Karimnagar

News April 5, 2024

జగిత్యాల జిల్లాలో దారుణ హత్య

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం దారుణ హత్య జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని దుర్గమ్మ ఆలయ సమీపంలో నివసిస్తున్న అంబదాస్ మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం కాసేపు సేద తీరుతున్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి హత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 5, 2024

జగిత్యాల: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు ప్రత్యర్థులు

image

నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ప్రత్యర్థులుగా పోటీపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ఓ వేడుకలో సరదాగా మాట్లాడుకున్నారు. కోరుట్లలో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ నర్సింగరావు హాజరయ్యారు. అదే సమయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, బాజిరెడ్డి గోవర్ధన్ అక్కడికి రావడంతో అందరూ కలుసుకున్నారు.

News April 5, 2024

మల్లాపూర్: ప్రేమ జంటపై అమ్మాయి కుటుంబ సభ్యుల దాడి

image

మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో ప్రేమ జంటపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. సాతారానికి చెందిన అనిల్ అదే గ్రామానికి చెందిన రమ్యను ఇటీవల ప్రేమ వివాహం చేసుకొని వేరే గ్రామంలో నివసిస్తున్నాడు. గురువారం గ్రామానికి తిరిగి రావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంట్లోకి చొరబడి దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News April 5, 2024

పార్టీ మారే ప్రసక్తే లేదు: గంగుల

image

కరీంనగర్ MLA, మాజీ మంత్రి గంగుల కమలాకర్ పార్టీ మారుతున్నారనే పలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. గురువారం ఆయన కరీంనగర్‌లో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నానంటూ తనపై కొందరు బురద జల్లుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేదని అన్నారు. కాంగ్రెస్ నాలుగు నెలల పాలనకే రైతులు ఆగమయ్యారని, వారిని ఆదుకునేందుకే కేసీఆర్ రంగంలోకి దిగారని తెలిపారు.

News April 5, 2024

కరీంనగర్ సందర్శనకు KCR ఎలా వస్తారు?: బండి సంజయ్

image

పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నేడు కరీంనగర్‌కు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఏ ముఖం పెట్టుకుని పంట పొలాల సందర్శనకు వస్తున్నారో సమాధానం చెప్పాలని మండిపడ్డారు. కేసీఆర్‌కు నిజంగా రైతులపట్ల చిత్తుశుద్ధి ఉంటే రైతుల దుస్థితికి తానే కారణమని ఒప్పుకుని ముక్కు నేలకు రాసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి కరీంనగర్‌కు రావాలని గురువారం ఓ సమావేశంలో డిమాండ్ చేశారు.

News April 5, 2024

KNR: సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రచారాలు

image

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా వినూత్న రీతులలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఓవైపు నియోజకవర్గాలలో తిరుగుతూనే మరోవైపు సోషల్ మీడియా బాధ్యుల పేరుతో హల్ చల్ చేస్తున్నారు. ప్రచారాలు కాస్తా దూషణల వరకు వెళ్తుంది. దీంతో ఏకంగా పోలీసులకు ఫిర్యాదులు చేసుకునే వరకు వచ్చింది. బూతు పురాణాలు, విభిన్న ప్రచారాలతో ఓటర్లను నేతలు సందిగ్ధంలో పడేస్తున్నారు.

News April 5, 2024

పీవీ సొంతూరు రహదారి ఎలా ఉందంటే..?

image

వర్షాకాలం వచ్చిందంటే చాలు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామమైన HNK జిల్లా వంగరలో గ్రామ చెరువు నిండి అలుగు పారుతూ రోడ్డు పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తుంటుంది. దీంతో రాకపోకలు స్తంభిస్తాయి. అయితే గతంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ వంతెన నిర్మిస్తామని చెప్పినప్పటికీ జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలోనైనా మంత్రులు చొరవ తీసుకుని వంతెన నిర్మిస్తారని గ్రామస్థులు ఎదురు చూస్తున్నారు.

News April 5, 2024

కరీంనగర్: కేసీఆర్ నేటి పర్యటన వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ నేటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:30 గంటలకు ముకుదమ్పుర్ గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు బోయిన్పల్లి, చొప్పదండి మండలాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. 3 గంటలకు శభాష్పల్లిలో మిడ్ మానేరును సందర్శిస్తారు. 4 గంటలకు సిరిసిల్లలో ప్రెస్ మీట్‌లో పాల్గొంటారు.

News April 5, 2024

KNR: తాగునీటి సరఫరా పై అధికారులతో సమీక్ష

image

వేసవి నేపథ్యంలో తాగునీటికి గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాల్లో తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పలువురు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

News April 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*శంకరపట్నం మండలంలో ఆర్టీసీ బస్సు కింద పడి ఒకరి మృతి.
*వీర్నపల్లి మండలంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి.
*పోలీస్ కస్టడికి కరీంనగర్ కార్పొరేటర్ భర్త.
*కథలాపూర్ మండలంలో చైన్ స్నాచింగ్.
*ఎన్టిపిసి స్టేషన్ పరిధిలో హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురి అరెస్ట్.
*గుండెపోటుతో మృతి చెందిన గొల్లపల్లి మండల ఉపాధ్యాయుడు.
*దుబాయ్‌లో సిరిసిల్ల జిల్లా వాసి గుండె పోటుతో మృతి.
*జగిత్యాల కలెక్టరేట్లో ఇఫ్తార్ విందు.