Karimnagar

News April 8, 2024

జగిత్యాల జిల్లాలో సదరం శిబిరాల తేదీలు ఇవే

image

జగిత్యాలలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు హాస్పిటల్ ధరూర్‌లో ఏప్రిల్, మే నెలలో సదరం శిబిరాలు నిర్వహించబడునని జిల్లా వైద్య పర్యవేక్షకులు తెలిపారు. ఏప్రిల్ 10, 18, 19, 24, 26, 30, మే 8, 15, 17, 22, 29, 31 తేదీలలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శిబిరాలు నిర్వహించబడునున్నారు. ఏప్రిల్ 23, మే 24 తేదీలలో మాతా శిశు హాస్పిటల్‌లో శిబిరం నిర్వహించబడునన్నారు. ఈనెల 8 నుంచి స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు.

News April 8, 2024

కొండగట్టులో హనుమాన్ జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

ఈనెల 22 నుంచి 24 వరకు కొండగట్టులో జరిగే శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తాగునీరు, విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ దివాకర తదితరులు పాల్గొన్నారు.

News April 8, 2024

జగిత్యాల: ఫొటోలు ఉన్నాయని బెదిరిస్తూ.. అత్యాచారం

image

జగిత్యాల పట్టణంలో నివసిస్తున్న ఓ వివాహితతో TRనగర్‌కు చెందిన మోహన్ పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసుకుని.. కోరిక తీర్చమని లేకుంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ బలవంతంగా అత్యాచారం చేశాడు. బెదిరింపులు భరించలేక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. నిందితుడిపై మొత్తం 13 కేసులున్నాయని పట్టణ సీఐ తెలిపారు.

News April 8, 2024

గంభీరావుపేట: తల్లిదండ్రుల ముందు విద్యార్థినిని కొట్టిన ప్రిన్సిపల్

image

విద్యార్థినిని ప్రిన్సిపల్ కొట్టిన ఘటన గంభీరావుపేట మండలంలోని గురుకుల పాఠశాలలో జరిగింది. గ్రామానికి చెందిన ఎడ్ల యశస్విని పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. కూతురుని చూద్దామని ఆదివారం తల్లిదండ్రులు పాఠశాలలోకి వెళ్లారు. ఈక్రమంలో భోజనం సరిగా లేదని యశస్విని చెప్పడంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్ తల్లిదండ్రుల ముందు బిడ్డను కొట్టినట్లు ఆరోపించారు.

News April 8, 2024

వేములవాడలో ఫిట్స్‌తో భక్తుడి మృతి

image

ఫిట్స్‌తో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వేములవాడలో జరిగింది. ఆదివారం శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఫిట్స్‌కు గురయ్యారు. వెంటనే ఆలయ అధికారులు స్థానికుల సమాచారంతో 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. మరణించినట్లు వేములవాడ టౌన్ ఇన్‌ఛార్జ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. సదరు వ్యక్తి వివరాలు తెలిసిన వారు వేములవాడ పోలీసులను సంప్రదించాలన్నారు.

News April 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మల్యాల మండలంలో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య. @ కోరుట్ల మండలంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో నెంబర్ ప్లేట్లు లేని వాహనాల పట్టివేత. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్పల్లి మండలం కొండ్రికర్ల లో వైభవంగా మల్లన్న జాతర. @ కోనరావుపేట మండలంలో చెరువులో చేపల మృతి. @ జగిత్యాల జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జలపతి రెడ్డి.

News April 7, 2024

మల్యాల: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

image

మల్యాల మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన బొజ్జ లక్ష్మి (38) అనే మహిళ ఆదివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అప్పులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ గ్రామ శివారులోని వెంకటేశ్వర్ల గుట్టపై ఓ చెట్టుకు ఉరి వేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News April 7, 2024

జగిత్యాల: రోడ్డు యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి

image

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన కట్కం లక్ష్మీకాంతం వృత్తిరీత్యా కిరాణా షాపులో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో తన సొంత పనుల నిమిత్తం కోరుట్ల వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో పైడిమడుగు గ్రామసమీపంలో తన బైకు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతడి మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

News April 7, 2024

పెద్దపల్లి: కరెంట్ షాక్‌తో బాలింత మృతి

image

కరెంట్ షాక్‌తో బాలింత మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ఎలిగేడు మండలం శివపల్లికి చెందిన పరమేశ్వరి, వెంకటేశం దంపతుల కుమార్తె కీర్తిని రామగుండానికి చెందిన స్వాగత్‌కు ఇచ్చి 2021లో పెళ్లి చేశారు. కీర్తి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. ఈ నెల 1న పుట్టినింట్లో సంప్రదాయ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం రాత్రి కీర్తి స్నానం చేయడానికి వెళ్లగా.. విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై మృతి చెందారు.

News April 7, 2024

ఈసారి నిజామాబాద్ ఎంపీ స్థానం దక్కేదెవరికి?

image

నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఓటర్లు ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇస్తూ ఉంటారు. ఇప్పటికీ ఇక్కడ 5 పార్టీలను ఆదరించారు. 6 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టీడీపీ, స్వతంత్ర, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కోసారి గెలిచాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ MP అర్వింద్ ధర్మపురి మరోసారి బరిలో నిలవగా.. బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. గెలుపుపై ముగ్గురూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.