India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వసతి గృహాలలో కామన్ డైట్ మెనూ ప్రారంభం.
@ ఇబ్రహీంపట్నం మండలంలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీలు ప్రారంభం.
@ కాటారం మండలంలో అన్నను హత్య చేసిన తమ్ముడు.
@ మెట్పల్లి మండలంలో గురుకుల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడలో గురుకుల విద్యార్థులతో స్టెప్పులు వేసిన ప్రభుత్వ విప్.
@ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ.

కరీంనగర్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15, 16న జరగనున్న ఈ పరీక్షలకు 26,977 మంది రాయనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 56 పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు గంట ముందే పరిక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.

పుష్ప-2 ఘటన లో సంధ్య థియేటర్ & అల్లు అర్జున్ పై BNS 105, 118 (1) r/w 3/5 సెక్షన్ల కింద కేసు నమోదై అల్లు అర్జున్ అరెస్టై బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మెట్ పల్లి పట్టణానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరంచంద్ నిన్న హైకోర్టు లో FIR QUASH చేయాలని సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున లంచ్ మోషన్ మూవ్ చేశాడు. నేడు హైకోర్టులో సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున ఆయన వాదించారు.

పుష్ప-2 ఘటన లో సంధ్య థియేటర్ & అల్లు అర్జున్ పై BNS 105, 118 (1) r/w 3/5 సెక్షన్ల కింద కేసు నమోదై అల్లు అర్జున్ అరెస్టై బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మెట్ పల్లి పట్టణానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరంచంద్ నిన్న హైకోర్టు లో FIR QUASH చేయాలని సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున లంచ్ మోషన్ మూవ్ చేశాడు. నేడు హైకోర్టులో సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున ఆయన వాదించారు.

డిసెంబర్ 15, 16 తేదీలలో జరగనున్న గ్రూప్-II పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 అమలులో ఉంటుందని ఈ రోజు రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. రామగుండం కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 23,969 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని.. అందులో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 18 పరీక్షా కేంద్రాలలో 9018, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 48 పరీక్షా కేంద్రాలలో 14,951 మంది హాజరు కానున్నారన్నారు.

బంగారం అపహరించిన దొంగలను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం బొమ్మన గ్రామానికి చెందిన హేమశ్రీ బుధవారం కరీంనగర్లో పెళ్లి వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో 10 తులాల బంగారు ఆభరణాల కలిగిన బ్యాగును పొగొట్టుకుంది. KNR పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకొని బాధితురాలికి బంగారాన్ని అందజేశారు. ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, క్రైమ్ కానిస్టేబుళ్లు కుమార్, సంపత్లను సిపి అభినందించారు.

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో సిబ్బందిని శుక్రవారం సీపీ అభిషేక్ మహంతి అభినందించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మన గ్రామానికి చెందిన హేమశ్రీ ఆభరణాలను గుర్తించి పట్టుకుని, బాధితురాలికి అందించిన ఘటనలో కృషి చేసిన కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, అతని సిబ్బంది అయిన క్రైమ్ కానిస్టేబుళ్లు కుమార్, సంపత్లను సిపి అభిషేక్ మహంతి ప్రత్యేకంగా అభినందించి ప్రశాంస పత్రాలు అందజేశారు.

షార్ట్ సర్క్యూట్తో నిన్న మల్యాల మండలంలో వ్యక్తి <<14855286>>సజీవ <<>>దహనమైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మ్యాడంపల్లి గ్రామానికి చెందిన తిరుపతి(40) ట్రాక్టర్ డ్రైవర్, భార్య సౌందర్య హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే తిరుపతి మంటలకు ఆహుతి అయ్యాడు.

@ మల్యాల మండలంలో షార్ట్ సర్క్యూట్తో వ్యక్తి సజీవ దహనం.
@ ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్.
@ వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్ చేయవద్దని మెట్పల్లిలో ధర్నా.
@ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు అందుకున్న కోరుట్ల చిన్నారి.
@ కోరుట్ల పట్టణంలో జర్నలిస్టుల ధర్నా.

కరీంనగర్ జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో నూతన డైట్ మెనూ అమలు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గురుకుల హాస్టల్ విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలను పెంచిందన్నారు.
Sorry, no posts matched your criteria.