India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
KNR జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల ప్రకారం.. రామడుగు మండలం షానగర్ గ్రామ సమీపంలో బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. రామడుగు మండల కేంద్రం నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం షానగర్ శివారు ప్రాంతంలో కరీంనగర్ నుంచి బైకుపై వెళ్తున్న శివాజీ, అరుణ్ను ఢీ కొట్టింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
@ ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ.
@ రామడుగు మండలంలో బొలెరో, బైక్ ఢీ.. ఒకరి మృతి.
@ వేములవాడ మండలంలో కారు, బైకు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.
@ మెట్పల్లిలో ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.2,27,188 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,57,776, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.45,690, అన్నదానం రూ.23,732,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
KNR జిల్లాలోని వివిధ మండలాల108 అంబులెన్సులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్గా పనిచేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మేనేజర్ ఇమ్రాన్ తెలిపారు. అర్హత: BSC-BZC, BSC-NURS, ANM, GNM, B-PM, M-PM లేదా ఇంటర్ తర్వాత ఏదైనా మెడికల్ డిప్లమా ఉండాలని, 25-30లోపు వయసు ఉండాలన్నారు. ఈనెల 6న ఉదయం 10 నుంచి 4లోపు, జిల్లా ఆస్పత్రిలోని 108 ఆఫీసులో ఒరిజినల్, ఒక సెట్టు జిరాక్స్తో రావాలన్నారు.
వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండలంలో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆయనకు బీజేపీ శ్రేణులు పుష్పగుచ్చాలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్ గ్రామానికి చెందిన కూన పోచయ్య (45) ముల్కనూరు బస్టాండులో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. 3 రోజుల క్రితం పోచయ్య భార్య రేణుక పండగకు తల్లిగారింటికి వెళ్లగా.. మద్యం తాగుతూ అప్పటి నుంచి బస్టాండులోనే ఉంటున్నాడు. సోమవారం అతడి భార్య ఇంటికి తీసుకువెళ్లేందుకు బస్టాండ్ వద్దకు వచ్చింది. నీళ్లు తాగించి నిమ్మరసం కోసం పక్కకు రాగానే కిందకు ఒరిగి మృతి చెందాడు.
ఉమ్మడి KNR జిల్లాలో పట్టభద్రుల మండలి ఎన్నికల ప్రచార సందడి రోజురోజుకు పెరుగుతోంది. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. పట్టభద్రులను కలుస్తూ NOV 2021 వరకు డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. సోమవారం నాటికి ఉమ్మడి జిల్లాలో 1,18,822 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది. మరి మీరు అప్లై చేశారా? కామెంట్ చేయండి.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.2,49,322 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,39,134, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.76,550, అన్నదానం రూ.33,638,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారి ఆర్ వి కర్ణన్ నియమితులయ్యారు. జగిత్యాల, పెద్దపెల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు. రేపటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించనున్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాస మొదటి సోమవారం పురస్కరించుకొని 76,329 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో కే.వినోద్ రెడ్డి తెలిపారు. అధికసంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
Sorry, no posts matched your criteria.