Karimnagar

News April 20, 2024

కరీంనగర్: గెజిటెడ్ హెడ్మాస్టర్ సస్పెన్షన్!

image

తిమ్మాపూర్ మండలం LMD-ZP ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పి.రాజభాను చంద్రప్రకాశ్‌ను శనివారం సస్పెండ్ చేస్తూ వరంగల్ RJD సత్యనారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. స్కూల్ కాంప్లెక్స్‌లో ఉపాధ్యాయుల జీతాల రికవరీ పేరిట నిధులు గోల్‌మాల్, లీవుల్లో ఉన్న టీచర్లకు శాలరీ బిల్లు దాదాపు రూ.10లక్షల వరకు ట్రెజరీలో చెల్లించకుండా స్వాహా చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేశామని తెలిపారు.

News April 20, 2024

RGM: వేధింపులు భరించలేక యువకుడి ఆత్మహత్య

image

గోదావరిఖని విద్యానగర్‌కు చెందిన విజయవర్ధన్ లోన్‌యాప్‌ల వేధింపులు భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు 1టౌన్ పోలీసులు తెలిపారు. గత కొంతకాలం నుంచి వివిధ లోన్‌యాప్‌ల ద్వారా కొంత నగదు తీసుకొని తిరిగి చెల్లించే విషయంలో జాప్యం జరిగింది. దీంతో యాప్‌లకు సంబంధించిన వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

News April 20, 2024

ఆలోచన, అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట: సిరిసిల్ల ఎస్పీ

image

అప్రమత్తత, ఆలోచన, అవగాహనలతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ప్రకటన విడుదల చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతోనే ప్రజలు మోసపోతున్నారని ఆయన స్పష్టం చేశారు. తమ మొబైల్ ఫోన్లకు వచ్చే తెలియని మెసేజులు, లింకులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News April 20, 2024

ధర్మపురి అర్వింద్‌కు రూ.109.90 కోట్ల ఆస్తులు

image

NZB బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు రూ.109.90 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆయనపై 22 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. అర్వింద్‌ ఒక్కరే సొంతంగా రూ.45.25 కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చారు. ఆయన సతీమణి వద్ద 85 తులాల బంగారు ఆభరణాలున్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.60.08 కోట్లు. ఎలాంటి భూముల్లేవు. జూబ్లీహిల్స్‌లోని వాణిజ్య, నివాస భవనాల విలువ రూ.49.81 కోట్లు. మొత్తం అప్పులు రూ.30.66 కోట్లుగా ఉన్నాయి.

News April 20, 2024

గడ్డం వంశీకృష్ణ ఆస్తి రూ.24.09 కోట్లు

image

పెద్దపల్లి లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పూర్తి వివరాలతో అఫిడవిట్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. రూ.24.09 కోట్ల ఆస్తులున్నాయని వివరించారు. నగదు, డిపాజిట్ల రూపంలో రూ.93.27 లక్షలు, వివిధ కంపెనీల్లో షేర్ల రూపంలో రూ.11.39 కోట్లు ఉన్నాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 4.18 ఎకరాలు, సంబల్‌పుర్‌(ఒడిశా)లో 10.09 ఎకరాల భూమి, అప్పులు రూ.17.76 లక్షలు ఉన్నాయని వెల్లడించారు.

News April 20, 2024

బండి సంజయ్‌పై 41 క్రిమినల్ కేసులు

image

కరీంనగర్ లోక్‌సభ స్థానం BJP అభ్యర్థి బండి సంజయ్ పూర్తి వివరాలతో అఫిడవిట్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. తనకు సొంతిల్లు, గుంట భూమి కూడా లేదని, మొత్తం 41 క్రిమినల్‌ కేసులున్నాయని వెల్లడించారు. కుటుంబ ఆస్తుల విలువ రూ.1.12 కోట్లు అని, స్థిరాస్తులు లేకున్నా 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాహనాల కోసం తీసుకున్న అప్పులు రూ.13.4 లక్షలు ఉన్నాయన్నారు.

News April 20, 2024

జగిత్యాల: పిడుగు పడి కూలికి తీవ్ర గాయాలు

image

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూరులో శుక్రవారం పిడుగు పడి కూలికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఆత్మ నగర్‌కు చెందిన వ్యవసాయ కూలి కోరుట్ల రమేశ్ పొలం పనులకు వెళ్లి ఇంటికి వస్తున్నారు. ఈక్రమంలో ఈదురు గాలులు, ఉరుములతో వర్షం రావడంతో ఓ చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో చెట్టుపై ఓవైపు పిడుగు పడటంతో అక్కడే ఉన్న రమేశ్ ఎడమ చేయి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News April 20, 2024

కరీంనగర్ లోక్‌సభ స్థానం..@ 5 జిల్లాలు!

image

కరీంనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. జిల్లాల పునర్విభజనతో ఈ MP స్థానం 5 జిల్లాలకు విస్తరించింది. కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, హనుమకొండ జిల్లాల పరిధిలోని మండలాలు ఈ లోక్‌సభ స్థానంలో ఉన్నాయి. గతంలో పార్టీలపరంగా ఒకే జిల్లా అధ్యక్షుడు ఉండేవారు. ప్రస్తుతం అయిదుగురు ఉండటంతో వారందరినీ సమన్వయం చేసుకోవాల్సి ఉంది.

News April 20, 2024

KNR: పాలిసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2024 – 25 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి TS – పాలిసెట్ 2024 కోసం రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణా బోర్డ్ ప్రకటన విడుదల చేసిందని పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి పూర్తి అయిన విద్యార్థులు ఈ నెల 22 వరకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మే 24న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

News April 19, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఈవీఎం, వివి ప్యాట్ల తరలింపును పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్
@ మేడిపల్లి మండలంలో వాటర్ హౌస్ లో పడి బాలుడు మృతి
@ ఎల్లారెడ్డిపేట మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
@ ఓదెల మండలంలో బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య
@ పెగడపల్లి మండలంలో 5 అక్రమ ఇసుక రావణ ట్రాక్టర్ల పట్టివేత
@ ఓటు హక్కు వినియోగం పై అవగాహన కల్పించాలన్న జగిత్యాల కలెక్టర్
@ జగిత్యాల రూరల్ మండలంలో రైలు పట్టాలపై బాలిక మృతదేహం లభ్యం