India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.49,303 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.27,846, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.16,050, అన్నదానం రూ.5,407 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలుపై అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకీ చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్గా మంత్రి దామోదర రాజనర్సింహ నియామక మయ్యారు. కమిటీ సభ్యులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలు నియమాకం అయ్యారు.
సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరమగ్గాల పరిశ్రమకు త్వరలో పనులు రానున్నాయి. స్వశక్తి సంఘాల మహిళలకు చీరల కోసం రూ.1.30 కోట్ల చీరల ఆర్డర్లు ఇవ్వబోతున్నట్లు సీఎం ఇటీవల ప్రకటించడంతో నేతన్నల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పాత బకాయిలు కూడా విడుదల అవుతుండటంతో పరిశ్రమకు మంచి రోజులు వస్తున్నాయని నేతన్నలు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామానికి చెందిన స్రవంతి డిగ్రీ చదువుతోంది. కాగా, బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ధర్మపురి ఎస్ఐ మహేశ్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కథలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. భూషణరావుపేటకి చెందిన ఏనుగు సాగర్ రెడ్డికి ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ కాలేదని, ఈ విషయం తోటి రైతులతో చెప్పుకొనే వాడని కుటుంబీకులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మాల్యాల మండలం కొండగట్టులో బుధవారం ఓ మహిళ బాలుడి అపహరణకు యత్నించింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మూడేళ్ల బాలుడు కిరాణా షాపుకు వెళ్లగా గుర్తు తెలియని మహిళ బాలుడిని పట్టుకుని తీసుకెళ్తోంది. దుకాణ యజమాని గమనించి బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని సదరు మహిళను స్థానికులతో కలిసి పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్రాన్ని ఉత్పాదక రంగంలో అగ్రగామిగా నిలిపేలా ‘మేక్ ఇన్ తెలంగాణా’ భావనను పెంపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పారిశ్రామిక రంగానికి పిలుపునిచ్చారు. హైదరబాద్లోని బేగంపేటలో బుధవారం క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా చాప్టర్ 38వ వార్షిక సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఛాప్టర్ ఛైర్మన్ బాలకృష్ణరావు, హన్మంతరావు తదితరులు ప్రసంగించారు.
సెప్టెంబర్ 17న రాష్ట్రంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్లు జాతీయ పతాక ఆవిష్కరణ చేయాలని సీఎస్ శాంతి కుమారీ ఉత్తర్వులు జారీ జారీచేశారు.
హైదరాబాద్ సెక్రటేరియట్లో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. నియోజకవర్గం అభివృద్ధి గురించి కాసేపు చర్చించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, కటుకు ధనుంజయ్, అరగంట కృష్ణ, జనగాం శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.