India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లాలో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పట్టాదారులకు పంట రుణాలు, రుణమాఫీలు అందిస్తూ కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. దీంతో పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులే దిక్కవుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కింద కౌలు దారులకు ఏటా ఎకరానికి రూ.15వేల చొప్పున సాయం అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
భ్రూణ హత్యలు జరగకుండా ప్రజలను చైతన్య పర్చాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. ఆడ, మగ ఇద్దరినీ ఒకేలా చూడాలని చెప్పారు. ప్రతి శుక్రవారం జరిగే సభలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, లేక ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లాలో కొత్తగా 1000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. మన జిల్లాలో 324 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు ప్లాంటేషన్ చేయడం జరిగిందని, మరో 350 ఎకరాలలో ప్లాంటేషన్ చేయడానికి సన్నద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
@ మెట్ పల్లి మండలంలో రెండు బైకులు ఢీకొని ఇద్దరి మృతి. @ కోనరావుపేట మండలంలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. @ బీర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్. @ గంగాధర మండలంలో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య. @ వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లి శివారులో సుమారు 50 కోతుల మృతి. @ గోదావరిఖనిలో మృతి చెందిన కుమారుని కండ్లు దానం చేసిన తల్లిదండ్రులు.
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్లో జరిగిన కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడిని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ పంపినట్టు తెలిపిన ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. భూ వివాదాలు, పాతకక్షల కారణంగానే సంతోష్ గంగారెడ్డిని హత్య చేశారని ఆయన పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతపై శుక్రవారం కమిషనరేట్లో సమావేశ నిర్వహించారు.రోడ్డు భద్రత అనేది అత్యంత ప్రాధాన్యమైనదని, మానవ తప్పిదాల వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ప్రమాదాలలో యువతే ఎక్కువగా చనిపోతున్నారని, వీటిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
మెట్పల్లి మండలంలోని వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయ సమీపంలో శుక్రవారం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. బండలింగాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వెల్లుల్ల గ్రామానికి చెందిన దగ్గుల స్వామిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన చింతలతదేపు మహేశ్ (29) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లి తనకు ఇష్టం లేని పెళ్లి చేసిందని మనోవేదనకు గురై శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు.
శంకరపట్నం మండలం ఎరడపల్లి అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం ఐసీడీఎస్ సూపర్వైజర్ స్రవంతి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ నాగార్జున, పీహెచ్సీ డాక్టర్ శ్రావణ్ హాజరయ్యారు. నాగార్జున మాట్లాడుతూ.. పిల్లల సంరక్షణకై అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం అందిస్తుందన్నారు. డా.శ్రావణ్ మాట్లాడుతూ.. గర్భిణీలకు, స్త్రీలకు, పోషకాహారంపై అవగాహన కల్పించారు.
కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో క్యాంటీన్ నిర్మాణ పనుల్ని అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో పూర్తిచేసిన ప్లాస్టరింగ్ పనులు పరిశీలించారు. పెయింటింగ్ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.