India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓటర్లను ప్రభావితం చేసేందుకు బుధవారం రాత్రి హుజూరాబాద్ క్లబ్లో విందు ఏర్పాటు చేయడంపై ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, పర్యాటకాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్, బండ శ్రీనివాస్, క్లబ్ నిర్వాహకుడు రవీందర్ రావు, బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బొల్లం రమేశ్ గురువారం తెలిపారు.
రాజకీయ గురువు చొక్కారావును ఓడించిన జగపతిరావు కొడుకునే వెంటేసుకుని తిరుగుతూ గురువుకే పంగనామాలు పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ అని, తనపై ఆరోపణలు చేయడం విడ్డూరమని బండి సంజయ్ ఆరోపించారు. తనపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని వ్యక్తి పొన్నం అన్నారు. అలాంటి వ్యక్తి వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గు చేటన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు బాధితుల పోరాటంలో తాను పాల్గొని బాధితులకు అండగా నిలిచానన్నారు.
మోసపూరిత హామీలను ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ సీఎం KCR అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం లేదని, రైతు రుణమాఫీ చేయలేదని, మహిళలకు పెంచిన పెన్షన్లు ఇవ్వడం లేదని అన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయట్లేమని ఫైర్ అయ్యారు.
కరీంనగర్ గడ్డ ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన ఉద్యమాల గడ్డ అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తాలో రోడ్ షోలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి నాంది వేసిందే కరీంనగర్ అని తెలిపారు. కరీంనగర్ ప్రజలు తనను కడుపులో పెట్టి చూసుకున్నారని.. కరీంనగర్ లేకుంటే తెలంగాణ ఉద్యమానికి ఉనికి లేదని తెలిపారు. కరీంనగర్ అంటే తనకు ఎంతో ప్రేమ అని కేసీఆర్ చెప్పారు.
*ఎల్లారెడ్డిపేట మండలంలో చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి.
*మహాముత్తారం మండలంలో కారు బోల్తా పడి కాంగ్రెస్ నాయకురాలు మృతి.
*మెట్పల్లి మండలంలో అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత.
*కరీంనగర్లో రోడ్ షోలో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్.
*రేపు కమలాపూర్కు కేటీఆర్, సిరిసిల్లకు కేసీఆర్.
*పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు: జగిత్యాల కలెక్టర్.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మాజీ సీఎం కేసీఆర్ ఛలోక్తులు విసిరారు. కరీంనగర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ మాట్లాడే భాష ఏ భాషనో కూడా మనకు అర్థం కాదని అన్నారు. పార్లమెంటులో ఎప్పుడైనా బండి సంజయ్ మాట్లాడారా? అని ప్రశ్నించారు. మళ్లీ అలాంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపడం అవసరమా? అని కరీంనగర్ ప్రజలను ప్రశ్నిస్తున్నామన్నారు.
పాకిస్తాన్ను బూచిగా చూపి పదేళ్లుగా బీజేపీ రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ చిన్న దేశం.. ఒక్క జాఫట్ కొడితే 25 ఏళ్లు వాడు మన తెరువు రాడు అని అన్నారు. పాకిస్తాన్, పుల్వామా, మత రాజకీయం తప్పితే బీజేపీ చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు.
కారు బోల్తా పడి కాంగ్రెస్ నాయకురాలు మృతి చెందిన ఘటన BHPL జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం నిమ్మగూడెం వద్ద కారు బోల్తా పడి మహాముత్తారం మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు జాడి కీర్తిబాయి మృతి చెందింది. ఆమె భర్త రాజయ్యకు తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం సిరిసిల్లలో పర్యటించనున్నట్లు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు. సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోడ్ షోలో పాల్గొంటారని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలకిషన్ అనే వ్యక్తి గురువారం ఉదయం చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.