Karimnagar

News May 6, 2024

వేములవాడ రాజన్న సన్నిధికి ప్రధాని మోదీ

image

వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 8న రానున్నారు.ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ కూడా ఖరారయ్యింది. ప్రధాని రాక సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ చరిత్రలో ఓ విశేషమేమంటే.. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గతంలో శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలిలోని ధర్మకర్తలలో ఒకరుగా ఉన్నారు.

News May 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ శంకరపట్నం మండలంలో మామిడి చెట్టు పైనుండి పడి వ్యక్తి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో చెరువులో పడి యువకుడి మృతి. @ సుల్తానాబాద్ మండలంలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకుల విస్తృత ప్రచారం. @ జగిత్యాలలో రోడ్ షోలో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్. @ కాటారం మండలంలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు. @ హుస్నాబాద్: వడదెబ్బతో ఉపాధ్యాయుడి మృతి.

News May 5, 2024

గోదావరిఖని: ఉరేసుకుని సింగరేణి కార్మికుడి ఆత్మహత్య

image

గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన బొడ్డుపల్లి నరేష్ (38) సింగరేణి కార్మికుడు ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వన్ టౌన్ SIశ్రీనివాస్ తెలిపారు. గత కొంత కాలం నుంచి నరేష్ మానసిక స్థితి బాగాలేక విధులకు హాజరుకావడం లేదన్నారు. ఇంటిలో ఉన్న వస్తువులు అన్ని పగలగొట్టి కుటుంబసభ్యులతో గొడవ పడినట్లు తెలిపారు. ఇదే క్రమంలో పైకప్పు సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నట్లు SIతెలిపారు.

News May 5, 2024

వెల్గటూర్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఆదివారం అత్యధికంగా జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ లో 47.1°C, ఇబ్రహీంపట్నం మండలం గోదూరులో లో 46.8°C, రాయికల్ మండలం అల్లీపూర్ లో 46.7°C, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.7°C , జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో 46.1°C, బీర్పూర్ మండలం కొల్వైలో 46.0°C, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.9°C, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన లో 45.8°C ఉష్ణోగ్రత నమోదైంది.

News May 5, 2024

HSBD: వడదెబ్బతో ఉపాధ్యాయుడి మృతి

image

ఎలక్షన్‌ ట్రైనింగ్‌‌లో వడదెబ్బ తగిలి లకావత్‌ రామన్న (45) అనే ఉపాధ్యాయుడు మృతి చెందాడు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రామన్న హుస్నాబాద్ నుంచి గజ్వేల్‌కు ఎలక్షన్‌ విధులకు వెళ్లాడు. శిక్షణ సమయంలో వడదెబ్బ తగిలింది. డ్యూటీలో సిబ్బంది గజ్వేల్‌ PHCలో అడ్మిట్‌ చేశారు. ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి వచ్చాడు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌ MGMకు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడని స్థానిక టీచర్లు తెలిపారు.

News May 5, 2024

జమ్మికుంట: గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆదర్శకాలనీలో మందకుమార్ ఇంటి వెనుక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇతను రైల్వే స్టేషన్లో, రైల్వే ట్రాక్ వెంబడి కాలి ప్లాస్టిక్ సీసాలు ఏరుకుంటూ జీవిస్తుంటాడని సమాచారం. ఇతడి స్వగ్రామం, కుటుంబసభ్యుల వివరాలు తెలిసినవారు జమ్మికుంట సీఐ ( 8712670776), జమ్మికుంట ఎస్ఐ (8712574759) నంబర్లకు సమాచారం అందించాలని జమ్మికుంట సీఐ వరంగంటి రవి తెలిపారు.

News May 5, 2024

పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

image

పెద్దపల్లి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుల్తానాబాద్ మండలం రేగటి మద్దికుంటలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 5, 2024

KNR: మామిడి చెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతి

image

మామిడి చెట్టు పై నుంచి కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన శంకరపట్నం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. కన్నాపూర్ గ్రామానికి చెందిన నాంపల్లి ఎల్లయ్య ఇంటి ఆవరణంలోని మామిడి చెట్లు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని భార్య కొమురమ్మ తెలిపారు.

News May 5, 2024

KNR: భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య

image

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల పురాణిపేటలో జరిగింది. బింగి నవీన్ గోదావరికి చెందిన జ్యోత్స్నతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో భార్య పుట్టింటికి వెళ్ళింది. భార్య కాపురానికి రానని చెప్పడంతో దీంతో మనస్తాపానికి గురైన శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు.

News May 5, 2024

కరీంనగర్: కాంగ్రెస్ పార్టీలోకి బొమ్మ శ్రీరాంచక్రవర్తి!

image

కరీంనగర్ లోక్ సభ పరిధిలోని హుస్నాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల్లో BJP అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మ శ్రీరాంచక్రవర్తి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 3 రోజుల క్రితం మంత్రి పొన్నం, కాంగ్రెస్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావు శ్రీరాంచక్రవర్తితో మంతనాలు జరిపినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీలో చేర్పించేందుకు మంత్రి ప్రభాకర్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిసింది.