Karimnagar

News May 5, 2024

నేడు జిల్లాకు గులాబీ బాస్

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేడు జిల్లాకు రానున్నారు. సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు షో నిర్వహించనున్నారు. నిజామాబాద్ లోక్ సభ బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తరఫున ప్రచారం నిర్వహిస్తారు.

News May 5, 2024

KNR: వివాహిత ఆత్మహత్య

image

వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మత్తారం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పారుపల్లికి చెందిన జెల్ల రాజేశ్వరి(25) కడుపు నొప్పితో భాదపడుతుంది. ఆస్పత్రుల్లో చూపించుకొని, మందులు వాడినా నయం కాలేదు.  దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. భర్త సురేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

News May 5, 2024

మండుతున్న భానుడు.. వీణవంక @46.5℃

image

కరీంనగర్ జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. శనివారం జిల్లాలోనే అత్యధికంగా వీణవంక మండల కేంద్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.5 డిగ్రీలుగా నమోదైంది. గత 3,4 రోజులుగా ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి ప్రతాపంతో ఇల్లు దాటి కాలు బయట పెట్టేందుకు జంకుతున్నారు. బయటికెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News May 5, 2024

కరీంనగర్: వీవీ ప్యాట్స్‌లో జాగ్రత్తగా సింబల్ లోడింగ్ చేపట్టాలి: కలెక్టర్

image

వీవీ ప్యాట్స్‌లో జాగ్రత్తగా సింబల్ లోడింగ్ చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి సిబ్బందిని ఆదేశించారు. శనివారం హుజూరాబాద్‌లోని జూనియర్ కళాశాలలో వీవీ ప్యాట్స్‌లో సింబల్ లోడింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాగ్రత్తలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, తేడాలు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు.

News May 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ తంగళ్ళపల్లి మండలంలో ఉపాధి హామీ కూలి మృతి. @ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్ దివాకర. @ వడదెబ్బతో వెల్గటూర్ మండల విద్యాధికారి మృతి. @ బీర్పూర్ మండలంలో వడదెబ్బతో రైతు మృతి. @ పెద్దపల్లి జిల్లాలో ప్రచారం నిర్వహించిన కేసీఆర్. @ బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆరుగురు జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు.

News May 4, 2024

జగిత్యాల: బీఆర్ఎస్‌కు ఆరుగురు కౌన్సిలర్లు రాజీనామా

image

జగిత్యాల మున్సిపాలిటీలోని బీఆర్ఎస్‌కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్నారు. రేణుక (7వ వార్డు కౌన్సిలర్), పద్మ (17వ వార్డు), భారతి (10వ వార్డు), రజిని (33వ వార్డు), లావణ్య (38వ వార్డు), గంగాసాగర్ (21వ వార్డు) రిజైన్ చేశారు. అయితే జగిత్యాలలో కేసీఆర్ రోడ్‌షో నిర్వహించనున్న నేపథ్యంలో వారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

News May 4, 2024

JGTL: రాష్ట్రంలోనే రెండో స్థానం నేరెళ్ల

image

ఎండాకాలం నేపథ్యంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో జగిత్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధర్మపురి మండలం నేరెళ్లలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకే 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నేరెళ్ల రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలు నేడు రెడ్‌జోన్లో కొనసాగుతున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News May 4, 2024

బీర్పూర్: వడదెబ్బతో రైతు మృతి

image

బీర్‌పూర్ మండలంలోని మంగేలా గోండుగూడెమునకు చెందిన కొమురం సోము (58) అనే రైతు శనివారం వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం నువ్వు పంట కోయడానికి తన వ్యవసాయ భూమికి వెళ్లిన ఆయన తిరిగి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నారు. నీరసంగా ఉందని పడుకోగా.. ఇంతలోనే భార్య నీళ్లు తాగమని లేపే సరికి అప్పటికి చనిపోయి ఉన్నాడని తెలిపారు. అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.

News May 4, 2024

KNR: ఈ సారైనా పోలింగ్ శాతం పెరిగేనా?

image

ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలపై చూపినంత ఆసక్తి లోక్‌సభ ఎన్నికలపై చూపడం లేదు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరుగుతున్నా పోలింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో 74.71 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019 ఎన్నికల నాటికి అది కాస్తా 69.52 శాతంకు తగ్గింది. ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్యను మరింత పెంచాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.

News May 4, 2024

వడదెబ్బతో వెల్గటూర్ ఎంఈఓ మృతి

image

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల విద్యాధికారి బత్తుల భూమన్న మృతి చెందారు. వడదెబ్బతో శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంఈఓ మృతి పట్ల మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.