India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కార్తీక మాసం పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం సోమ, మంగళవారాల్లో వేములవాడ నుంచి వరంగల్కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కరీంనగర్ RM సుచరిత తెలిపారు. శని, ఆదివారాల్లో వరంగల్ నుంచి వేములవాడకు సర్వీసులు నడుపుతామని పేర్కొన్నారు. శబరిమలకు వెళ్లే భక్తులకు, అరుణాచలగిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు.
KNR జిల్లా చొప్పదండి MLA మేడిపల్లి సత్యంను ఫోన్, వాట్సాప్లో బెదిరించిన వ్యక్తిపై బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ద్వారా లుక్అవుట్ సర్కులర్ జారీ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. MLA సత్యంకు సెప్టెంబర్ 28న మధ్యాహ్నం రాత్రి సమయాల్లో వాట్సాప్ ద్వారా నిందితుడు ఫోన్ చేశాడు. ఈ క్రమంలో తనకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. కాగా, కేసు నమోదైంది.
@ వేములవాడ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్.
@ రామడుగు మండలంలో చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య.
@ మానకొండూరు మండలంలో కారు, అంబులెన్స్ ఢీ.. ఒకరికి గాయాలు.
@ మల్యాల మండలంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి.
@ గొల్లపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్.
మాస శివరాత్రి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజేశ్వరి స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. పరివార దేవతార్చనలు నిర్వహించారు. స్వామివారికి మహాలింగార్చన వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,25,713 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్ల అమ్మకం ద్వారా రూ.67,791, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.40,700, అన్నదానం రూ.17,222 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రజలకు తెలియజేశారు.
రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నవంబర్ 1న కరీంనగర్ కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ ఛైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, బీసీ వెల్ఫేర్ కమిషనర్లతో కూడిన బృందం ప్రజాభిప్రాయ సేకరణ జరుపనుందని వెల్లడించారు. అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, తెలియజేయాలనుకునే వారు రాతపూర్వక సమర్పణలు చేయాలని సూచించారు.
శాతవాహన విశ్వ విద్యాలయం ఎమ్మెస్సీ (ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్) నాలుగో, రెండో సెమిస్టర్ పరీక్షలు, బీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డా. శ్రీ రంగప్రసాద్ తెలిపారు. ఫలితాలు www.satavahana.ac.in వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
భార్యను భర్త హతమార్చిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వెల్మల రమేశ్ ఉపాధికోసం ఫారిన్ వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి. బుధవారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. భర్త రమేశ్ భార్య సునీతను హతమార్చాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్లో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగాపూర్కు చెందిన ఆరేపల్లి అపర్ణకు, ఆమె భర్తకు 2ఏళ్లుగా కుటుంబకలహాలు చోటుచేసుకున్నాయి. దీంతో పాటు వరకట్న వేధింపులు అధికమవ్వడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లి శంకరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేటలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సమాచారం ఇవ్వకుండా డ్యూటీ హాజరుకానుందన శ్రీనివాస్కు నోటీసులు జారీచేశారు. ఉన్నతాధికారులు అందించిన సూచనలు, ఆదేశాలను పట్టించుకోకుండా.. డ్యూటీలో చేరమని అక్టోబర్ 26న చివరి అవకాశం ఇచ్చినప్పటికీ చేరకపోవడంతో సస్పెండ్ చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.