Karimnagar

News October 16, 2024

KNR: కంప్యూటర్ ట్యాలీపై ఉచిత శిక్షణ దరఖాస్తులకు ఆహ్వానం

image

తిమ్మాపూర్లో గల SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో కంప్యూటర్ ట్యాలీపై ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురుషులు 18 నుంచి 45సం.ల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ శిక్షణ 30 రోజులు ఉంటుందన్నారు.

News October 16, 2024

రామగుండం MLA కుటుంబ సభ్యులతో మంత్రి సీతక్క విందు

image

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు & రామగుండం MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్-మనాలి ఠాకూర్ ఆహ్వానం మేరకు మంత్రి సీతక్క విందు భోజనం చేశారు. HYDలోని MLA నివాసానికి వచ్చిన మంత్రి సీతక్క కాసేపు రాజకీయ పరిణామాలు, అభివృద్ధి గురించి చర్చించారు. అనంతరం MLA కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి సరదాగా విందు భోజనం చేశారు.

News October 16, 2024

కరీంనగర్ అనే పేరు ఎలా వచ్చింది?

image

నేడు కరీంనగర్ అని పిలవబడే పేరు సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా నామకరణం చేయబడింది. పూర్వం ఈ ప్రాంతానికి ‘సబ్బినాడు’ అని పేరు. KNR, శ్రీశైలంలలో దొరికిన, కాకతీయ రాజులు ప్రోల, ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు. కరినగరం.. కరి అనగా ఏనుగు, ఏనుగులు తిరిగే నగరం కావున కరినగరం, క్రమంగా కరీంనగర్‌గా మారింది. మాజీ ప్రధాని పి.వి నరసింహారావు, సుప్రసిద్ధ కవులను తయారు చేసిన గడ్డ ఇది.

News October 16, 2024

జోనల్ పోటీలకు సిద్ధమైన రెస్క్యూ స్టేషన్

image

నేటి నుంచి సింగరేణి జోనల్ లెవెల్ రెస్క్యూ పోటీలు యైటింక్లైన్ లైన్ కాలనీ రెస్క్యూ స్టేషన్‌లో ప్రారంభం కానున్నాయి. ఇందులో రామగుండం ఏరియా-1, 2, 3, ALP, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఎల్లందు, మణుగూరు జట్లు పాల్గొంటాయి. ఈరోజు, రేపు జరిగే ఈ పోటీలకు సంస్థ C&MDబలరాం, ఉన్నతాధికారులు వెంకటేశ్వర రెడ్డి, భూషణ్ ప్రసాద్, ఉమేష్, సావర్కర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.

News October 16, 2024

నేడు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో క్షీర చంద్ర దర్శనం

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో క్షీర చంద్ర దర్శనం నిర్వహించనున్నారు. శ్రీ స్వామివారి ఆలయంలో ఆశ్వీజ శుద్ధ చతుర్దశి ఉపరి పూర్ణిమ బుధవారం జరుగుతుంది. క్షీరచంద్ర దర్శనం సందర్భంగా నిశీపూజ అనంతరం రాత్రి 10:05 ని.ల నుంచి కోజాగరి పూర్ణిమ వ్రతం(మహాలక్ష్మిపూజ-క్షీరచంద్రపూజ) అనంతరం క్షీరచంద్ర దర్శనం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు భీమశంకర్ శర్మ తెలిపారు.

News October 16, 2024

KNR: గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి

image

గుండెపోటుతో చిన్నారి మృతి చెందిన ఘటన BHPL జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల ప్రకారం.. టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి గ్రామానికి చెందిన రాజు, జమున దంపతులు కొడుకు, కూతురుతో కలిసి జమ్మికుంటలో ఉంటున్నారు. చిన్నారి పాఠశాలకు వెళ్లే క్రమంలో కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి HNK తీసుకెళ్లి చూపించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు.

News October 16, 2024

GREAT.. కరీంనగర్: చదువు నేర్పిన బడికే పంతులుగా

image

తాను విద్యా బుద్ధులు నేర్చుకున్న బడిలోనే ఓ వ్యక్తి పంతులుగా చేరాడు. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం జగదేవ్‌పేట గ్రామానికి చెందిన ఎండీ రఫిక్ స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 2007-08లో పదో తరగతి వరకు విద్యనభ్యసించాడు. కాగా, తాజా డీఏస్సీలో కొలువు సాధించి, పోస్టింగ్‌లో తాను చదివిన పాఠశాలలోనే హిందీ పండిట్‌గా చేరనున్నాడు. ఈ సందర్భంగా రఫిక్ తన సంతోషాన్ని ‘Way2News’తో పంచుకున్నాడు.

News October 16, 2024

నేడు కాళేశ్వరంలో కోజా గిరి పౌర్ణమి వేడుకలు

image

కాళేశ్వరంలోని కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం కోజా గిరి పౌర్ణమి సందర్భంగా ఆలయంలో రాత్రి 9 గం.ల నుంచి 11 గం.ల వరకు భజన ఉంటుందని ఈవో తెలిపారు. 11.30 గంటలకు కౌముది పూజ (పాలలో చంద్రుని) దర్శన కార్యక్రమం, అనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహించనునట్లు చెప్పారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

News October 16, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోరుట్లలో యువకుడి దారుణ హత్య. @ గొల్లపల్లి మండలంలో తండ్రిని హత్య చేసిన తనయుడికి జీవిత ఖైదు. @ ఎల్లారెడ్డిపేట మండలంలో కారు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డీఎస్సీ సెలెక్టెడ్ అభ్యర్థులకు పాఠశాలల కేటాయింపు. @ రాయికల్ మండలంలో ఎస్సీ, ఎస్టీ కేసుపై డీఎస్పిీ విచారణ. @ బీజేపీలో చేరిన మెట్ పల్లి వైద్యుడు ముత్యాల వెంకటరెడ్డి.

News October 15, 2024

కరీంనగర్: 1,36,781 విద్యార్థులకు రాగి జావ

image

దసరా సెలవుల అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ అందించారు. సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలో జావ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 1,36,781 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. కాగా పిల్లలకు పోషకాహారం అందించేందుకు అమలు చేస్తున్న పీఎం పోషణ్ కార్యక్రమంలో భాగంగా రాగి జావ అందిస్తున్నారు.