Karimnagar

News May 24, 2024

కరీంనగర్: నేడు పాలిసెట్.. 3,766 మంది విద్యార్థులు

image

కరీంనగర్ జిల్లాలో నేడు పాలిసెట్ పరీక్ష జరగనుంది. ఉ.11 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమై మ.1.30 గంటల వరకు కొనసాగుతుంది. 9 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. గంట ముందు నుంచే అనుమతి ఉంటుంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉండదు. విద్యార్థులు హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, ఎరేజర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకెళ్లాలి. పరీక్షకు జిల్లా నుంచి 3,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

News May 23, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సైదాపూర్ మండలంలో 26 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ మెట్పల్లి మండలంలో లారీ, కారు ఢీ.. కుమారుడి మృతి, తండ్రికి గాయాలు. @ ఓదెల మండలంలో చిరుత పులి సంచారం కలకలం. @ ఎల్లారెడ్డిపేట మండలంలో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య. @ కొడిమ్యాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్. @ పెద్దపల్లి లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

News May 23, 2024

కొడిమ్యాల: ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలి: అడిషనల్ కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లను 2, 3 రోజుల్లో పూర్తిచేయాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. కొడిమ్యాల మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. అకాల వర్షాల వలన నష్టపోయిన పంట వివరాలను తెలుసుకున్నారు. రైస్ మిల్లు లను సందర్శించి వెంటనే ధాన్యాన్ని అన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.

News May 23, 2024

పెద్దపల్లి: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

పెద్దపల్లి ఆదర్శ్‌నగర్‌లో గల బంధంపల్లి చెరువును అనుకొని ఉన్న వ్యవసాయ కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనది. పెద్దపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 40 నుంచి 45 మధ్య ఉంటుందన్నారు. తెల్లని చొక్కా, నీలిరంగు లుంగీ పంచ కలిగి ఉందని తెలిపారు. వివరాలు తెలిసినవారు పెద్దపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News May 23, 2024

ఏడాదిలో రెండు ఓపెన్ కాస్ట్ గనుల మూసివేత!

image

రానున్న ఏడాది కాలంలో సింగరేణికి సంబంధించి రెండు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను మూసివేసే పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాజెక్టులలో బొగ్గు నిక్షేపాలు పూర్తి కావడంతో మూసివేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. రామగుండం రీజియన్‌లోని OCP-1, శ్రీరాంపూర్ ప్రాంతంలోని రామకృష్ణాపూర్ ఓసీపీలో బొగ్గు నిక్షేపాలు పూర్తి కానున్నాయి. వచ్చే ఏడాది నాటికి దాదాపుగా వీటిని మూసివేసే అవకాశం ఉంది.

News May 23, 2024

కరీంనగర్: 27 నుంచి జూన్ 30 వరకు రైళ్లు రద్దు

image

మూడో లైను పనుల కారణంగా ఈనెల 27 నుంచి జూన్ 30 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 07462/ 63 వరంగల్- సికింద్రాబాద్ పుష్ పుల్ రైలు, 17035/ 36 కాజీపేట- బల్లార్షా, 07766/ 65 కరీంనగర్- సిర్పూర్ టౌన్, 07894 కరీంనగర్ – బోధన్ రైలు వచ్చే నెల 30 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

News May 23, 2024

రామగుండం- మణుగూరు రైల్వే లైను 207.80 కి.మీ

image

రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక <<13298191>>రైల్వే కోర్ కారిడార్ <<>>ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు 207.80 కి.మీ మేర ఈ నడవా విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్ గేజ్ నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భూ సేకరణ చేపట్టాలని SCR అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో 142 కి.మీ. దూరం తగ్గనుంది.

News May 23, 2024

కరీంనగర్: సన్నాల వైపు రైతుల చూపు!

image

సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌‌ను వచ్చే వానాకాలం సీజన్‌ నుంచే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సన్న రకం వరి సాగు పెరగనుంది. సాధారణ వరి సాగు విస్తీర్ణం కన్నా అదనంగా 15 నుంచి 20 శాతం పెరగవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ నీరు, సానుకూల వాతావరణం దృష్ట్యా ఖరీఫ్‌లో రైతులు సన్న రకం వరి సాగు వైపు మక్కువ చూపుతారు.

News May 23, 2024

కరీంనగర్: రేపటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్షల కోసం 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరంలో 10,073 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,907 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News May 23, 2024

ఎంతమందికి స్కూటీలు, తులం బంగారం ఇచ్చారో చెప్పాలి: KTR

image

కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రాగానే మహిళలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని అన్నారు. ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.