India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఫార్ములా ఈ కార్ రేస్పై అసెంబ్లీలో చర్చ జరపాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఈరోజు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళితే తప్పు పట్టిన కేటీఆర్.. ఇప్పుడు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారని, తన సమస్యను రాష్ట్ర సమస్యగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, కేటీఆర్కు నిజాయితీ లేదని విమర్శించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక యాప్ ద్వారా కొనసాగుతోంది. అయితే 3 రోజుల నుంచి ఈ యాప్ సరిగా పనిచేయడం లేదు. దరఖాస్తుదారులకు సొంత స్థలం ఉంటే ఆ స్థలంలో లబ్ధిదారులు నిలబెట్టి ఫొటో తీసి అప్లోడ్ చేసే ప్రక్రియలో ఎక్కువ సమయం తీసుకుంటుంది. యాప్లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అందువల్లే సర్వర్ డౌన్ అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల అటవీ ప్రాంతంలో ఓ యువకుడి మృతదేహం కనిపించినట్లు వదంతులు వ్యాపించాయి. ఈ మేరకు గురువారం రాత్రి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ను సంప్రదించగా.. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఫార్ములా- ఈ రేసింగ్లో తాను ఏ తప్పు చేయలేదని KTR అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు. కేవలం హైదరాబాద్, తెలంగాణ ఇమేజ్ను పెంచేందుకే రేసింగ్ నిర్వహించామని స్పష్టం చేశారు. EVని నగరానికి రప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో కుంభకోణం ఏమీ లేదన్నారు. పైగా HYDకు రూ. వందల కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. GHMCకి ప్రచారం, ఆదాయం సమకూరినట్లు KTR వెల్లడించారు. మీ కామెంట్?

☛SRCL: కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు☛CHMD: బోయిన్పల్లి లో వాహనం ఢీకొని చిన్నారి మృతి ☛శంకరపట్నం: ఆటో ట్రాలీ, లారీ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు ☛JGL: జగిత్యాల సబ్ జైల్లో గుండెపోటుతో ఖైదీ మృతి ☛కథలాపూర్: బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.1.59 లక్షలు మాయం☛మేడిపల్లి: స్వచ్ఛంద సంస్థ పేరుతో మోసం.. వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు

@ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు పాముకాటు
@ పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్
@ జగిత్యాల సబ్ జైలులో గుండెపోటుతో ఖైదీ మృతి
@ చిగురు మామిడి మండలంలో విద్యుత్ షాక్ తో గేదె మృతి
@ జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ను మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు సరెండర్ చేసిన కలెక్టర్
@ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్

శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో భాగంగా కొండ చుట్టూ చదును చేయడానికి ఆలయం వద్ద గతనెల 27న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ దారి నిర్మాణం దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది.10 రోజుల్లోనే 2 కి.మీలు కొండచుట్టూ భక్తులు నడిచేందుకు వీలుగా దారి చేశారు. దారి నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సొంతంగా రూ.2 లక్షలు అందజేసిన విషయం తెలిసిందే.

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.78,215 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.39,432, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.28,170, అన్నదానం రూ.10,613 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

రామగుండం సర్కిల్ ఆఫీస్, పోలీస్ స్టేషన్లలో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ IPS(IG) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. సీపీ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. రిసెప్షన్ సిబ్బంది, కేసుల నమోదులు, రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చేవారితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు.

మహిళలు, విద్యార్థినుల భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్న నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సోల్జర్ గా ఉంటూ జిల్లాలో గంజాయి లాంటి మత్తు పదార్థాలను తరిమి కొట్టాలని ఎస్పీ అఖిల్ మహజన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులని చైతన్య పర్చే ఉద్దేశంతో ముస్తాబద్ మండలంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులకు రక్షణ, షీ టీమ్స్, ఈవ్ టీజింగ్, పోక్సోపై అవగాహన కల్పించారు.
Sorry, no posts matched your criteria.