India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దపల్లి జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం అవగాహన కార్యక్రమలో ఆయన మాట్లాడారు. కొంతమంది పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది ప్లాస్టిక్ నియంత్రణలో కృషి చేశారని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని, గ్రామాలకు, పట్టణాలకు వచ్చే దారుల వెంబడి ప్లాస్టిక్, చెత్త కనిపించవద్దని కలెక్టర్ పేర్కొన్నారు.
@ క్యాన్సర్ వ్యాధి చిన్నారికి సిరిసిల్ల కలెక్టర్ ఆపన్న హస్తం. @ గంభీరావుపేట మండలంలో కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య. @ కొడిమ్యాల మండలంలో చిన్నారిపై వీధి కుక్క దాడి, @ ఎల్లారెడ్డిపేట మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. @ చందుర్తి మండలంలో డెంగ్యూ జ్వరంతో మహిళ మృతి. @ కోరుట్ల పట్టణంలో పీఎం నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం. @ జగిత్యాల కలెక్టర్ ను కలిసిన కొండగట్టు ఆలయ ఈవో.
వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన చిన్నారి నయనశ్రీ క్యాన్సర్తో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆమెకు చికిత్స చేయించేందుకు ముందుకు వచ్చి కుటుంబానికి అండగా నిలిచారు. చిన్నారి తల్లి, తహశీల్దార్ పేరు మీద జాయింట్ ఖాతా ప్రారంభించి రూ.10 లక్షలు జమ చేస్తామన్నారు. క్యాన్సర్ను నయం చేసేందుకు మెరుగైన వైద్యం ఎక్కడ అందించాలో పరిశీలించి నివేదిక సమర్పించాలని DMHOను ఆదేశించారు.
గీత కార్మికుల ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన కాటమయ్య రక్షణ కవచ్ మోకుల పంపిణీకి రంగం సిద్ధమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 5 నుంచి ప్రతి నియోజకవర్గానికి 100 మోకుల చొప్పున మొదటి విడతలో పదివేల మోకులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కల్లు గీత వృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికీ ఈ మోకులను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2వ, 4వ, 6వ (రెగ్యులర్ & బ్యాక్ లాగ్స్) సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్టు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫలితాల కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.satavahana.ac.inను సందర్శించాలని పేర్కొన్నారు.
HYD కాప్రా మండలం జవహర్నగర్ PS పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీనగర్లో నివాసం ఉంటున్న బాలిక(16) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 9వ తరగతి చదువుతోంది. అయితే బాలాజీనగర్లోని ఇంటికి ఆమె ఇటీవల రావడంతో శివ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో గురువారం రాత్రి ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన అంజలి(53) ఐదు రోజుల క్రితం అనారోగ్యం బారిన పడగా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి డెంగ్యూతో పాటు ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని నిర్ధారించారు. దీంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో HYD తరలిస్తుండగా మార్గమధ్యలో గురువారం రాత్రి మృతిచెందింది.
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన అంజలి(53) ఐదు రోజుల క్రితం అనారోగ్యం బారిన పడగా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి డెంగ్యూతో పాటు ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని నిర్ధారించారు. దీంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో HYD తరలిస్తుండగా మార్గమధ్యలో గురువారం రాత్రి మృతిచెందింది.
ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టులో భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు ఉండగా.. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 29,960 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 2,695 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 38.993 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ అవసరాల కోసం ప్రాజెక్ట్ నుంచి మొత్తం 684 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ASI లక్ష్మినాయణను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. SI, తోటి సిబ్బందితో లక్ష్మినాయణ దురుసుగా ప్రవర్తించడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయన్నారు.
Sorry, no posts matched your criteria.