Karimnagar

News April 18, 2024

సుదీర్ఘ అనుభవం.. గట్టెక్కిస్తుందా..!

image

లోక్ సభ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. జీవన్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో 3సార్లు మంత్రిగా పనిచేశారు. ఇక ఈశ్వర్ 6 సార్లు (మేడారం నుంచి రెండు, ధర్మపురి నుంచి నాలుగు సార్లు) గెలిచి చీఫ్ విప్‌గా, మంత్రిగా పనిచేశారు. మరి ఇంత అనుభవం ఉన్న వీరివురూ ఈసారి ఎన్నికల్లో సత్తా చాటుతారా..? కామెంట్ చేయండి.

News April 18, 2024

KNR: తీవ్ర విషాదం.. బాలింత మృతి

image

ప్రసవానికి వెళ్ళిన బాలింత డెలివరీ అనంతరం మృతిచెందిన ఘటన కరీంనగర్‌లో జరిగింది. తీగలగుట్ట పల్లికి చెందిన వర్షినికి పురిటి నొప్పులు రావడంతో వారం రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఆపరేషన్ వికటించి
ఆమె మృతి చెందిందని బంధువులు తెలిపారు. దీంతో ఆస్పత్రి వద్ద పెద్దఎత్తున బంధువులు ఆందోళన చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని ఆరోపించారు.

News April 18, 2024

సిరిసిల్ల: సినీ ఫైటర్స్ రామ్ లక్ష్మణుల సందడి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు సందడి చేశారు. తన బంధువుల వివాహ కార్యక్రమానికి హాజరైన హాజరయ్యారు. వారిని చూసేందుకు గ్రామస్థులు ఉత్సాహాన్ని కనబరిచారు. వారితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడటంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.

News April 18, 2024

సిరిసిల్ల: పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ చేపట్టాలి: వికాస్ రాజ్

image

పకడ్బందీగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఎంపీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, తుది ఓటర్ జాబితా రూపకల్పనపై జిల్లా ఎన్నికల అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్, ఆర్డిఓలు రమేష్, రాజేశ్వర్ పాల్గొన్నారు.

News April 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. @ శ్రీరామనవమి వేడుకలలో ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. @ సైదాపూర్ మండలంలో అక్రమంగా రవాణా చేస్తున్న 3 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత. @ రాయికల్ మండలంలో తమ్మునిపై దాడి చేసిన అన్నపై హత్యాయత్నం కేసు. @ కథలాపూర్ మండలంలో చోరీకి పాల్పడిన నలుగురికి రిమాండ్. @ సివిల్స్ లో సత్తా చాటిన రామడుగు మండల యువకుడికి సన్మానం.

News April 17, 2024

రామగుండం: వడదెబ్బతో యువకుడు మృతి

image

రామగుండం ఎన్టీపీసీ పరిధి జంగాలపల్లి గ్రామానికి చెందిన మేకల రవికుమార్ తన యువకుడు వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పశువులను మేపేందుకు బయటకు వెళ్లిన రవికుమార్ వడదెబ్బకు గురయ్యాడని తెలిపారు. కాగా ఈ సంఘటనపై మృతుని తండ్రి లింగయ్య ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News April 17, 2024

పెద్దపల్లి: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి ఎంపీ?

image

పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించిన వెంకటేష్ నేతకు కాంగ్రెస్‌లోనూ మొండిచేయి చూపడంతో ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును ప్రకటించిన బీజేపీ.. వెంకటేష్ నేత చేరితే టికెట్ మార్చే అవకాశం ఉందని టాక్.

News April 17, 2024

సహనకు కంగ్రాట్స్ చెప్పిన స్మితా సబర్వాల్

image

కరీంనగర్‌కు చెందిన కొలనుపాక సహన సివిల్స్ ఫలితాల్లో 739వ ర్యాంకు సాధించారు. గతంలో కరీంనగర్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన స్మితా సబర్వాల్ తనకు ఆదర్శమన్నారు. ఏ క్యాడర్ వచ్చినా IAS కావడమే లక్ష్యమని పేర్కొన్నారు. తన రోల్ మోడల్ స్మితా సబర్వాల్ అని సహన పేర్కొనగా.. ట్విట్టర్‌లో స్మిత స్పందించారు. ‘ప్రియమైన సహన.. మీ ఎంపికకు శుభాకాంక్షలు. So proud of you’ అంటూ అభినందనలు తెలిపారు.  

News April 17, 2024

UPDATE జగిత్యాల: తల్లి కోసం వెళ్లి కుమార్తె మృతి

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో బస్సు కిందపడి <<13062336>>చిన్నారి మృతి చెందిన<<>> విషయం విదితమే.మద్దుట్లకు చెందిన రజాక్‌-హసీనా దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. మంగళవారం ఉదయం కొడుకు సాజిల్‌ను పాఠశాల బస్సు ఎక్కించేందుకు తల్లి హసీనా వెళ్లగా.. ఆమె వెనుకే 18 నెలల కూతురు అరిబా బస్సు ముందుకు వెళ్లింది. డ్రైవర్‌ గమనించక వాహనాన్ని ముందుకు కదిలించడంతో చిన్నారి తలపై నుంచి వెనుక చక్రం వెళ్లింది. దీంతో చిన్నారి చనిపోయింది.

News April 17, 2024

జగిత్యాల: ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి

image

ఈ నెల 6న నిజామాబాద్ నుంచి నర్సంపేటకు వస్తున్న బస్సులో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తి(46)ని ఎక్కించారు. అతడి ఆరోగ్యం బాగాలేదని, వరంగల్ వెళ్లాక లేపితే.. అక్కడి నుంచి రైలులో ఆంధ్రా ప్రాంతానికి వెళతారని కండక్టర్ రాజ్‌కుమార్‌కు చెప్పి వారు బస్సు దిగిపోయారు. వరంగల్ చేరుకున్నాక కండక్టర్ లేపడానికి ప్రయత్నించగా..అప్పటికే మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.