Karimnagar

News August 26, 2024

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: ఎస్పీ

image

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ అన్నారు. నేడు మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో 40 సీసీ కెమెరాలను స్థానిక ప్రజలతో కలసి ఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన అన్నారు.

News August 26, 2024

కరీంనగర్: 118 కిలోల గంజాయి స్వాధీనం

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గంజాయి మత్తు చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ క్రమంలో గంజాయి, డ్రగ్స్ కట్టడికి కమిషనరేట్ పోలీసులు నడుం బిగించారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కేసులు పెడుతూ, మూలాలను కట్టడి చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 22 కేసుల్లో 44 మందిని అరెస్టు చేశారు. రూ.35 లక్షల విలువ చేసే 118 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News August 26, 2024

కరీంనగర్: 118 కిలోల గంజాయి స్వాధీనం

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గంజాయి మత్తు చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ క్రమంలో గంజాయి, డ్రగ్స్ కట్టడికి కమిషనరేట్ పోలీసులు నడుం బిగించారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కేసులు పెడుతూ, మూలలను కట్టడి చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 22 కేసుల్లో 44 మందిని అరెస్టు చేశారు. రూ.35 లక్షల విలువ చేసే 118 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News August 26, 2024

సిరిసిల్ల: ఈసారి సాధారణ వర్షపాతమే!

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ వర్షాకాలంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 576.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 2023-24 సంవత్సరంలో 719.5 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు అయింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం 7 మండలాల్లో ఉంది. 60 శాతంగా నమోదైన మండలాలు 6 ఉన్నాయి.

News August 26, 2024

పెద్దపల్లి: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూపులు!

image

పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తామని ఊరించినప్పటికి, జిల్లాలో కనీసం 1000 మంది లబ్ధిదారులకు ఇళ్లు కట్టించలేదు. అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించి 8 మాసాలు గడవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. కాగా జిల్లా వ్యాప్తంగా 1,85,404 దరఖాస్తుల వచ్చాయి. మొదటి విడతలో జిల్లాకు 10,500 ఇళ్లను కేటాయించారు.

News August 26, 2024

కరీంనగర్: పరిహారం కోసం రైతుల ఎదురుచూపులు

image

జగిత్యాల-వరంగల్ ఎన్‌హెచ్ 563 రహదారి నిర్మాణంలో భాగంగా భూసేకరణ చేసిన అధికారులు రైతులకు నష్టపరిహారం ఇంకా అందించలేదు. గత రెండు సంవత్సరాల క్రితం రహదారి పనులు ప్రారంభం కాగా భూ సేకరణ చేసిన అధికారులు రైతుల ఖాతాలోకి జమ కాలేదు. కొందరి బావులు ఈ రహదారి కింద పోతుండగా ఆందోళన చెందుతున్నారు. నష్టపరిహారం చెల్లిస్తే ముందస్తుగా మళ్లీ బావులను తవ్వుకుంటామని, వెంటనే నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

News August 26, 2024

అంజన్న భక్తులకు భారం కానున్న పార్కింగ్

image

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థాన కొండపైన వాహనాల పార్కింగ్ రుసుము వసూలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. బస్సు, లారీ రూ.50, కారు, జీపు రూ.40, ఆటోకు రూ.30, బైక్‌ రూ.10 వాహన రుసుముగా అధికారులు నిర్ణయించారు. పార్కింగ్‌కు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలపకుండానే పార్కింగ్ రుసుము ప్రవేశ పెట్టడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

News August 26, 2024

జిల్లాలో పీఎం మాన్-ధన్ యోజనకు ఆదరణ కరువు

image

కరీంనగర్: ప్రధానమంత్రి కిసాన్ మాన్-ధన్ యోజనకు కరీంనగర్ జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అన్నదాతలకు వృద్ధాప్యంలో సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో దాదాపు 60 వేల మంది రైతులు అర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు వెయ్యి మంది మాత్రమే ఇందులో చేరారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించ కపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

News August 26, 2024

పెద్దపల్లి: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం

image

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దంపేటకి చెందిన పోలు దాసరి సౌమ్య, ప్రియుడు జక్కుల శివకుమార్ యాదవ్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీరా పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా చేపట్టింది. దీంతో ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఘటనా స్థలానికి పోలీసులు చేచేరుకొని తగు న్యాయం చేస్తామని బాధితురాలికి నచ్చజెప్పారు.

News August 26, 2024

కరీంనగర్: సర్పంచ్ ఎన్నికలు.. వారొస్తున్నారు

image

కరీంనగర్ జిల్లాలో యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.