Karimnagar

News March 17, 2024

ఎల్లారెడ్డిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజి వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కేసీఆర్ కాలనీకి చెందిన మంద నారాయణ(56) అనే వ్యక్తి హమాలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం రాత్రి రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 17, 2024

ఓదెల: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

image

ఓదెలకు చెందిన వెంకటసాయి(28) బీటెక్ పూర్తి చేసుకుని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా తన సోదరుడు, సోదరి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. తనకు తక్కువ వేతనం ఉండి, చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని కొద్ది రోజులుగా మనస్తాపానికి గురవుతున్నాడు. దీంతో శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. HYDలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పొత్కపల్లి పోలీసులు తెలిపారు.

News March 17, 2024

పెద్దపల్లి: BSPకి దాసరి ఉష రాజీనామా

image

పెద్దపల్లి BSP ఇన్‌ఛార్జ్, దాసరి ఉష పార్టీకి శనివారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర BSP మాజీ అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్‌తో చర్చించి ఆయన రాజీనామా అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనను నాయకురాలిగా తీర్చిదిద్దిన పార్టీకి రుణపడి ఉంటానని చెప్పారు. కాగా, మోదీ బెదిరింపులతోBSP, BRS పొత్తు రద్దు కావడంతో వీరు రాజీనామా చేశారు.

News March 17, 2024

రోడ్డు ప్రమాదంలో కేశవపట్నంవాసి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శంకరపట్నం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కేశవపట్నంకి చెందిన తిరుపతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కేశవపట్నం నుంచి హుజురాబాద్ వెళ్తున్న టాటా ఏసీ ట్రాలీలో ప్రయాణిస్తున్న తిరుపతి, డ్రైవర్ గఫర్ హుజురాబాద్ మండలం సింగపూర్ శివారులో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో తిరుపతి అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

News March 17, 2024

లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

లోక్ సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయన సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమైనందున ఎన్నికల ప్రక్రియలు కొనసాగిస్తారన్నారు. ఎన్నికలు నిర్వహణలో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కలికంగా రద్దు చేస్తున్నామన్నారు. 

News March 16, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*ఎల్లారెడ్డిపేట మండలంలో కారు ఢీకొని వ్యక్తి మృతి.
*మెట్పల్లి మండలం ఆరపేటలో ముగ్గురు మహిళలను ఢీ కొట్టిన కారు.. తీవ్ర గాయాలు.
*జగిత్యాలలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వైద్యుడి అరెస్ట్
*ఎన్నికల నియమావళిని పాటించాలన్న సిరిసిల్ల కలెక్టర్.
*రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లొద్దన్న SRCL ఎస్పీ.
*జగిత్యాలలో ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు.
*రాయికల్ మండలంలో వ్యవసాయ బావిలో పడి యువకుడి మృతి.

News March 16, 2024

తిమ్మాపూర్ స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం రాత్రి సుమారు 10 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. గుర్తుతెలియని కారు అతడిని బలంగా ఢీ కొట్టిడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 16, 2024

రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దు: ఎస్పీ

image

ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సిరిసిల్ల జిల్లాలో 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిరోజు తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామన్నారు. ఆధారాలు ఇస్తే గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందన్నారు.

News March 16, 2024

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలి: కలెక్టర్

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటిస్తూ సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. సిరిసిల్ల కలెక్టరేట్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించవద్దని, కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల కోసం 24 గంటలు పనిచేసేలా 1950 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News March 16, 2024

ప్రధాని మోడీ సభకు వచ్చే వాహనాల పార్కింగ్ వివరాలు

image

నిజామాబాద్, కోరుట్ల, రాయికల్ నుండి వచ్చే వాహనాలను లింగంపేట రోడ్డు, బీట్ బజార్, మార్కెట్ యార్డులో పార్కింగ్ చేసుకోవాలని జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. కరీంనగర్ వైపు నుండి వచ్చేవారు మెడికల్ కాలేజీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్, ధర్మశాల పార్కింగ్ ప్లేస్‌లో, ధర్మపురి, సారంగాపూర్, గొల్లపల్లి వైపు నుండి వచ్చే వాహనాలను పాత బస్టాండ్ వద్ద గల మినీ స్టేడియంలో పార్కింగ్ చేసుకోవాలన్నారు.