Karimnagar

News September 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ హుజురాబాద్ మండలంలో పిడుగుపాటుతో పశువుల కాపరి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో బస్సు దిగుతుండగా గుండెపోటుతో వ్యక్తి మృతి. @ సైదాపూర్ మండలంలో 18 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ గొల్లపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రమును, కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ మల్యాల మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు. @ జాతీయస్థాయి ట్రెక్కింగ్ శిబిరానికి ఎంపికైన జగిత్యాల విద్యార్థిని.

News September 24, 2024

ఓటరు నమోదు కట్టుదిట్టంగా నిర్వహించాలి: సుదర్శన్ రెడ్డి

image

ఓటర్ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఇంటింటి సర్వేలో ఆధార్ నంబర్ సేకరణ తప్పనిసరి కాదని, ఓటర్లు ఇష్టం ఉంటే ఇవ్వవచ్చన్నారు. సెప్టెంబర్ 28 నాటికి ఇంటింటి సర్వే వంద శాంతం పూర్తి చేయాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు తదితరులున్నారు.

News September 24, 2024

GDK: సింగరేణి సంస్థకు రూ.2 వేల కోట్ల లాభాలు

image

సింగరేణి సంస్థ లాభాల జోష్‌లో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక లాభాలు సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా.. రూ.2,388.50 కోట్ల లాభాలు సాధించింది. అయితే, గతంలో కన్నా ఈసారి 1 శాతం పెంచి 33 శాతం కార్మికుల వాటాగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు దసరా బోనస్ కూడా ప్రకటించడంతో గోదావరిఖని కార్మికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

News September 24, 2024

కరీంనగర్: రెండేళ్లలో 519 శిశు మరణాలు!

image

కరీంనగర్ జిల్లాలో శిశు మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన లోపమే కారణమని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో రెండేళ్లలో 519 మంది శిశువులు మరణించారు. గర్భిణులు 9 నెలల పాటు పౌష్టికాహారం తీసుకుంటూ, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో కొన్ని చోట్ల ఇబ్బందులు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి.

News September 24, 2024

సిరిసిల్ల: కూతురు కష్టాలు తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

image

కన్న కూతురి కష్టాలను తట్టుకోలేక ఓ తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన శ్రీనివాస్(50) కూతురు రమ్యను 11 ఏళ్లక్రితం సిరిసిల్ల రాజునగర్‌కు చెందిన శ్రీకాంత్‌తో పెళ్లి చేశాడు. తన కూతురిని అల్లుడు చిత్ర హింసలు పెడుతున్నాడని తీవ్ర మనస్తాపానికి గురై వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

News September 24, 2024

ఉమ్మడి KNR జిల్లాలో రేషన్ దరఖాస్తుల వివరాలు

image

వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డు జారీపై మంత్రివర్గ ఉపసంఘం క్లారిటీ ఇచ్చింది. దీంతో తొందర్లోనే కార్డులు రానున్నాయి. కాగా ఉమ్మడి జిల్లాలో జగిత్యాల జిల్లాలో 3317, పెద్దపల్లి జిల్లాలో 2436, కరీంనగర్ జిల్లాలో 5303, సిరిసిల్ల జిల్లాలో 1355 దరఖాస్తులు రేషన్ కార్డు కోసం పెండింగ్‌లో ఉన్నాయి.

News September 24, 2024

అన్నపూర్ణ రిజర్వాయర్‌కు కొనసాగుతున్న నీటి ఎత్తిపోతలు

image

ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామసమీపంలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌కు నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 3.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 2.98 టీఎంసీలు ఉన్నాయన్నారు. మిడ్‌మానేరు ద్వారా వచ్చిన 3,200 క్యూసెక్కుల నీటిని ఒక పంపు ద్వారా ఎత్తిపోస్తుండగా, ఎగువన ఉన్న రంగనాయకసాగర్‌కు 3,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

News September 23, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోరుట్లలో ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి. @ మెట్పల్లిలో చోరీకి పాల్పడిన ముగ్గురు అరెస్ట్. @ కరీంనగర్ ప్రజావాణిలో 267, జగిత్యాల ప్రజావాణిలో 56 ఫిర్యాదులు. @ కరీంనగర్ ఎల్ఎండి లో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం. @ ప్రజావాణికి గైర్హాజరైన అధికారులపై చర్యలు ఉంటాయన్న సిరిసిల్ల కలెక్టర్. @ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై సమీక్షించిన జగిత్యాల కలెక్టర్. @ మల్లాపూర్ మండలంలో వ్యక్తి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్

News September 23, 2024

కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడీ చేస్తోంది: మాజీ MLA

image

సింగరేణి కార్మికులకు లాభాల వాటా ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంకెల గారడీ చేస్తోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. సంస్థ సాధించిన లాభాలలో సగం పక్కనపెట్టి మరో సగంలో 33% ఇవ్వటం సరైన విధానం కాదన్నారు. సంస్థ సాధించిన పూర్తి లాభాలలో 33 శాతాన్ని కార్మికులకు ఇస్తే ఒక్కొక్క కార్మికునికి రూ.4 లక్షలువచ్చే అవకాశం ఉందన్నారు.

News September 23, 2024

కోనరావుపేట: నాటు బాంబుల తయారీ ముఠా అరెస్ట్

image

కోనరావుపేట మండలంలో నాటు బాంబులు తయారు చేస్తూ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన రాజలింగం పలువురికి నాటు బాంబులు, గన్ పౌడర్ విక్రయించారు. ఈ నాటు బాంబులతో జంతువులను వేటాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు గ్రామాలపై నిఘా పెట్టారు. పోలీసులు 47 నాటు బాంబులు, గన్ పౌడర్‌ను స్వాధీనం చేసుకుని రాజలింగాన్ని అరెస్ట్ చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.