India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
*జగిత్యాలలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్.
*మెట్పల్లిలో రూ.1,70,000 నగదు సీజ్.
*చత్తీస్గడ్ ఎన్కౌంటర్లో భీమదేవరపల్లి మండల వాసి మృతి.
*మెట్పల్లిలో కోర్టుకు హాజరు కాకుండా తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్.
*ఎన్నికల భద్రత ఏర్పాట్లపై రామగుండం సీపీ సమీక్ష.
*బీఆర్ఎస్కు రాజీనామా చేసిన బుగ్గారం ఎంపీపీ, జడ్పీటీసీ.
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకుల విస్తృత ప్రచారం.
కరీంనగర్ నగరంలోని మంచిర్యాల చౌరస్తా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ను బండి సంజయ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మనమే నంబర్ వన్. బ్యాలెట్ పేపర్లో కూడా 1వ స్థానం మనదే అన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఎండలను లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ, ఊరూవాడా కదిలి వచ్చి బ్యాలెట్ పేపర్లోని 1వ నంబర్ పక్కనున్న పార్టీ గుర్తుపై బటన్ నొక్కి ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి గురువారం రూ.99,343 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టికెట్ల ద్వారా రూ.54,792, ప్రసాదాల ద్వారా రూ.28,760, రూ.15,791 విరాళం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన గీట్ల ప్రతాప్ రెడ్డి(102) అనే పోలీసు పటేల్ అనారోగ్యంతో మరణించారు. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. HYD-LV ప్రసాద్ ఐ ఆసుపత్రి టెక్నీషియన్ రాజన్న ఆధ్వర్యంలో మృతుడి నేత్రాలను సేకరించారు. కుటుంబ సభ్యులు దామోదర్ రెడ్డి, సుగుణ, నరోత్తం రెడ్డి, పుష్ప, రామకృష్ణారెడ్డి, పద్మ, సుజాత, రాం రెడ్డి, పుష్పా, కృష్ణారెడ్డి, నిర్మల ఉన్నారు.
ఛత్తీస్ ఘడ్లోని అబుజ్ మాడ్లో జరిగిన ఎన్ కౌంటర్లో భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన కాశవేణి రవి ఆలియాస్ వినయ్ మృతి చెందాడు. కాగా, 33 ఏళ్ల క్రితం తన తండ్రి ఉపాధి నిమిత్తం మంచిర్యాలలో ఉండగా.. మావోయిస్టుల్లో చేరిన అనంతరం రవి డీసీఎం స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో ఎన్ కౌంటర్లో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మాజీ CM- KCRరేపు రాత్రి 8 గంటల తర్వాత గోదావరిఖని చౌరస్తాలో జరిగే రోడ్డు షోలో పాల్గొంటారని BRSపార్టీ MPఅభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గోదావరిఖని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో BRSకు వస్తున్న ఆదరణ ఓర్వలేక రోడ్డు షో ను ఆపేందుకు అధికార పార్టీ పాలకులు దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మాజీ MLAకోరుకంటి చందర్ ఉన్నారు.
బుగ్గారం మండల MPP, ZPTC బాదినేని రాజమణి, రాజేందర్ గురువారం BRSకు రాజీనామా చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో కీలకనేతగా గుర్తింపు పొందిన రాజేందర్ రాజీనామా చేయడంతో హాట్ టాపిక్గా మారింది. ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ పిలుపు మేరకు అన్నికార్యక్రమాలు చేపట్టిన కూడా తమను అణచివేతకు గురిచేసి, చిన్నచూపు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాజీనామా చేసినట్టు వివరించారు.
రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని.. అందుకే గాడిద గుడ్డులో కూడా మోదీ కన్పిస్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రచారంలో భాగంగా సీఎం ఒక గుడ్డు పెట్టుకుని ప్రధాని గాడిద గుడ్డు ఇచ్చారని మాట్లాడుతున్నారన్నారు. పేదలకు రూ.2500 ఇస్తా అని మోసం చేశారని, రూ.4వేల పింఛన్ , తులం బంగారం ఇస్తా అని మోసం చేసిన కాంగ్రెస్ తెలంగాణలో గాడిద గుడ్డుతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఈసీ 48 గంటల నిషేధాన్ని విధించింది. దీంతో గురు, శుక్రవారాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగాల్సిన బస్సుయాత్ర రద్దైంది. గురువారం సాయంత్రం జమ్మికుంటలో రోడ్షోలో పాల్గొని వీణవంకల బస చేయాల్సి ఉంది. ఈనెల 3న రామగుండంలో బస్సుయాత్ర చేసి అక్కడే బస చేయాల్సి ఉంది. మారిన షెడ్యూల్ ప్రకారం రామగుండంలో బస మాత్రమే చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గొప్ప అనుకునే ఈరోజుల్లో ఓ యువకుడు అద్భుతం సృష్టించాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్కు చెందిన బెత్తపు సంజయ్ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యాడు. 2022లో రైల్వే ఉద్యోగం సాధించాడు. 2023లో ఎక్సైజ్ కానిస్టేబుల్ఉద్యోగం, టౌన్ప్లానింగ్ బిల్డింగ్ అధికారి, గ్రూప్-4, ఏఈఈ, ఏఈ పోస్టులకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం కానిస్టేబుల్ శిక్షణలో ఉన్న సంజయ్ ఏఈ ఉద్యోగంలో చేరుతానన్నారు.
Sorry, no posts matched your criteria.