Karimnagar

News August 11, 2024

BREAKING.. KNR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. గోదావరిఖని పట్టన శివారు గంగానగర్ రాజీవ్ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి వన్ టౌన్ పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News August 11, 2024

KNR: 1.68 లక్షల కేసులు, రూ.3.92 కోట్ల జరిమానా

image

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యం కారణంగా పోలీసులు వాహనదారులకు భారీగా జరిమానాలు విధించారు. KNR కమిషనరేట్ పరిధిలో 7నెలల్లో 1.68 లక్షల కేసులు, రూ.3.92 కోట్ల జరిమానా విధించారు. 2023లో 56మంది మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పడ్డుబడ్డారు. ఈ ఏడాది జులై 31వరకు వాహనాలు నడుపుతూ 87మంది మైనర్లు పట్టుబడటంతో వాహన చట్టం 181కింద వీరికి రూ.43వేల జరిమానా విధించారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

News August 11, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.3,83,554 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,86,401, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,54,995, అన్నదానం రూ.42,158,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

News August 10, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోరుట్లలో హిందూ సంఘాల భారీ ర్యాలీ. @ వేములవాడలో గురుకుల మహిళ కళాశాలను తనిఖీ చేసిన ప్రభుత్వ విప్, కలెక్టర్. @ జగిత్యాలలో జంతు సంరక్షణ కేంద్రం ప్రారంభం. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ చొప్పదండి మండలంలో లారీ డ్రైవర్ ఆత్మహత్య. @ మెట్పల్లి మండలంలో వృద్ధురాలిపై వీధి కుక్క దాడి. @ జగిత్యాల రూరల్ మండలంలో కొండచిలువ పట్టివేత. @ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల ఎస్పీ.

News August 10, 2024

ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక వస్తే మనదే గెలుపు: KTR

image

ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని, బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ నియోజకవర్గానికి తప్పనిసరిగా ఉప ఎన్నిక వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం కార్యకర్తలు సమాయత్తం కావాలని సూచించారు. మీ కామెంట్?

News August 10, 2024

సిరిసిల్ల జిల్లాలో అరుదైన మూలకాలు

image

SRCL జిల్లా పరిధిలో కొనసాగుతున్న మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన మట్టి నమూనాల పరీక్షల్లో గనుల శాఖ అధికారులు అరుదైన మూలకాలను గుర్తించారు. ఇవి దాదాపు 562.47 చ.కి. మేర విస్తరించి ఉన్నట్లు వారు తెలిపారు. సర్వేల్లో 17 లోహ మూలకాల(15 రకాల లాంథనైడ్స్‌తో పాటు స్కాండియం, ఏట్రియం)ను గుర్తించామన్నారు. ఖనిజాల అన్వేషణకు కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర గనుల శాఖకు నివేదిక పంపింది.

News August 10, 2024

KNR: అత్తింటి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

image

అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన BHPL జిల్లా మహాముత్తారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేంద్ర కుమార యాదవ్ వివరాల ప్రకారం.. మీనాజీపేటకు చెందిన జమున(24)కు అదే గ్రామానికి చెందిన సమ్మయ్యతో మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. ఈ పెళ్లి నచ్చకపోవడంతో అప్పటినుంచి భర్త తల్లి పద్మ, భర్త సోదరుడు పవన్ నిత్యం వేధించడంతో మనస్తాపం చెంది శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది.

News August 10, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,32,523 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.53,913, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.68,350, అన్నదానం రూ.10,260,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

News August 9, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా నాగుల పంచమి వేడుకలు. @ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి, ఇద్దరికి అస్వస్థత. @ జగిత్యాల జిల్లా విద్యాధికారిగా జనార్దన్ రావు. @ మెట్పల్లి మండలంలో బాలుడి పై వీధి కుక్క దాడి. @ గొల్లపల్లి మండలంలో 78 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ వెల్గటూర్ మండలంలో పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య. @ కరీంనగర్ లో సినీ హీరోయిన్ల సందడి.

News August 9, 2024

ఉపాధి నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు వెబ్ సైట్ tgbestudycircle.cgg.gov.in లో ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ కుషాయిగూడలోని ‘ఎల్డీ హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ’ ద్వారా 100 మందికి ఉచిత నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.