India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పురుగు మందు తాగి ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో చోటుచేసుకుంది. SI రామకృష్ణ వివరాల ప్రకారం.. మద్దులపల్లికి చెందిన వైష్ణవి(20) KNRలోని ఓ ప్రైవేట్ కళాశాలో డిగ్రీ చదువుతోంది. అయితే రెండు, మూడో సెమిస్టర్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగు మందు తాగింది. కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించింది.
రామగుండం NTPC 2023-24 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఉత్పత్తి వివరాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. 1600 మెగావాట్ల తెలంగాణ ప్లాంటులో మార్చి 29 నాటికి 37.12 మి. యూ, 2600 మెగావాట్ల ప్లాంట్లో మార్చి 26 నాటికి 16,645 మి.యూ. విద్యుత్ ఉత్పత్తి నమోదయింది. NTPC రిజర్వాయర్లోని 100 MV ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లో 164.21 మి.యూ.కు గాను 196.17మి.యూ.తో 15.58 శాతం అధిక ఉత్పత్తి నమోదు చేసిందని పేర్కొన్నారు.
@ మెట్ పల్లి మండలం రాజేశ్వరరావు పేట బ్రిడ్జి వద్ద టిప్పర్ కింద పడి యువతి దుర్మరణం. @ ఇబ్రహీంపట్నం మండలంలో దేవాలయాలలో చోరీ. @ హుస్నాబాద్ శివారులోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. @ జగిత్యాల కలెక్టరేట్లో చలివేంద్రమును ప్రారంభించిన కలెక్టర్. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ. @ ఇంటి పన్ను వసూళ్లలో జగిత్యాల జిల్లా స్టేట్ లో టాప్.
ఇబ్రహీంపట్నం మండల పోలీస్స్టేషన్ పరిధిలోని రాజేశ్వర్రావుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లికి చెందిన వేముల దీక్ష (23) తన బావ దిలీప్తో కలిసి కథలపూర్ మండలం పోతారం గ్రామానికి బైక్పై వెళ్తోంది. ఈక్రమంలో రాళ్లలోడుతో వస్తున్న టిప్పర్ అతివేగంగా బైక్ను ఢీ కొంది. దీంతో దీక్ష టిప్పర్ వెనకాల చక్రాల్లో ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతిచెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మచెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలడం సోమవారం కలకలం రేపింది. చెరువుకట్ట వద్దకు ఉదయపు నడకకు వెళ్లిన వారు చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలుతుండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు చెరువు వద్దకు చేరుకుని, మృతదేహాన్ని వెలికితీయించారు. మృతిచెందిన వ్యక్తిని అక్కన్నపేట మండలం అంతకపేటకు చెందిన సాగర్గా గుర్తించారు.
జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం, స్టడీ సర్కిల్స్ అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 7 గంటలకే గ్రంథాలయం అభ్యర్థులతో నిండిపోతోంది. వరుసగా నోటిఫికేషన్లు రావడంతో జిల్లాలోని నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉద్యోగాలు దక్కించుకునేందుకు ప్రణాళికబద్ధంగా చదువుతున్నారు. బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్స్లో శిక్షణ తీసుకుంటున్నారు.
HYD అంబర్పేట్లో మాజీ మంత్రి KTR.. BRS సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంబర్పేట్లో రోడ్డు పక్కన ఉన్న ఓ మిర్చి బండి మహిళతో KTR ముచ్చటించారు. ఆమెతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో BRSను గెలిపించాలని KTR కోరారు. మన తెలంగాణ గళం పార్లమెంట్లో వినిపించాలంటే BRSతోనే సాధ్యమని అన్నారు.
మెట్పల్లి మండల శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు రాత్రి పదిన్నర గంటల సమయంలో రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇరువురి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు.
భర్త వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల ప్రకారం.. KNRకి చెందిన మౌనికరెడ్డిని, హుజూరాబాద్కి చెందిన రాకేశ్రెడ్డితో 2016లో పెళ్లైంది. రాకేశ్కెడ్డి తండ్రి తన ఆస్తిలో కొంతస్థలాన్ని మనవడి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ఇద్దరికి గొడవలు జరుతున్నాయి. ఆదివారం మౌనిక తండ్రికి ఫోన్ చేసి భర్త వేధిస్తున్నాడని, తెలిపి ఉరేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కరీంనగర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం రోజుకొక పేరుతో చర్చలో నిలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం నేడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఇద్దరు సీనియర్ లీడర్లే మరి కాంగ్రెస్ టికెట్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
Sorry, no posts matched your criteria.