Karimnagar

News October 18, 2024

గ్రూప్స్ పరీక్షల నిర్వాహణకు సన్నద్ధం కావాలి: టీఎస్పీఎస్సీ ఛైర్మన్

image

సజావుగా గ్రూప్స్ పరీక్షలను నిర్వహించడానికి సన్నద్ధం కావాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారు. గ్రూప్స్ పరీక్షల నిర్వహణ, తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం ఆయన కలెక్టర్లతో VC నిర్వహించారు. పరీక్షల నిర్వాహణకు ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాలను రేపటిలోగా తనిఖీ చేసి అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయో లేవో పరిశీలించాలన్నారు. కాన్ఫరెన్స్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.

News October 18, 2024

కరీంనగర్: పట్టాలు అందేదెన్నడు?

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ భూముల పట్టాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సాదాబైనామా ద్వారా దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్నప్పటికీ పట్టాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు పట్టాలు అందలేదు. ప్రభుత్వం స్పందించి వెంటనే పట్టాలు అందజేయాలని రైతులు కోరుతున్నారు.

News October 18, 2024

కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల సమాచారం

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సమాచారం కింది విధంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత మొత్తం కలిపి 615 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో బాలురు 19,602, బాలికలు 17,050, మొత్తం విద్యార్థులు 36,672 మంది ఉన్నారు. (డీఎస్సీ) కొత్త టీచర్లతో కలిపి మొత్తం 2,931 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.

News October 18, 2024

కరీంనగర్: ‘డబుల్’ ఇళ్లు వచ్చేదెన్నడో!

image

కరీంనగర్ రూరల్ మండలంలో మొగ్దుంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి గ్రామాల్లో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. రూ.6 కోట్ల వ్యయంతో ఒక్కో గ్రామంలో 40 చొప్పున డబుల్ బెడ్రూం ఇళ్ల చొప్పున మొత్తం 120 ఇళ్లను నిర్మించారు. చాలా ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. కొత్త ప్రభుత్వంలోనైనా సొంతింటి కల నెరవేరుతుందని భావించిన పేద ప్రజలకు నిరాశే ఎదురైంది.

News October 18, 2024

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా తెరుచుకున్న డిగ్రీ, పీజీ కాలేజీలు

image

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ TDPMA ఆధ్వర్యంలో ఉమ్మడి KNR జిల్లాలో డిగ్రీ & పీజీ కళాశాలల నిరవధిక బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలపై హామీ ఇవ్వడంతో బంద్ మిరమించారు. దీంతో నాలుగు రోజుల తరువాత శుక్రవారం ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా డిగ్రీ, పీజీ కాలేజీలు తెరుచుకున్నాయి.

News October 18, 2024

కేసీఆర్‌ను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే

image

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆయన పుష్పగుచ్చాన్ని అందజేసి తన జన్మదినం సందర్భంగా ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. కేసీఆర్, ఎమ్మెల్యే సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

News October 18, 2024

KNR: బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

image

బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం చేసిన ఘటన BHPL జిల్లా మహాముత్తారం మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. SI మహేందర్ కుమార్ వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక(12)పై అదే గ్రామానికి చెందిన రామయ్య(71).. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికవద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

News October 18, 2024

రామగుండం: ఈనెల 26 నుంచి యూరియా ఉత్పత్తి ప్రారంభం

image

రామగుండం ఎరువుల కర్మాగారం(RFCL)లో వార్షిక మరమ్మతుల అనంతరం ఈనెల 26 నుంచి యథావిధిగా యూరియా ఉత్పత్తి అవుతుందని అధికారులు తెలిపారు. RFCLలో వివిధ విభాగాల్లో సాధారణ మరమ్మతులు నిర్వహించి యూరియా ఉత్పత్తి చేస్తుంటారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఆరు మాసాలలో 6.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసి లక్ష్యానికి చేరువలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

News October 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ పెగడపల్లి మండలంలో కత్తితో పొడుచుకుని వ్యక్తి ఆత్మహత్య.
@ గోదావరిఖనిలో మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య.
@ ధర్మపురి మండలంలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు.
@ కరీంనగర్ మండలంలో కారు, బైకు డీ.. ఒకరి మృతి.
@ కోరుట్లలో హత్య కేసులో ఐదుగురి అరెస్ట్.
@ సుల్తానాబాద్ మండలంలో దాడికి పాల్పడిన ఇద్దరికి ఏడాదిన్నర జైలు శిక్ష.
@ సిరిసిల్లలో వైభవంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.

News October 17, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.63,569 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.34,600, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.21,760, అన్నదానం రూ.7,209 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.