Karimnagar

News April 24, 2024

కోరుట్ల: వాకింగ్‌కు వెళ్తే గోల్డ్ చైన్ లాగేశారు

image

కోరుట్ల పట్టణంలో గొలుసు దొంగలు బరితెగించారు. ముఖానికి ముసుగు వేసుకున్న దుండగులు పట్టణంలోని వెంకట సాయి నగర్ కాలనీకి చెందిన ఓ వృద్ధురాలు కాలనీలో సోమవారం సాయంత్రం వాకింగ్ చేస్తుండగా మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. వృద్ధురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.

News April 24, 2024

KNR: గొంతు కోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

image

అనారోగ్యం బాధతో ఓ మహిళ గొంతు కోసుకున్న ఘటన వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. పొట్ల సుజాత(38) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది. సోమవారం మధ్యహ్నం తీవ్ర మనస్తాపానికి గురై గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

News April 24, 2024

కరీంనగర్ కాంగ్రెస్ MP అభ్యర్థిగా రాజేందర్ నామినేషన్

image

కరీంనగర్ కాంగ్రెస్ MP అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు సోమవారం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం సహా పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి నామినేషన్ వేశారు.

News April 22, 2024

కరీంనగర్: జోరు ప్రచారాలు.. విజయం ఎవరిని వరిస్తుందో?

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఓ వైపు నామినేషన్లు.. మరో వైపు ప్రచారాలు జోరు అందుకుంటున్నాయి. BJP బైక్ ర్యాలీలు చేస్తూ, BRS నాయకులు ప్రజల్లోకి వెళ్తూ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. వినూత్న రితీలో ప్రచారాలు చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీల ప్రచారాలు జోరు అందుకున్నాయి. విజయం ఏ పార్టీని వరిస్తుందో చూడాలి.

News April 22, 2024

కరీంనగర్: గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి

image

గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. మృతుడి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి నుంచి సిద్దిపేటకు వెళుతున్న ఖలీల్ కల్లూరు సమీపంలోని హోటల్ వద్ద భోజనానికి ఆపారు. భోజనం అనంతరం తిరిగి లారీ ఎక్కుతుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈయన RTC డ్రైవర్‌గా జగిత్యాల డిపోలో పనిచేసి 2014లో ఉద్యగ విరమణ చేశారు.

News April 22, 2024

పెద్దపల్లి: పురుగు మందు తాగి మహిళ సూసైడ్

image

పురుగు మందు తాగి మహిళ సూసైడ్ చేసుకుంది. SI వివరాల ప్రకారం.. పెద్దపల్లి మండలం సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన మల్లమ్మ అదే గ్రామానికి చెందిన సంపత్ దగ్గర రూ.1.30లక్షలు అప్పు తీసుకుంది. దీంతో అప్పు చెల్లించాలంటూ సంపత్ శనివారం గొడవకు దిగడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కేసు నమోదైంది.

News April 22, 2024

కరీంనగర్ అభివృద్ధికి మీరేం చేశారో చెప్పండి: ఎంపీ అభ్యర్థి

image

కరీంనగర్ అభివృద్ధికి ప్రస్తుత ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ ఆరోపించారు. బియినపల్లిలె ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 2014-19లో ఆయన తాను ఎంపీగా ఉన్నప్పుడు కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ తెచ్చినట్లు పేర్కొన్నారు. వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ తీసుకొచ్చానన్నారు. బండి సంజయ్ కులం, మతం పేరు చెప్పి రాజకీయ్ చేస్తున్నారని విమర్శించారు.

News April 22, 2024

కొండగట్టులో నేటి నుంచి హనుమాన్ జయంతి వేడుకలు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులపాటు జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల ఏర్పాట్లను ఆదివారం అడిషనల్ కలెక్టర్ దివాకర పరిశీలించారు. తాగునీటి వసతి ఏర్పాట్లు, కోనేరు, కళ్యాణకట్ట, ఆలయ పరిసరాలను తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.

News April 21, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్ పల్లి పట్టణంలో కుక్కను కాపాడబోయి మహిళ మృతి. @ కోరుట్ల మండలంలో 18 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కొండగట్టులో ఏర్పాట్లను పరిశీలించిన జగిత్యాల అడిషనల్ కలెక్టర్. @ హనుమాన్ జయంతికి ముస్తాబైన కొండగట్టు అంజన్న ఆలయం. @ మహదేవ్పూర్ మండలంలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు. @ అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హుజురాబాద్ వాసి.

News April 21, 2024

బండి సంజయ్ బడి తేలేదు.. గుడి తేలేదు: వినోద్

image

బండి సంజయ్ ఐదేళ్లు MPగా ఉండి బడి తేలేదు.. గుడి తేలేదని BRS MP అభ్యర్థి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం కొత్తపల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ MPగా బండి సంజయ్ చేసిన నియోజకవర్గ అభివృద్ధి మాట దేవుడెరుగు… ఆలయాల అభివృద్ధి కోసం రూ.5 కూడా తేలేదన్నారు. బండి సంజయ్ 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరయ్యారా ..? అని ప్రశ్నించారు.