India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తండ్రి ఫిర్యాదుతో కొడుకుకు చేసిన భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులు రద్దు చేశారు. భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్లో మద్దెల రాజకొంరయ్య 4.12 ఎకరాలు 2018లో కొడుకు రవికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశాడు. అతను తండ్రిని వదిలేయడంతో సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద పిటిషన్ ఫైల్ చేశారని భీమదేవరపల్లి తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దుచేసి తిరిగి తండ్రికి భూమి పాస్బుక్ అందించారు.
కరీంనగర్ రైల్వే స్టేషన్లో అధికారుల నిర్లక్ష్యంతో అంధకారం నెలకొంది. ఆదివారం రాత్రి తిరుపతికి వెళ్లాల్సిన ప్రయాణికులు చీకట్లో పడరాని పాట్లు వడ్డారు. ఫ్లాట్ఫామ్కు కేవలం ఒక్కటే ఫ్లాడ్ లైట్ ఉండటంతో దూరంగా ఉన్న రైలు బోగీలోకి ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనుల్లో భాగంగా సరఫరా నిలిపివేశారు. దీంతో రైల్వే స్టేషన్ అంధకారం నెలకొనడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.3,62,638 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.2,13,973, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,03,600, అన్నదానం రూ.45,065, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రజలకు తెలియజేశారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం ప్రారంభంలో 60,256 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో కే. వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
తెలంగాణ చేనేత ఐక్యవేదిక జిల్లా అధికార ప్రతినిధిగా పోరండ్ల ప్రవీణ్ (గోదావరిఖని) అలాగే జిల్లా సహాయ కార్యదర్శిగా బూర్ల శ్రీనివాస్ (లక్ష్మీపురం) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్, జిల్లా అధ్యక్షుడు ఆడెపు శంకర్ నియామక ఉత్తర్వులను జారీ చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎన్నికైన ప్రతినిధులను అభినందించారు.
రామగుండం సింగరేణి సంస్థ నుంచి బొగ్గును యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్కు తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు యాదాద్రి పవర్ ప్లాంట్ (YTPS) టెక్ ఆఫ్ దగ్గర రైలును రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, పవర్ప్లాంట్, రైల్వే విభాగం అధికారులు పాల్గొన్నారు.
దక్షిణ కాశీగా పేరుందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం పురస్కరించుకొని ముందుగా భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడె మొక్కులు చెల్లించుకొని స్వామి సేవలో తరించారు. భక్తులు భారీగా తరలివచ్చినప్పటికీ ధర్మ దర్శనంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆలయ ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.
ఈనెల 12న రైతు రుణమాఫీ, రైతుభరోసా అమలుపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ కుమార్ ప్రకటించిన పాదయాత్ర విషయం తెలిసిందే. కాగా కోరుట్ల నుంచి జగిత్యాల వరకు నిర్వహించే పాదయాత్రలో కేటీఆర్, హరిశ్రావు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కార్తీకమాసం ప్రారంభమైన తరుణంలో ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడనున్నాయి. కార్తీకమాసన్ని పురస్కరించుకొని గోదావరి నది తీరాలలో భక్తులు గంగ స్నానాలు ఆచరించానున్నారు. కాగా, ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, గంగనధుల్లో నివసిస్తారని అభిషేకాలతోపాటు, గంగా స్నానాలు ఆచరించడం అత్యంత విశిష్టమైనవని ప్రముఖ పూజారులు చెబుతున్నారు.
RTC బస్సు ఢీకొని ఓ యువతి మృతి చెందిన ఘటన HYDలోని తార్నాకలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై మంథనికి చెందిన యువతి మెట్టుగూడ నుంచి హబ్సిగూడ ప్రధాన రహదారిలో వెళ్తోంది. ఈ క్రమంలో రిలయన్స్ స్మార్ట్ బజారు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.