Karimnagar

News October 11, 2024

కరీంనగర్: నేడు కొత్తపల్లిలో సద్దుల బతుకమ్మ

image

రాష్ట్ర వ్యాప్తంగా అంతట ఏడు, తొమ్మిది రోజుల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో మాత్రం పదో రోజు జరుపుకొంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో శుక్రవారం కొత్తపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, అధికారులు చెరువు కట్ట ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేశారు.

News October 11, 2024

పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణది: ఆది శ్రీనివాస్ 

image

పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ట్రానిదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల మానేరు వాగు తీరంలో గురువారం సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ సంబరాలు – 2024 పేరిట చేపట్టిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆది శ్రీనివాస్ హాజరై తిలకించారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను ఇలాగే కొనసాగించాలని కోరారు.

News October 10, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

image

సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రావాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలోనే జిల్లాలో పర్యటిస్తానని తెలిపారు.

News October 10, 2024

సిరిసిల్ల: సీఎం రేవంత్ రెడ్డి బొమ్మతో బతుకమ్మ

image

సీఎం రేవంత్ రెడ్డిపై అభిమానంతో ఓ యువకుడు వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి సద్దు బతుకమ్మ సందర్భంగా బతుకమ్మపై రేవంత్ రెడ్డి చిత్రపటం వచ్చేలా బతుకమ్మను పేర్చి సోషల్ మీడియాలో చిత్రాలు అప్లోడ్ చేశారు. నెటిజన్లను ఈ బతుకమ్మ ఎంతగానో ఆకర్షిస్తోంది.

News October 10, 2024

గోదావరిఖని టూ టౌన్ పరిధిలో యువకుడి హత్య

image

గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి యైటింక్లైన్ కాలనీ- హనుమాన్ నగర్‌లో వినయ్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. యువకుల మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో పట్టపగలే కత్తులతో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 10, 2024

కరీంనగర్: ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం!

image

వరి ధాన్యం కొనుగోళ్లకు కరీంనగర్ జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దొడ్డు, సన్న రకాలను వేర్వేరుగా కొనుగోలు చేయాలని ఆదేశించగా.. ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. కాగా వానాకాలం ధాన్యం సేకరణకు గానూ 348 కొనుగోలు కేంద్రాలు అవసరమని ప్రతిపాదించారు. ఈ నెల మూడో వారంలో పంట కోతలు ప్రారంభం కానున్నాయి.

News October 10, 2024

టాటా లేని లోటు పూడ్చలేనిది: కేటీఆర్

image

రతన్ టాటా మరణం పట్ల KTR సంతాపం తెలిపారు. రతన్‌టాటా అద్భుతమైన ఆవిష్కర్త, దార్శనీకుడు, మహనీయుడని అన్నారు. టాటా మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. భారత వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన ఆయన ఎంతోమందికి ప్రేరణ అని పేర్కొన్నారు. రతన్ టాటా వినయపూర్వ దిగ్గజమని కొనియాడారు. వ్యాపార రంగంలో ఆయన లేని లోటు పూడ్చ లేనిదన్నారు. దాతృత్వంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు.

News October 10, 2024

జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంకటరావుపేట రోడ్డుపై హోండా షోరూం ముందు ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డు విధులు నిర్వహిస్తున్న సుబ్బరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 10, 2024

కరీంనగర్: తమ్ముడిని చంపిన అన్న

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో మంగళవారం అర్ధరాత్రి తమ్ముడిని అన్న చంపిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రేమలత-రాజయ్యకు కుమారులు కుమారస్వామి, చంద్రయ్య. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా, వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో చంద్రయ్య మద్యం తాగి అన్నతో గొడవకు దిగాడు. ఆవేశంతో కుమారస్వామి ఇనుపరాడ్‌తో దాడి చేయగా చంద్రయ్య చనిపోయాడు.

News October 10, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,08,966 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.54,712, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.35,920, అన్నదానం రూ.18,334,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.