Karimnagar

News May 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం చెరువులో యువకుడి గల్లంతు. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ముస్తాబాద్ మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య. @ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ను సజావుగా నిర్వహించాలన్న జగిత్యాల కలెక్టర్. @ కరీంనగర్ నుండి హనుమకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్ డ్రైవర్ పై దాడి. @ మల్యాల మండలంలో చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఎన్టీఆర్ జయంతి.

News May 28, 2024

ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా బాధాకరం: మానకొండూరు ఎమ్మెల్యే

image

ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా బాధాకరమని మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం సిగ్గు చేటని కరీంనగర్‌లో జరిగిన సమావేశంలో తెలిపారు. మాజీ ఐజీ రాధాకిషన్ రావు వారి వాంగ్మూలంలో తన పేరు చెప్పడం చాలా బాధాకరమని పేర్కొన్నారు.

News May 28, 2024

రేపటి నుంచి కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు

image

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 29 నుంచి 1 వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. మూడు రోజుల పాటు ఆలయంలో నిర్వహించనున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, దీక్షాపరులు లక్షల సంఖ్యలో తరలిరానున్నందున ఆర్జిత సేవలు రద్దు చేశారు. కాగా, జయంతికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్  శ్రీనివాస్ శర్మ తెలిపారు.

News May 28, 2024

వరద భయం.. బిక్కుమంటూ ధర్మపురి పట్టణ ప్రజలు

image

ధర్మపురిలో ఏటా గోదావరి వరదల వల్ల తీర ప్రాంత ప్రజలు సర్వం కోల్పోతున్నారు. నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్ట్ కారణంగా అధిక వర్షాలతో వరద పోటెత్తి.. ఆ ప్రభావం ధర్మపురి పట్టణంపై పడుతోంది. ధర్మపురిలో తెనుగువాడ, కుమ్మరివాడ, భ్రాహ్మణసంఘం, తెలుగు కళాశాల, రామాలయం. మంగళిగడ్డ, బోయవాడ, ఒడ్డెర కాలనీలను ముంపు ప్రాంతాలుగా గుర్తించి, వరద నివారణకై కరకట్ట నిర్మాణానికి రూ.4 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశారు.

News May 28, 2024

KNR: మాతాశిశు ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం!

image

మాతాశిశు ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం పేషెంట్ల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. తాజాగా ఓ మహిళ రక్తస్రావం కావడంతో మాతాశిశు కేంద్రంలో చేరగా.. రక్త పరీక్షలు నిర్వహించి ‘బీ పాజిటివ్‌’గా నిర్ధారించారు. ఈ క్రమంలో బ్లడ్ కోసం కుటుంబీకులు ఎంత వెతికినా దొరక్కపోవడంతో అనుమానం వచ్చి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చెక్ చేయించుకున్నారు. అది కాస్తా ‘ఓ పాజిటివ్‌’ రావడంతో కుటుంబీకులు మాతాశిశు కేంద్రాన్ని నిలదీశారు.

News May 28, 2024

పెరుగుతున్న సైబర్ మెసాలు.. జగిత్యాలో 546 కేసులు

image

ఉమ్మడి KNRవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జగిత్యాల జిల్లాలో మొత్తం 546 కేసులు నమోవ్వగా.. వీటిలో UPI ద్వారా నగదు దోచుకున్న కేసులే 288 ఉన్నాయి. కోరుట్లకు చెందిన ఓ వ్యక్తిని పలువురు బెదిరించి రూ.4.23 కోట్లు కాజేశారు. వీరిలో పోలీసులు కొందరిని గుర్తించి అరెస్టు చేశారు. ఎవ్వరికీ బ్యాంకు డీటెయిల్స్ చెప్పొద్దని, మోసపోయామని గుర్తిస్తే 1903కి కాల్ చేసి చెప్పాలని జగిత్యాల DSP రఘు చందర్ తెలిపారు.

News May 28, 2024

KNR: ఈనెల 28, 29న సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లలో భాగంగా స్పోర్ట్స్, అంగవైకల్యం, NCC అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు దోస్త్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సుజాత తెలిపారు. దోస్త్ హెల్ప్ సెంటర్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులో వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుందని.. మిగతా వివరాలకు యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్ సంప్రదించాలని కోరారు.

News May 28, 2024

కేసీఆర్ కాలనీలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య

image

తాగుడుకు బానిసై ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. చిప్పలపల్లి గ్రామం కేసీఆర్ కాలనీకి చెందిన శంకర్(45) తాగుడుకు బానిసయ్యాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేరు సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న లింగం సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.

News May 28, 2024

కొండగట్టు అంజన్న భక్తులకు శుభవార్త

image

కొండగట్టు పుణ్యక్షేత్రంలో రాత్రి 8 గంటలకే గుడి తలుపులు మూసి వేస్తుండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని చొప్పదండి MLA సత్యం దృష్టికి భక్తులు తీసుకెళ్లడంతో ఆయన స్పందించారు. జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో MLA మాట్లాడి.. రాత్రి 10.30 గంటల వరకు గుడి తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ EOతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

News May 28, 2024

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి: పమేలా సత్పతి

image

జూన్ 4న కరీంనగర్ లోక్‌సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.