Karimnagar

News April 19, 2024

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

image

ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అప్పుల బాధతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నేతేట్ల మల్లయ్య(48) అనే వ్యక్తి కుటుంబ పోషణకై అప్పులు చేశాడు. అప్పుల భారం పెరగడంతో గురువారం రాత్రి 10:30 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయి నారాయణపూర్ గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

News April 19, 2024

మేడిపల్లి: వాటర్ హౌస్‌లో పడి బాలుడు మృతి

image

మేడిపల్లి మండల కేంద్రంలో వాటర్ హౌస్‌లో పడి బాలుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒడిశా‌కు చెందిన బైగాని సంబర్ మేడిపల్లిలోని ఓ ఇటుకబట్టీలో కూలి పని చేస్తుంది. ఆమె కుమారుడు పరమేశ్వర్ (7) స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వాటర్ హౌస్‌లో పడ్డాడు. గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందాడన్నారు. ఘటనపై కేసు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 19, 2024

ఓదెల: బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

image

బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓదెల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓదెల గ్రామానికి చెందిన చింతం లక్ష్మి(74) శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు నాగులకుంట కట్ట వెనకాల బావిలో దూకి మృతి చెందింది. ఘటనా స్థలానికి పొత్కపల్లి ఎస్ఐ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. భార్య చనిపోవడంతో భర్త చంద్రయ్య విలపించిన తీరు అందరినీ తీవ్రంగా కలచివేసింది.

News April 19, 2024

సిరిసిల్ల: ఈవీఎంలు, వివి ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్

image

ఫస్ట్ ర్యాండమైజేషన్లో భాగంగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు కేటాయించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం పరిశీలించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్ధాపూర్ ఈవీఎం గోడౌన్ నుంచి సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూములకు భద్రత మధ్య తరలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పూజారి గౌతమి, కీమ్యా నాయక్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.

News April 19, 2024

కరీంనగర్‌లో బండి సంజయ్ నామినేషన్

image

కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ తరఫున స్థానిక బీజేపీ నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరెట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి అందజేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్ బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ మేయర్ శంకర్ తదితరులు ఉన్నారు. కాగా కరీంనగర్‌లో బీజేపీ విజయం ఖాయమని ట్విట్టర్‌లో బండి సంజయ్ పోస్ట్ చేశారు.

News April 19, 2024

జగిత్యాల: రైల్వే బ్రిడ్జి పై బ్రిడ్జిపై బాలిక మృతదేహం

image

జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్‌ రైల్వే ట్రాక్‌పై కైకేయి(17) అనే బాలిక రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఒడిశాకు చెందిన బాలికగా గుర్తించిన జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చల్ గల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీల్లో పని చేసే కూలీగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా సూసైడ్‌కు కారణాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2024

ఓదెల: బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

image

బావిలో దూకి వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఓదెల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓదెల గ్రామానికి చెందిన చింతం లక్ష్మి(74) శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు నాగులకుంట కట్ట వెనకాల బావిలో దూకి మృతి చెందింది. ఘటనా స్థలానికి పొత్కపల్లి ఎస్ఐ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. భార్య చనిపోవడంతో భర్త చంద్రయ్య విలపించిన తీరు అందర్నీ తీవ్రంగా కలిచివేస్తోంది.

News April 19, 2024

పెద్దపల్లి: అక్కడ 4 గంటల వరకే పోలింగ్

image

వచ్చేనెల 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధి మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులోని కొన్ని అటవీ ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న అటవీ ప్రాంతాలలో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న అటవీ గ్రామాలపై పోలీసులు డేగ కన్ను వేశారు.

News April 19, 2024

జగిత్యాల: 17 సార్లు ఎన్నికలు..ఒక్కసారే మహిళకు అవకాశం

image

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో 1967లో మాత్రమే స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 11 సార్లు కాంగ్రెస్, 3 సార్లు TDP, TRS, BJP ఒకసారి విజయం సాధించాయి. 2014లో TRS అభ్యర్థిగా కవిత ఎన్నికయ్యారు. 2004లో పునర్విభజన అనంతరం జగిత్యాల, కోరుట్లు నియోజకవర్గాలు నిజామాబాద్‌లో వచ్చి చేరాయి.

News April 19, 2024

ఈటల ఆస్తి రూ.54.01 కోట్లు

image

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు రూ.54.01 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అధికారికి ఇచ్చిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.20.43 కోట్ల అప్పులు ఉన్నాయని, తనపై 54 కేసులు ఉన్నట్లు చెప్పారు. చేతిలో రూ. లక్ష నగదు, భార్య జమునకు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, వివిధ కంపెనీల్లో పెట్టబడులు ఉన్నాయన్నారు. కుటుంబానికి 72.25 ఎకరాల భూమి, పౌల్ట్రీ ఫారాలు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయని వెల్లడించారు.