Karimnagar

News April 7, 2024

కరీంనగర్: ‘బయటకు రావొద్దు’

image

కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. వీణవంకలో 44℃, కొత్తపల్లి 43.8, జమ్మికుంట 43.7, కొత్తగట్టు 43.6, వెదురుగట్టు 42.9, మల్యాల 42.6, ఇందుర్తి 42.5, ఆర్నకొండ 42.4, దుర్షెడ్‌ 42.1, వెంకేపల్లి 41.9, ఆసిఫ్‌నగర్‌ 42, గంగిపల్లి 41.7, బోర్నపల్లి 41.7, చింతకుంట 41.5, తనుగుల 41.5, కరీంనగర్ 41.5, పోచంపల్లి 41.4, రేణికుంట 40.9, నుస్తులాపూర్ 41℃గా నమోదైంది. అవసరమైతేనే బయటకు రావాలని వైద్యులు సూచించారు.

News April 7, 2024

కరీంనగర్: DSC ఉచిత శిక్షణకు స్పాట్ అడ్మిషన్లు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు DSCలో SGT, SAకు GS మొదటి పేపర్ ఉచిత శిక్షణ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ డైరెక్టర్ రవి కుమార్ ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు చెందిన అర్హత గల అభ్యర్థులకు ఈ నెల 8న ఉదయం 10 గంటలకు బీసీ స్టడీ సర్కిల్‌లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని చెప్పారు.

News April 7, 2024

సిరిసిల్ల: 14 కేసులు నమోదు చేశాం: ఎస్పీ

image

అక్రమవడ్డీ, ఫైనాన్స్ వ్యాపారస్తులపై 14 కేసులు నమోదు చేశామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ… జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న 14 మందిపై కేసులు నమోదు చేసి వారి నుండి రూ.16,13,000, 359 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

News April 6, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సిరిసిల్లలో ఉరి వేసుకుని నేత కార్మికుడి ఆత్మహత్య @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్షలు. @ కోరుట్ల పట్టణంలో ఆటో ఢీకొని 16 నెలల బాలుడు మృతి. @ సిరిసిల్లలో రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్. @ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల ఎస్పీ.

News April 6, 2024

కేసిఆర్ పెద్ద మనిషిగా గౌరవంగా మాట్లాడు: పొన్నం ప్రభాకర్

image

నిన్న మా జిల్లా కరీంనగర్‌కు వచ్చి కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీ అత్తగారి ఊరు కొదురుపాకలో నిల్చొని అడుగుదాం.. ఎవరు ఏంటని, మీరు మాట్లాడిన భాషకు మేము కౌంటర్ ఇస్తే మీ తల ఎక్కడ పెట్టుకుంటారో తెలియదన్నారు. నీళ్ల కోసం మీరు కష్టపడితే ఆ నీటిని దొంగ పాసు పోర్టులతో విదేశాలకు పంపలేదన్నారు. కేసీఆర్ పెద్ద మనిషిగా గౌరవంగా మాట్లాడు అని సూచించారు.

News April 6, 2024

ఐపీఎల్ మ్యాచ్‌లో ఉమ్మడి జిల్లా మంత్రులు

image

శుక్రవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు సందడి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, హీరో వెంకటేష్‌లతో కలిసి మ్యాచ్ వీక్షించారు. అనంతరం హైదరాబాద్ జట్టు గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

News April 6, 2024

నేతన్న కుటుంబానికి రూ.50,000 ఆర్థికసాయం చేసిన కేటీఆర్

image

సిరిసిల్లలో ఉరేసుకుని<<13002333>> లక్ష్మీనారాయణ<<>> అనే నేత కార్మికుడు మృతి చెందాడు. ఆయన పార్థివదేహానికి ఎమ్మెల్యే కేటీఆర్ నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు తక్షణ సహాయం కింద రూ. 50,000 ఆర్థికసాయం చేశారు. ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థికసాయమందించాలని కలెక్టర్‌ను కోరారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

News April 6, 2024

కోరుట్ల: ఆటో ఢీకొని 16 నెలల బాలుడు మృతి

image

తాగునీటి సరఫరా చేసే ట్రాలీ ఆటో ఢీకొని 16 నెలల బాలుడు మృతి చెందిన సంఘటన కోరుట్ల పట్టణంలో శనివారం జరిగింది. అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన పొట్ట రిసింద్ర, అపూర్వల కుమారుడైన సుధన్వన్.. ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈక్రమంలో అటుగా వచ్చిన ఆటో డ్రైవర్ అజాగ్రత్తతో నడిపి బాలుడిని ఢీకొట్టాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 6, 2024

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మీ మొబైల్ ఫోన్‌లోకి వచ్చే లింకులపై క్లిక్ చేయవద్దని, మీ ప్రమేయం లేకుండా మీ మొబైల్‌కి వచ్చే ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దని సూచించారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే 1930, 100 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News April 6, 2024

KNR జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

image

రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలలో శుక్రవారం ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయి, సిరిసిల్ల జిల్లా మర్దన పేటలో 43.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత నమోదయింది. కరీంనగర్ జిల్లా వెదురుగట్టలో 43.2, పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు జగిత్యాల పరిశోధన స్థానం అధికారి బి.శ్రీ లక్ష్మీ తెలిపారు.