేసరికి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై 1,38,616 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బిజెపికి 3,31,529 ఓట్లు రాగా.. కాంగ్రెస్కు 1,92,913 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు 1,57,061 ఓట్లు వచ్చాయి.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రతి రౌండ్లో ఆధిక్యతను కనబరుస్తూ దూసుకుపోతున్నారు. 11వ రౌండ్ ముగిసేసరికి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై 1,25,575 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీకి 3,02,198 ఓట్లు రాగా.. కాంగ్రెస్కు 1,76,623 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు 1,44,541 ఓట్లు వచ్చాయి.
కరీంనగర్లో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదో రౌండ్ లెక్కింపు ముగిసేసరికి BJP అభ్యర్థి బండి సంజయ్ 63,985 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఐదో రౌండ్ ముగిసే సరికి బీజేపీ 1,42,675, కాంగ్రెస్ 78,690, బీఆర్ఎస్ 66,351 ఓట్లు వచ్చాయి.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటుచేసిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్ కేంద్రాన్ని మంగళవారం ఉదయం పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి సందర్శించారు. కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఆయన వెంట పలువురు పోలీస్ అధికారులు ఉన్నారు.
కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ను ఎన్నికల కౌంటింగ్ అధికారులు ప్రారంభించారు. ఈవీఏం మెషిన్లను ఓపెన్ చేసి వివిధ పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్లను నమోదు చేస్తూ కౌంటింగ్ ఏజెంట్లకు చూపుతున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్, ఈటిపీబిఎస్ ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపును కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి పర్యవేక్షిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాగానే ఈవీఎంల లెక్కింపును చేపట్టమన్నారు.
కరీంనగర్లో ఎవరు గెలుస్తారు…? పెద్దపల్లిలో ఎవరు గెలుస్తారు..? రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటూ పార్లమెంట్ ఫలితాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే ఫలితాలు తేలిపోనుండటంతో అందరిలో పార్లమెంట్ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఎక్కడ నలుగురు కలిసినా ఓట్ల లెక్కింపు, ఫలితాలపైనే చర్చించుకుంటున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశాలుంటాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరి కొన్ని గంటల్లో తేలనుంది. సుమారు 21 రోజుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. కరీంనగర్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను SRR కళాశాలలో లెక్కించనున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన 4 అసెంబ్లీ సెగ్మెంట్లను మంథని JNTU కళాశాలలో లెక్కించనుండగా.. మిగతా 3 అసెంబ్లీ సెగ్మెంట్లవి మంచిర్యాలలోని ఐజా కళాశాలలో లెక్కిస్తారు.
కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వివరాలు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్ను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్ను రామగిరి మండలం పన్నూరులోని జేఎన్టీయూ కళాశాలలో నిర్వహిస్తున్నారు. అలాగే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ను డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.