Karimnagar

News May 22, 2024

KNR: గ్రామాల్లో మొదలైన పంచాయతీ ఎన్నికల సందడి

image

మొన్నటి వరకు లోక్‌సభ ఎన్నికల హడావిడిలో మునిగి తేలిన నాయకులకు.. ఇక పంచాయితీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఫిబ్రవరి 2 నుంచి పల్లెలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. సైదాపూర్ మండలంలో మొత్తం 26 గ్రామపంచాయతీలు, 234 వార్డులు ఉండగా.. వీటికి సంబంధించిన వివరాలు అధికారులు సేకరిస్తున్నారు.

News May 22, 2024

KNR: అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

పాఠశాలలో ఎలాంటి లోపాలు లేకుండా విద్యార్థులకు అన్ని వసతులు, సౌకర్యాలతో కూడిన విద్యను అందించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యాశాఖ, ఆర్ ఆండ్ బి., ప్రత్యేకాధికారులతో అమ్మ ఆదర్శపాఠశాల అభివృద్ధి పనుల ప్రగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

News May 22, 2024

వేములవాడ: తప్పిన పెను ప్రమాదం.. ఊడిపోయిన టిప్పర్ టైర్లు

image

వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రధాన చౌరస్తా మూలమలుపు వద్ద బుధవారం ఉదయం బండల లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ వెనుక టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి. ప్రమాద సమయంలో టిప్పర్ దగ్గర ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో కాసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

News May 22, 2024

కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్‌ఐ భార్య ఆందోళన

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి SI నాగరాజు తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడని అతడి మొదటి భార్య మానస కొమురవెల్లి పీఎస్ ఎదుట తల్లి, బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. కరీంనగర్‌ జిల్లా గోపాలపురానికి చెందిన మానసకు ఎస్‌ఐ నాగరాజుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని మంగళవారం PS ఎదుట కూర్చుని నిరసన తెలిపారు.

News May 22, 2024

100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

image

భవిష్యత్తు 2029- 30 ఆర్థిక సంవత్సరం నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే విధంగా ప్రణాళికలు చేసుకోవాలని సింగరేణి డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గోదావరిఖనిలోని ఇల్లెందు క్లబ్‌లో రామగుండం, బెల్లంపల్లి రీజినల్ జనరల్ మేనేజర్లు, వివిధ విభాగాల అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న కాలంలో కొత్త గనుల ఏర్పాటు, గనుల విస్తరణపై చర్చించారు.

News May 22, 2024

UPDATE: మెట్‌పల్లిలో మహిళ హత్య

image

మెట్‌పల్లిలో ఓ మహిళ <<13286254>>హత్య<<>>కు గురైన విషయం విదితమే. పోలీసుల కథనం ప్రకారం.. మెట్‌పల్లికి చెందిన సింగం మమత (38) తన భర్తకు విడాకులు ఇచ్చి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా కుమార్తెతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అబ్దుల్ అప్సర్‌తో మమతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి మధ్య సోమవారం గొడవ జరిగింది. కోపంతో అప్సర్‌ మమతను గొంతునులిమి, కత్తితో పొడవడంతో చనిపోయినట్లు SI చిరంజీవి పేర్కొన్నారు.

News May 22, 2024

మానేరు ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ సంచలన తీర్పు

image

మానేరు నదిలో డిసిల్ట్రేషన్ పేరిట చేపట్టిన ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై సౌత్ బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. కరీంనగర్‌‌లో ప్రవహిస్తున్న మానేరు నదిలో ఇసుక తవ్వకాలు జరపడం చట్ట విరుద్ధమని తెలిపింది. ఇరిగేషన్, మైనింగ్ విభాగాలకు రూ. 25 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానాను 3నెలలోగా గోదావరి రివర్ మేనేజెమెంట్ బోర్డు కు చెల్లించాలని,ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

News May 22, 2024

కరీంనగర్: ECE విభాగంలో నవ్యశ్రీకి ఫస్ట్ ర్యాంకు

image

శంకరపట్నం మండలం కరీంపేట్‌కు చెందిన విద్యార్థిని M.నవ్యశ్రీ ఈసెట్‌ ఫలితాల్లో సత్తా చాటింది. ECE విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించింది. కేశవపట్నం ఆదర్శ పాఠశాలలో 2020-21లో పదో తరగతి చదివి 10 GPA సాధించింది. WGL ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా పూర్తి చేసింది. ఈసెట్‌‌లో ECE విభాగంలో 200 మార్కులకు 146 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు, ఇంటిగ్రెటేడ్‌లో 14వ ర్యాంకు సాధించింది.

News May 22, 2024

ఇన్‌ఛార్జి వీసీగా మంత్రి శ్రీధర్ బాబు సతీమణి

image

తెలంగాణలోని 10 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఇన్‌ఛార్జి వీసీలను నియమించింది. వీసీలుగా సీనియర్‌ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ మంగళవారం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. కాగా లిస్టులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి శైలజా రామయ్యర్ ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ అయిన శైలజా రామయ్యర్‌ను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి వీసీగా ప్రభుత్వం నియమించింది.

News May 21, 2024

శాతవాహన యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా సురేంద్రమోహన్

image

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా సురేంద్రమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వీసీ పదవీ కాలం పూర్తి కావడంతో ఇన్‌ఛార్జిగా ఐఏఎస్ అధికారులను నియమించింది. కొత్త వీసీలు నియమితులు అయ్యే వరకు వీరే విధుల్లో కొనసాగనున్నారు. ఇప్పటికే కొత్త వీసీల కోసం యూనివర్సిటీలో సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు.