India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పెంచికలపేట గ్రామశివారులో గతనెల 27న కోడి పందాలు ఆడే వారిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఆటలో పట్టుబడిన రెండు పందెం కోళ్లకు నేడు పోలీస్స్టేషన్లో వేలం పాట నిర్వహించనున్నట్లు SI తెలిపారు. మంథని కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు ఆసక్తి కలిగిన వారు వేలంపాటకు హాజరై కోళ్లను దక్కించుకోవాలన్నారు.
పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ఆసిఫాబాద్ జిల్లాలోని గుండాల జలపాతంలో గోదావరిఖని రమేశ్ నగర్కు చెందిన రిషి ఆదిత్య గల్లంతైనట్లు సమాచారం. స్నేహితులతో కలిసి జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన రిషి.. జలపాతంలో దిగి ఈత కొట్టడానికి ప్రయత్నించగా ఆ నీటిలో జారీ గల్లంతయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండాలకు వెళ్లారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
@ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజావాణిలో 112 ఫిర్యాదులు. @ బోయిన్పల్లి మండలంలో ఉరి వేసుకొని వృద్ధుడి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వ్యక్తి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో ప్రారంభమైన బ్రేక్ దర్శనాలు. @ పెద్దాపూర్ గురుకులాన్ని పరిశీలించిన కోరుట్ల ఎమ్మెల్యే. @ ధర్మపురి లో స్వచ్చదనం పచ్చదనం లో పాల్గొన్న ప్రభుత్వ విప్. @ కొడిమ్యాల మండలంలో వ్యక్తి హత్య.
ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ప్రతి ఫిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉ.10 గంటల నుంచి మ. 3 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బాధితులకు త్వరిత న్యాయం చేయడానికి ప్రతి సోమావారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, 14 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు.
తెలంగాణ ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. కాసేపటికి క్రితం అమెరికా చేరుకున్న నాయకులకు, ఎంబసీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడమే తొలి ప్రాధాన్యతగా, రాష్ట్రంలో అధికంగా పెట్టుబడులను ఆహ్వానించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల పరిధిలోని పెట్రో కార్, రక్షక్ & హైవే పెట్రోలింగ్, పోలీసు వాహనాలను అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్లో పరిశీలించారు. వాహనాల పనితీరు, నిర్వహణ, ట్యాబ్స్, VHF సెట్, GPS పనితీరు తనిఖీ చేసి వారు నిర్వహిస్తున్న విధుల గురించి డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. వాహనాలను ఎప్పుడు కండిషన్లో ఉంచుకోవాలని, ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన కొండ లక్ష్మీరాజం అనే యువకుడు సిరిసిల్లలో హోటల్ పెట్టి నష్టాపోయాడని, ఆర్థిక పరిస్థితులు తాళలేక అదే హోటల్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మల్లాపూర్ మండల కేంద్రంలోని కనక సోమశ్వర స్వామి కొండ పై నేటి నుంచి శ్రావణ మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. కొండ పైన కనక సోమేశ్వరస్వామిని మండల ప్రజలతో పాటు నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా వాసులు వచ్చి దర్శించుకున్నారు. శ్రావణమాసంలో ప్రతి సోమవారం ఐదు వారాలు కనక సోమేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటారు. భక్తులకు కొండ కింద అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.
సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం గురించి అందరికీ తెలిసిందే . కానీ, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాంలో ఉన్న మరో ఆలయం గురించి ఎంతమందికి తెలుసు. గ్రామంలో ఉన్న మగ్గాలగడ్డ సమీపంలోని రాజేశ్వరస్వామి ఆలయం ఇది. ఈ ఆలయం సుప్రసిద్ధ చరిత్రను కలిగి ఉంది. ఇది దాదాపు 2000 ఏళ్ల క్రితం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయ శిఖరం చాణిక్య/కాకతీయ నిర్మాణం శైలిలో ఉంటుంది. SHARE
మూడంతో 3 నెలలు నిలిచిన శుభకార్యాలు నేటి నుంచి మళ్లీ షురూ కానున్నాయి. నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్లో వివాహాది కార్యక్రమాలు జోరందుకోనున్నాయి. ఈ నెల రోజుల పాటు ఎటుచూసినా సందడి వాతావరణమే నెలకొననుంది. ఇప్పటికే పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న వారు నిశ్చయ తాంబూలాలు మార్చుకొని వివాహానికి సిద్ధమవుతున్నారు. వివాహాలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో కల్యాణ మండపాలు ముస్తాబుకానున్నాయి.
Sorry, no posts matched your criteria.