Karimnagar

News May 12, 2024

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 2,194 పోలింగ్ స్టేషన్లు

image

కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,194 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వీటిలో ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. 17,97,000 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషుల కంటే మహిళలు 40,000 మంది అధికంగా ఉన్నారని వివరించారు. 42 వేల మంది దివ్యాంగులు ఉన్నారని, వయోవృద్ధులు 13200 మంది ఉన్నారని తెలిపారు.

News May 12, 2024

KNR: ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశాం: కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా పోలింగ్ అధికారుల థర్డ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.

News May 11, 2024

ఇల్లంతకుంట మండల విద్యాధికారి సస్పెన్షన్.!

image

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల విద్యాధికారి (FAC ) బన్నాజీని సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జేడి కే.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఇల్లంతకుంట మండల ఎంపీపీ నుంచి బన్నాజీ సన్మానం పొందారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ RJDకి తెలియజేసారు. ఎన్నికల నియమనిబంధనలు బన్నాజీ ఉల్లంఘించడంతో సస్పెండ్ చేసినట్టు RJD తెలిపారు.

News May 11, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కాటారం మండలంలో ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య. @ సుల్తానాబాద్ మండలంలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి. @ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముగిసిన ఎన్నికల ప్రచారం. @ పార్లమెంట్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: కరీంనగర్ సిపి. @ పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కరీంనగర్ కలెక్టర్.

News May 11, 2024

కరీంనగర్: ముగిసిన ప్రచారం.. మొదలైన సైలెంట్ పీరియడ్!

image

ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకు సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఇకపై ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు పార్లమెంట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎన్నికల నియమాలు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠినచర్యలు ఉంటాయని అధికారుల హెచ్చరించారు. సోమవారం ఓటింగ్ ప్రక్రియ మొదలుకానుంది .

News May 11, 2024

కరీంనగర్: 29 ఏళ్లలోపు ఓటర్లు 23.50 శాతం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 29.78 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 14.51 లక్షల మంది పురుషులు, 15.26 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఇందులో 30 ఏళ్ల లోపు యువత 7,00,201 మంది ఉన్నారు. అంటే మొత్తం ఓటర్లలో 23.50 శాతం యువతీ యువకులే. 18-19 ఏళ్లలోపు 82,100 ఓటర్లు ఉన్నారు. 20-29 ఏళ్ల లోపు 6,18,101 ఓటర్లు ఉన్నారు.

News May 11, 2024

పెద్దపల్లి ఎంపీ అభ్యర్థికి నోటీసులు

image

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఘటనలో పెద్దపల్లి BRS MP అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామంలో ఈ నెల 6న పార్టీ కండువాలు ధరించి ప్రచారం చేసినట్లు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని లేదంటే చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేశారు.

News May 11, 2024

సుల్తానాబాద్: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

image

బావిలో పడి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సుల్తానాబాద్‌లో జరిగింది. ఎస్ఐ, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. యాదవ్ నగర్‌కు చెందిన చింతల రాజు(20) గురువారం రాత్రి భోజనం చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శుక్రవారం ఓ వ్యవసాయ బావి వద్ద తన బైక్, చెప్పులు గమనించారు. కొడుకు మృతిపట్ల అనుమానాలు ఉన్నట్లు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 11, 2024

జగిత్యాల: BJP ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కేసు

image

నిజామాబాద్ పార్లమెంట్ BJP అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హిందువులకు ప్రమాదకరంగా  మారాడన్నారు. జగిత్యాల ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అర్వింద్ మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. దీంతో ఎలక్షన్ ఇన్‌ఛార్జ్ విజయేందర్ ఫిర్యాదుతో కేసు చేశామన్నారు.

News May 11, 2024

ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి: కలెక్టర్

image

లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగించాలని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గడువు ముగిసిన తర్వాత రాజకీయ అంశాలకు సంబంధించిన బల్క్ ఎస్ఎంఎస్‌లు పంపడం నిషేధమన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.