India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జీవిత బీమా ప్రీమియం 18% జీఎస్టీని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ), ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కరీంనగర్ డివిజన్ డిమాండ్ చేసింది. బీమా ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, క్లాస్ 3, 4 కేడర్ ఉద్యోగుల నియామకం, కనీస వేతనాలు రూ.26,000, ఏఐఐఈఏ గుర్తింపు వంటి తీర్మానాలను సమావేశం ఆమోదించింది.
కరీంనగర్లో సోమవారం పలు కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొంటారు. ఉదయం 10.30గంటలకు శాతవాహన యూనివర్సిటీ సమీపంలో వనమహోత్సవం కార్యక్రమంలో, మధ్యాహ్నం 1:00 గంటలకు సత్యనారాయణ స్వామి దేవాలయం, రాంనగర్లో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జరిగే జగన్నాథుడి రథయాత్ర ప్రారంభిస్తారు.
కరీంనగర్ పట్టణంలోని ఓ హోటల్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని ఆయన క్లాస్మేట్స్ ఆదివారం కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఎన్నో ఏళ్లు కలిసి చదువుకున్న తమ మిత్రుడు కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉండడం చూసి గర్విస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం బీజేపీ అధ్యక్షుడు బండం మల్లారెడ్డి, క్లాస్మేట్స్ పాల్గొన్నారు.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారని తన వ్యక్తి గత సహాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించనున్న 75వ వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జరిగే పూరీ జగన్నాథ స్వామి రథయాత్రను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా మల్యాలలో పీర్ల పండుగలో విషాదం చోటుచేసుకుంది. యువకుడు బేకం లక్ష్మణ్(25) పులి వేషంలో నృత్యం చేశాడు. మధ్యాహ్నం ఇంటికెళ్లి ఛాతిలో నొప్పి వస్తుంది అని చెప్పి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించగా.. మార్గమధ్యంలో యువకుడు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, బాబు, పాపం ఉన్నారు.
జమ్మికుంట మండలం శంభునిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పోలీసులు వారి నుంచి రూ.16,510 స్వాధీనం చేసుకున్నారు. వడ్లూరి రాజేశ్వర్, చింత రమణారెడ్డి, తన్నీరు శీను, మ్యాడగోని తిరుపతి, గడ్డం శ్రీనివాస్, మండల రాజేందర్ కర్నకంటి శ్రీనివాస్ రెడ్డి పట్టుబడ్డారు.
జిల్లాలో DSC పరీక్షను ఆన్లైన్ ద్వారా ఈనెల 18 నుంచి వచ్చేనెల 5 వరకు 5 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు DEO జనార్ధన్ రావు తెలిపారు. KNRలోని అల్ఫోర్స్ మహిళ డిగ్రీ కళాశాల, వాణినికేతన్ డిగ్రీ కళాశాల, వివేకానంద డిగ్రీ కళాశాల, ఎల్ఎండి కాలనీ లోని ion digital zone వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాల, హుజూరాబాద్ మండలం సింగపూర్లోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలున్నాయని చెప్పారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఎస్సారెస్పీలోకి 1,852 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 90.323 టీఎంసీలకు ప్రస్తుతం 12.536 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 494 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 6.775 టీఎంసీల నీరు వచ్చి చేరింది.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేటకు చెందిన శేఖర్(27) మృతదేహం స్వగ్రామానికి చేరింది. షార్జాలో 20 రోజులక్రితం శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు విషయాన్ని MLC జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో GWPC అధ్యక్షులు నరసింహ, రాము.. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు.
సీఏ ఫైనల్ పరీక్షలో కరీంనగర్ జిల్లా వాసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. నగరంలోని సప్తగిరికాలనీకి చెందిన సముద్రాల వికాస్ 600 మార్కులకు గానూ 350 సాధించి 58.33శాతంతో ఉత్తీర్ణ పొందారు. అయితే వీరి సొంతూరు హుజూరాబాద్ కాగా.. కొన్నేళ్లుగా కరీంనగర్లోని కోతిరాంపూర్లో ఉంటున్నారు. సీఏ ఫౌండేషన్ 2019లో, సీఏ ఇంటర్ 2020, సీఏ ఫైనల్ 2024లో పూర్తి చేశారు. దీంతో పలువురు వికాస్ను అభినందిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.