India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించిన మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె.విద్యాసాగర్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న జరిగిన ఘటనపై విచారణ చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యతారహితంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.1,15,625 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.64,428, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.25,895, అన్నదానం రూ.25,302 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
పెద్దపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు PDPL మున్సిపాలిటీలోని బంధంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లాపరిషత్ మైనార్టీ పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల ఆవరణాలు మొత్తం జలమయం కావడం, బడుల లోపల గోడలకు తేమ వస్తుండటంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడంలేదు. బంధంపల్లి పాఠశాల ఆవరణలో వర్షం నీరు చేరడంతో ముత్రశాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు CM రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా ప్రస్తావన తీసుకొచ్చారు. 2009లో కరీంనగర్ జిల్లా ప్రజలు KCRను ఓడగొడతారని భయపడి పాలమూరుకు వలసొచ్చారని, వలసలు పోయే పాలమూరు ప్రజలు KCRను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారన్నారు. పదేళ్లు పాలించిన KCR రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు, పరివాహక ప్రాంతాల నుంచి వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 20.17 టీఎంసీలు కాగా.. 16.91 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం 14,349 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగగా.. 331 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది.
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగం లేదని గమనించిన ప్రభుత్వం వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఆగస్టు 15 వరకు వ్యాపారాలను ప్రారంభించేలా ఆదేశిలిచ్చింది. క్యాంటీన్, ఈవెంట్ మేనేజ్ మెంట్, పెరటి కోళ్లు, మొబైల్ ఫిష్ అవుట్లెట్, మిల్క్ పార్లర్, మీ సేవా, ఆహార కేంద్రాలు, కుట్టు మెషీన్ కేంద్రాలు తదితర వ్యాపారాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహించనుంది.
ఏఎండీలో 24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి కేవలం 5 టీఎంసీల నీటి నిల్వే ఉంది. గతేడాది ఇదే నెలలో ఎల్ఎండీ పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి. ఎగువ ప్రాంతాల నుంచి మిడ్ మానేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరద రావడంతో మిడ్ మానేరు నుంచి 1.10 లక్షల క్యూసెక్కులు, నదీ పరివాహక ప్రాంతం నుంచి దాదాపు 90 వేల క్యూసెక్కుల నీరు చేరింది. ప్రస్తుతం డ్యాంలో నీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి పట్టణంలో ఉన్న 100 పడకల మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగాలని సూచించారు. 100% ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపారు.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.54,703 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.29,682, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.15,510, అన్నదానం రూ.9,511 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్.
@ గంభీరావుపేట మండలంలో కుక్క దాడిలో వృద్ధుడికి తీవ్ర గాయాలు.
@ పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థి మృతి.
@ ఇబ్రహీంపట్నం మండలంలో మోడల్ స్కూల్ను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సిరిసిల్ల కలెక్టర్.
@ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలన్న పెద్దపల్లి కలెక్టర్.
Sorry, no posts matched your criteria.