India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధాన్యం రవాణాకు ఇబ్బందులు లేకుండా అవసరమైన వాహనాలు సమకూర్చాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం రవాణా కోసం అవసరమైన వాహనాలను సమకూర్చాలని సంబంధిత అధికారు, ఏజెన్సీలను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో మరి కొన్ని రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ డిసెంబర్ చివరిలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొందరు మాజీ సర్పంచ్లు తమకు అవకాశం వస్తే తప్పకుండ మళ్లీ పోటీ చేస్తామని అంటున్నారు.
జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సచివాలయం నుంచి ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 27పై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించామన్నారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 340 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు.
కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామానికి చెందిన సుంకరి బుచ్చమ్మ (70) అనే వృద్ధురాలు వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బుచ్చమ్మ గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఇంట్లో ఉంటుంది. ఆసుపత్రిలో చూయించుకున్న నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ పేర్కొన్నారు.
మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబును ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్సీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని, బల్మూరు వెంకట్కు ఎమ్మెల్సీ పదవి రావడం ఇందుకు నిదర్శనమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
సింగరేణి సంస్థ మాజీ ఉద్యోగులు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ నవంబర్లో పెన్షన్, CPRMS (మెడికల్ కార్డు) రెన్యువల్ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని రామగుండం సింగరేణి యాజమాన్యం పేర్కొంది. సకాలంలో దరఖాస్తులు చేయకపోతే పెన్షన్ డబ్బులు ఆగిపోతాయని, హెల్త్ కార్డు వ్యాలిడిటీ ముగుస్తుందని పేర్కొన్నారు. సంస్థ ప్రయోజనాల కోసం వెంటనే దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
KNR జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై శుక్రవారం అర్ధరాత్రి ఓ లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో వరంగల్-కరీంనగర్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లియర్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే విజయవంతం చేయాలని బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సమగ్ర కులాల స్థితిగతులపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు. సమగ్రంగా అన్ని కులాల వారు ఎంత మంది ఏ స్థితిగతులలో ఉన్నారో తెలుసుకుంటుందని అన్నారు.
@ రామడుగు మండలంలో కాలువలో దూకి వృద్ధుడి ఆత్మహత్య. @ ఎల్లారెడ్డిపేట మండలంలో బాలికపై వీధి కుక్క దాడి. @ కోరుట్ల లో గంగమ్మ ఆలయంలో చోరీ. @ జగిత్యాలలో పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు. @ కరీంనగర్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించిన బీసీ కమిషన్ సభ్యులు@ కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్న సిరిసిల్ల కలెక్టర్@ జగిత్యాలలో షార్ట్ సర్క్యూట్ తో బట్టల షాపు దగ్ధం
కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో శుక్రవారం బీసీ కమిషన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 213 విజ్ఞప్తులు వచ్చాయి. వీటిలో కరీంనగర్ జిల్లా నుంచి 99 విజ్ఞప్తులు రాగా జగిత్యాల జిల్లా నుంచి 29, పెద్దపల్లి జిల్లా నుంచి 32, రాజన్నసిరిసిల్ల జిల్లా నుంచి 53 విజ్ఞప్తులు వచ్చాయి. సుమారు 9 గంటల పాటు బీసీ కమిషన్ సభ్యులు విజ్ఞప్తులను స్వీకరించారు.
Sorry, no posts matched your criteria.